ETV Bharat / international

ఇతర దేశాల్లో అనధికారికంగా 'చైనా' వ్యాక్సిన్ ట్రయల్స్​!

author img

By

Published : Aug 21, 2020, 3:29 PM IST

పాపువా న్యూ గినియాలోని ఓ చైనా సంస్థ 48మందిపై కరోనా వ్యాక్సిన్​ ట్రయల్స్ నిర్వహించినట్లు తెలపడం చర్చనీయాంశమైంది. తమ దేశంలో వ్యాక్సిన్​ ప్రయోగాలకు అనుమతి లేదని పాపువా న్యూ గినియా ఆరోగ్య మంత్రి తెలిపారు. దీనిపై విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు.

Chinese mining company used COVID-19 vaccine in PNG
ఇతర దేశాల్లో అనధికారికంగా చైనా వ్యాక్సిన్ ట్రయల్స్​!

కరోనా వ్యాక్సిన్​ ట్రయల్స్​ను ఇతర దేశాల్లో ఇష్టానుసారంగా నిర్వహిస్తోంది చైనా. అధికారిక అనుమతి లేకుండా తమ దేశానికి చెందిన సంస్థల్లోని ఉద్యోగులపై వీటిని ప్రయోగిస్తోంది. దక్షిణ పసిపిక్ ద్వీపకల్ప దేశం పాపువా న్యూ గినియాలో 'చైనాకు చెందిన రము నికో మేనేజ్​మెంట్​ (ఎంసీసీ) అనే మైనింగ్​ సంస్థ తమ సిబ్బందిలోని 48మందిపై వ్యాక్సిన్​ ట్రయల్స్​ జరిపినట్లు' ఆస్ట్రేలియా పత్రిక వెల్లడించింది. ఆగస్టు 10న వ్యాక్సిన్​ను ఉద్యోగులపై ప్రయోగించినట్లు ఎంసీసీ లెటర్​హెడ్ కూడా విడుదల చేసింది.

ఈ విషయంపై పాపువా న్యూ గినియా ఆరోగ్య మంత్రి వోంగ్​ తీవ్రంగా స్పందించారు. తమ దేశంలో కరోనా వ్యాక్సిన్​ ట్రయల్స్​కు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఈ విషయంపై దర్యాప్తు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. 180 మంది చైనా సిబ్బందితో వచ్చిన విమానాన్ని వెనక్కిపంపించినట్లు వెల్లడించారు.

అలా ఎలా చేస్తారు..?

ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న వ్యాక్సిన్లకు జాతీయ ఆరోగ్య శాఖ ఆమోదం తెలిపి ధ్రువీకరించాకే ట్రయల్స్​ నిర్వహించాలని, ఇప్పటి వరకు తాము ఒక్క వ్యాక్సిన్​ను కూడా అధికారికంగా ఆమోదించలేదని జాతీయ స్థాయి అధికారి డేవిడ్ మేనింగ్​ చెప్పారు. వ్యాక్సిన్.. కచ్చితంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలను పాటించాల్సి ఉందన్నారు.

ఎంసీసీ సిబ్బందిపై నిర్వహించిన కరోనా వ్యాక్సిన్​ ట్రయల్స్​లో ప్రతికూల ఫలితాలు వచ్చే ప్రమాదం ఉందని పాపువా న్యూ గినియా ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసినట్లు 'ది ఆస్ట్రేలియా' పత్రిక కథనం ప్రచురించింది.

చైనా సంస్థ మెటాలర్జికల్​ కార్పొరేషన్​.. ఎంసీసీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఉద్యోగులపై వ్యాక్సిన్​ ట్రయల్స్​కు సంబంధించి చైనా రాయబారికి మేనింగ్ లేఖ రాశారు. ఈ విషయంపై ఎంసీసీకి, చైనా రాజధాని బీజింగ్​లోని మాతృసంస్థ ప్రధాన కార్యాలయానికి ఫోన్ చేసినా ఎలాంటి స్పందన లేదు.

