ETV Bharat / international

3 రోజుల్లో భూమిపైకి చంద్రుడి నమూనాలు! - చాంగే-5 మిషన్​

చంద్రుడిపై నమూనాలు త్వరలోనే భూమికి చేరనున్నాయి. నమూనాలు సేకరించిన ఛాంగే-5 క్యాప్యూల్​ చంద్రుడి కక్ష్య నుంచి తిరిగి భూమికి తన పయనాన్ని మొదలు పెట్టినట్లు చైనా రోదసీ సంస్థ తెలిపింది. ఇందుకు మూడు రోజులు సమయం పడుతుందని వెల్లడించింది.

Chinese capsule
Chinese capsuleచంద్రుడి నమూనాలతో 3 రోజుల్లో భూమిపైకి చైనీస్​ క్యాప్యూల్​​
author img

By

Published : Dec 13, 2020, 1:40 PM IST

చంద్రుడి ఉపరితలంపై నమూనాల సేకరణకు వెళ్లిన చైనా మిషన్​ చాంగే-5 క్యాప్సూల్.. ఆ నమూనాలతో భూమి మీదకు పయనాన్ని మొదలుపెట్టింది. డిసెంబర్ మొదట్లో చంద్రుడిపై 2 కిలోల బరువైన నమూనాలు సేకరించి.. అక్కడ డ్రాగన్ జెండాను పాతిన క్యాప్సూల్‌ అనంతరం తిరిగి చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. ఆ తర్వాత కొద్ది రోజులపాటు చంద్రుడి కక్ష్యలోనే పరిభ్రమించిన క్యాప్సూల్‌.. తిరిగి భూమికి తన ప్రయాణం ప్రారంభించింది.

ముడు రోజుల సమయం..

చైనీస్ క్యాప్సూల్ భూమికి చేరుకునేందుకు మూడు రోజుల సమయం పడుతుందని చైనా రోదసీ సంస్థ తెలిపింది. ఆ క్యాప్సూల్ ఉత్తర చైనాలోని ఇన్నర్​ మంగోలియా ప్రాంతంలో దిగనుంది.

1976లో సోవియట్ యూనియన్ చేపట్టిన లూనార్‌ ప్రోబ్ తర్వాత ఇన్నేళ్లకు.. చంద్రుడి నమూనాలు భూమి మీదకు వస్తున్నాయి.

ఇదీ చూడండి: మరో కీలక ఘట్టం పూర్తి- 'చాంగే-5' తిరుగుప్రయాణం

చంద్రుడి ఉపరితలంపై నమూనాల సేకరణకు వెళ్లిన చైనా మిషన్​ చాంగే-5 క్యాప్సూల్.. ఆ నమూనాలతో భూమి మీదకు పయనాన్ని మొదలుపెట్టింది. డిసెంబర్ మొదట్లో చంద్రుడిపై 2 కిలోల బరువైన నమూనాలు సేకరించి.. అక్కడ డ్రాగన్ జెండాను పాతిన క్యాప్సూల్‌ అనంతరం తిరిగి చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. ఆ తర్వాత కొద్ది రోజులపాటు చంద్రుడి కక్ష్యలోనే పరిభ్రమించిన క్యాప్సూల్‌.. తిరిగి భూమికి తన ప్రయాణం ప్రారంభించింది.

ముడు రోజుల సమయం..

చైనీస్ క్యాప్సూల్ భూమికి చేరుకునేందుకు మూడు రోజుల సమయం పడుతుందని చైనా రోదసీ సంస్థ తెలిపింది. ఆ క్యాప్సూల్ ఉత్తర చైనాలోని ఇన్నర్​ మంగోలియా ప్రాంతంలో దిగనుంది.

1976లో సోవియట్ యూనియన్ చేపట్టిన లూనార్‌ ప్రోబ్ తర్వాత ఇన్నేళ్లకు.. చంద్రుడి నమూనాలు భూమి మీదకు వస్తున్నాయి.

ఇదీ చూడండి: మరో కీలక ఘట్టం పూర్తి- 'చాంగే-5' తిరుగుప్రయాణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.