ETV Bharat / international

దాడి జరిగిన 2 రోజులకు ఇమ్రాన్​ ఖాన్ స్పందన!​ - దాడి జరిగిన 2 రోజులకు ఇమ్రాన్​ ఖాన్ స్పందన!​

పాకిస్థాన్​లోని నన్​కానా సాహిబ్ గురుద్వారా​పై జరిగిన దాడిని... ఇమ్రాన్​ ఖాన్​ ఖండించారు. ఈ దాడి తన విధానానికి పూర్తిగా విరుద్ధమని... పాల్పడినవారిపై కఠిన చర్యలు తప్పవన్నారు.

pak-imran
పాక్​లోని గురుద్వారా దాడిని ఖండించిన ఇమ్రాన్​
author img

By

Published : Jan 5, 2020, 5:15 PM IST

Updated : Jan 5, 2020, 5:39 PM IST

పాకిస్థాన్‌లోని సిక్కుల పవిత్ర స్థలం నన్‌కానా సాహిబ్‌ గురుద్వారా వద్ద శుక్రవారం జరిగిన విధ్వంసకర చర్యల్ని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్ 2 రోజుల తర్వాత​ ఖండించారు. ఈ దాడి తన సిద్ధాంతానికి పూర్తి వ్యతిరేకమన్నారు. దాడికి పాల్పడినవారిని ఎట్టిపరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

"ఈ గురుద్వారా దాడి నా సిద్ధాంతానికి వ్యతిరేకం. ఈ దాడిని ఏమాత్రం సహించేదిలేదు. న్యాయస్థానం, పోలీసులు నుంచి సిక్కులకు రక్షణ ఉంటుంది."

-ఇమ్రాన్​ ఖాన్​, పాక్​ ప్రధాని ​

మరోసారి విషం...

భారత ప్రధాని నరేంద్ర మోదీపై మరోసారి తన అక్కసును వెళ్లగక్కారు ఇమ్రాన్​ ఖాన్​. భారత ప్రభుత్వం మద్దతులో పోలీసులు ముస్లింలపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. భారత్​లో ముస్లింలు, ఇతర మైనార్టీలపై జరుగుతున్న దాడులకు పాక్​లో జరిగిన గురుద్వారా దాడికి మధ్య చాలా తేడా ఉందని చెప్పుకొచ్చారు.

pak-imran
దాడి జరిగిన 2 రోజులకు ఇమ్రాన్​ ఖాన్ స్పందన!​

ఇదీ చూడండి : పాక్‌లో గురుద్వారాపై దాడి..ఖండించిన భారత్‌..!

ఇదీ చూడండి : గురుద్వారాపై దాడిని ఖండించిన ఎస్​జీపీసీ.. కమిటీ ఏర్పాటు

పాకిస్థాన్‌లోని సిక్కుల పవిత్ర స్థలం నన్‌కానా సాహిబ్‌ గురుద్వారా వద్ద శుక్రవారం జరిగిన విధ్వంసకర చర్యల్ని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్ 2 రోజుల తర్వాత​ ఖండించారు. ఈ దాడి తన సిద్ధాంతానికి పూర్తి వ్యతిరేకమన్నారు. దాడికి పాల్పడినవారిని ఎట్టిపరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

"ఈ గురుద్వారా దాడి నా సిద్ధాంతానికి వ్యతిరేకం. ఈ దాడిని ఏమాత్రం సహించేదిలేదు. న్యాయస్థానం, పోలీసులు నుంచి సిక్కులకు రక్షణ ఉంటుంది."

-ఇమ్రాన్​ ఖాన్​, పాక్​ ప్రధాని ​

మరోసారి విషం...

భారత ప్రధాని నరేంద్ర మోదీపై మరోసారి తన అక్కసును వెళ్లగక్కారు ఇమ్రాన్​ ఖాన్​. భారత ప్రభుత్వం మద్దతులో పోలీసులు ముస్లింలపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. భారత్​లో ముస్లింలు, ఇతర మైనార్టీలపై జరుగుతున్న దాడులకు పాక్​లో జరిగిన గురుద్వారా దాడికి మధ్య చాలా తేడా ఉందని చెప్పుకొచ్చారు.

pak-imran
దాడి జరిగిన 2 రోజులకు ఇమ్రాన్​ ఖాన్ స్పందన!​

ఇదీ చూడండి : పాక్‌లో గురుద్వారాపై దాడి..ఖండించిన భారత్‌..!

ఇదీ చూడండి : గురుద్వారాపై దాడిని ఖండించిన ఎస్​జీపీసీ.. కమిటీ ఏర్పాటు

New Delhi, Jan 05 (ANI): Google is sending out emails to its news subscribers informing about the discontinuation of its print-replica magazine service. According to Android Police, paid subscribers with an outstanding subscription will receive a full refund somewhere during the next month. Even as the service is ending and no new editions will be released, users will continue to have access to their existing library of purchased content. To read the latest articles, users are encouraged to follow that publication in Google News or visit their official website.

Last Updated : Jan 5, 2020, 5:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.