అఫ్గానిస్థాన్ కాబుల్ యూనివర్సిటీలో కాల్పులు జరిగాయి. దుండగుల దాడిలో ఆరుగురికి గాయాలైనట్లు ప్రభుత్వ వైద్యాధికారి అఖ్మల్ సామ్సర్ తెలిపారు. సోమవారం అఫ్గాన్, ఇరాన్ అధికారులు బుక్ ఎగ్జిబిషన్ను ప్రారంభిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని వివరించారు.
కాల్పుల సమయంలో క్యాంపస్లో తరగతులు నిర్వహిస్తున్నామని యూనివర్సిటీ ప్రొఫెసర్ జబియుల్లా హైదరీ తెలిపారు. వెంటనే భద్రతా బలగాలతో కలసి విద్యార్థులను బయటకు తరలించామని వివరించారు.
భద్రతా బలగాలు క్యాంపస్కు వచ్చే దారుల్ని మూసివేశారు. ఏ సంస్థ ఈ దాడికి పాల్పడిందో తెలియాల్సి ఉంది.
గతంలోనూ
2016లోనూ కాబుల్లోని అమెరికన్ యూనివర్సిటీలో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 13మంది మరణించారు. గత నెలలో జరిగిన బాంబు దాడిలో 24మంది విద్యార్థులు మరణించగా, సుమారు 100మంది గాయపడ్డారు.
మరోసారి చర్చలు
అఫ్గాన్ ప్రభుత్వానికీ, తాలిబన్ల మధ్య శాంతి చర్చలు జరిగినా దాడులు మాత్రం ఆగటంలేదు. ప్రస్తుతం ఖతార్లోని దోహా నగరంలో మరోసారి శాంతి చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చల్లో భాగంగా అమెరికా , నాటో సైన్యాల్ని అఫ్గాన్ నుంచి ఉపసంహరించుకోవాలని తాలిబన్లు డిమాండ్ చేస్తున్నారు.