ETV Bharat / international

భారత్​లో కరోనాను ఎదుర్కొనేందుకు చైనా వైద్యుల సలహాలు

author img

By

Published : Mar 5, 2020, 6:48 AM IST

భారత్​లో ఇప్పటివరకు కరోనా వైరస్​ సోకిన వారి సంఖ్య 29కు చేరింది. ఈ నేపథ్యంలో వైరస్​ను అరికట్టేందుకు ఇక్కడి వైద్యులకు సలహాలు అందించారు చైనా ఉన్నత వైద్య అధికారులు.

Coronavirus: Top Chinese medics offer tips for Indian doctors
కరోనా ఎదుర్కొనేందుకు భారత వైద్యులకు చైనా సలహాలు

భారత్​లో కరోనా వైరస్​ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఇక్కడి వైద్యులకు సలహాలు ఇచ్చారు చైనా ఉన్నత వైద్యాధికారులు. వైరస్​ వ్యాప్తి అరికట్టడంలో వైద్య సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని, ప్రజలకు మాస్కులు ధరించటం, చేతులు శుభ్రం చేసుకోవడంపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.

రెండు నెలలుగా వుహాన్​ నగరంలో కరోనా కేసులను పర్యవేక్షిస్తున్న నలుగురు ఉన్నత వైద్య అధికారులు.. బుధవారం తొలిసారి ఆన్​లైన్​ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా భారత్​ వైద్య అధికారులకు సలహాలు అందించారు. ఆసియాలోనే ఎంతో ముఖ్యమైన భారత్​, చైనా దేశాలకు.. జనాభా, వైద్య వ్యవస్థ వంటి వాటిలో దగ్గరి పోలికలు ఉన్నాయని పేర్కొన్నారు.

ఇవి పాటిస్తే చాలు...

వైరస్​ను అరికట్టేందుకు భారత్​ తగినంత వైద్య సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని చైనా అధికారులు వివరించారు. రోగులకు చికిత్స అందించేందుకు వైద్య సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని, ఇందులో తమను తాము కాపాడుకునేలా కూడా తర్ఫీదు ఇవ్వాలని పేర్కొన్నారు. రోగులకు చాలినన్ని గదులను సిద్ధం చేయాలన్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా మాస్కులు ధరించడం, కనీస శుభ్రతపై ప్రజలకు వైద్యులు అవగాహన కలిగించాలని వెల్లడించారు.

భారత్​లో 29 కేసులు

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు వైరస్ కారణంగా 3 వేలకుపైగా మరణించారు. 90 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. భారత్​లో ఇప్పటివరకు 29 కేసులను గుర్తించారు.

భారత్​లో కరోనా వైరస్​ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఇక్కడి వైద్యులకు సలహాలు ఇచ్చారు చైనా ఉన్నత వైద్యాధికారులు. వైరస్​ వ్యాప్తి అరికట్టడంలో వైద్య సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని, ప్రజలకు మాస్కులు ధరించటం, చేతులు శుభ్రం చేసుకోవడంపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.

రెండు నెలలుగా వుహాన్​ నగరంలో కరోనా కేసులను పర్యవేక్షిస్తున్న నలుగురు ఉన్నత వైద్య అధికారులు.. బుధవారం తొలిసారి ఆన్​లైన్​ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా భారత్​ వైద్య అధికారులకు సలహాలు అందించారు. ఆసియాలోనే ఎంతో ముఖ్యమైన భారత్​, చైనా దేశాలకు.. జనాభా, వైద్య వ్యవస్థ వంటి వాటిలో దగ్గరి పోలికలు ఉన్నాయని పేర్కొన్నారు.

ఇవి పాటిస్తే చాలు...

వైరస్​ను అరికట్టేందుకు భారత్​ తగినంత వైద్య సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని చైనా అధికారులు వివరించారు. రోగులకు చికిత్స అందించేందుకు వైద్య సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని, ఇందులో తమను తాము కాపాడుకునేలా కూడా తర్ఫీదు ఇవ్వాలని పేర్కొన్నారు. రోగులకు చాలినన్ని గదులను సిద్ధం చేయాలన్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా మాస్కులు ధరించడం, కనీస శుభ్రతపై ప్రజలకు వైద్యులు అవగాహన కలిగించాలని వెల్లడించారు.

భారత్​లో 29 కేసులు

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు వైరస్ కారణంగా 3 వేలకుపైగా మరణించారు. 90 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. భారత్​లో ఇప్పటివరకు 29 కేసులను గుర్తించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.