పాపువా న్యూ గినియా 9 లక్షల జనాభా ఉన్న చిన్న ద్వీపకల్ప దేశం. ఇండోనేసియా, ఆస్ట్రేలియా దీనికి అత్యంత సమీపంలో ఉంటాయి. ఈ రెండు దేశాలే అధికంగా విదేశీ సాయం అందిస్తుంటాయి. పాపువా న్యూ గినియాలో 361 కరోనా​ కేసులు, నాలుగు మరణాలు సంభవించాయి. అయితే గత నెల నుంచి రాజధాని పోర్ట్​ మోర్స్​బైలో కేసుల సంఖ్య పెరిగింది.

ఇదీ చూడండి: చైనా ఆర్మీ వంటశాలల్లో రోబోల నియామకం!

కరోనా వ్యాక్సిన్​ ట్రయల్స్​ను ఇతర దేశాల్లో ఇష్టానుసారంగా నిర్వహిస్తోంది చైనా. అధికారిక అనుమతి లేకుండా తమ దేశానికి చెందిన సంస్థల్లోని ఉద్యోగులపై వీటిని ప్రయోగిస్తోంది. దక్షిణ పసిపిక్ ద్వీపకల్ప దేశం పాపువా న్యూ గినియాలో 'చైనాకు చెందిన రము నికో మేనేజ్​మెంట్​ (ఎంసీసీ) అనే మైనింగ్​ సంస్థ తమ సిబ్బందిలోని 48మందిపై వ్యాక్సిన్​ ట్రయల్స్​ జరిపినట్లు' ఆస్ట్రేలియా పత్రిక వెల్లడించింది. ఆగస్టు 10న వ్యాక్సిన్​ను ఉద్యోగులపై ప్రయోగించినట్లు ఎంసీసీ లెటర్​హెడ్ కూడా విడుదల చేసింది.

ఈ విషయంపై పాపువా న్యూ గినియా ఆరోగ్య మంత్రి వోంగ్​ తీవ్రంగా స్పందించారు. తమ దేశంలో కరోనా వ్యాక్సిన్​ ట్రయల్స్​కు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఈ విషయంపై దర్యాప్తు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. 180 మంది చైనా సిబ్బందితో వచ్చిన విమానాన్ని వెనక్కిపంపించినట్లు వెల్లడించారు.

అలా ఎలా చేస్తారు..?

ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న వ్యాక్సిన్లకు జాతీయ ఆరోగ్య శాఖ ఆమోదం తెలిపి ధ్రువీకరించాకే ట్రయల్స్​ నిర్వహించాలని, ఇప్పటి వరకు తాము ఒక్క వ్యాక్సిన్​ను కూడా అధికారికంగా ఆమోదించలేదని జాతీయ స్థాయి అధికారి డేవిడ్ మేనింగ్​ చెప్పారు. వ్యాక్సిన్.. కచ్చితంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలను పాటించాల్సి ఉందన్నారు.

ఎంసీసీ సిబ్బందిపై నిర్వహించిన కరోనా వ్యాక్సిన్​ ట్రయల్స్​లో ప్రతికూల ఫలితాలు వచ్చే ప్రమాదం ఉందని పాపువా న్యూ గినియా ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసినట్లు 'ది ఆస్ట్రేలియా' పత్రిక కథనం ప్రచురించింది.

చైనా సంస్థ మెటాలర్జికల్​ కార్పొరేషన్​.. ఎంసీసీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఉద్యోగులపై వ్యాక్సిన్​ ట్రయల్స్​కు సంబంధించి చైనా రాయబారికి మేనింగ్ లేఖ రాశారు. ఈ విషయంపై ఎంసీసీకి, చైనా రాజధాని బీజింగ్​లోని మాతృసంస్థ ప్రధాన కార్యాలయానికి ఫోన్ చేసినా ఎలాంటి స్పందన లేదు.

పాపువా న్యూ గినియా 9 లక్షల జనాభా ఉన్న చిన్న ద్వీపకల్ప దేశం. ఇండోనేసియా, ఆస్ట్రేలియా దీనికి అత్యంత సమీపంలో ఉంటాయి. ఈ రెండు దేశాలే అధికంగా విదేశీ సాయం అందిస్తుంటాయి. పాపువా న్యూ గినియాలో 361 కరోనా​ కేసులు, నాలుగు మరణాలు సంభవించాయి. అయితే గత నెల నుంచి రాజధాని పోర్ట్​ మోర్స్​బైలో కేసుల సంఖ్య పెరిగింది.

ఇదీ చూడండి: చైనా ఆర్మీ వంటశాలల్లో రోబోల నియామకం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.