ETV Bharat / international

మయన్మార్​ హింసపై జో బైడెన్ ఆందోళన​

author img

By

Published : Mar 29, 2021, 11:35 AM IST

మయన్మార్​లో ఆందోళన చేస్తున్న ప్రజలపై కాల్పులు జరపటాన్ని తప్పుపట్టారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​. ఒక్కరోజే వంద మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన ఘటన చాలా బాధాకరమని ఆందోళన వ్యక్తం చేశారు. అనవసరంగా ప్రజల ప్రాణాలు బలితీసుకున్నారని, అది చాలా దారుణమైన చర్యగా అభివర్ణించారు.

Biden expresses outrage over civilian killings in Myanmar
'దారుణం.. ప్రజలను అన్యాయంగా బలితీసుకున్నారు'

మయన్మార్​లో సైనిక హింసను తీవ్రంగా తప్పుపట్టారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​. అమాయక ప్రజలపై అనవసరంగా కాల్పులకు పాల్పడటం సరికాదని సూచించారు. మయన్మార్​ సైన్యం అవలంబిస్తున్న తీరు క్రూరమైనదిగా పేర్కొన్నారు.

"ఇది చాలా క్రూరమైనది. పూర్తిగా దారుణం. ఎంతో మందిని అన్యాయంగా, అనవసరంగా బలిచేశారు. ఓకే రోజు వంద మందికిపైగా చనిపోయినట్లు తెలిసింది. అది చాలా దారుణమైన సంఘటన. "

- జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు

76వ సైనిక దినోత్సవాన మయన్మార్​ భద్రతా బలగాలు శనివారం పేట్రేగిపోయాయి. సైనిక పాలనకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న ఆందోళనకారులను పిట్టలను కాల్చినట్లు కాల్చేశాయి. దీంతో దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో 114 మంది చనిపోయారు. ఫిబ్రవరి 1న ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చివేసి, సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకున్న తర్వాత ఈ స్థాయిలో రక్తపాతం సంభవించడం ఇదే తొలిసారి.

ఇదీ చూడండి: మయన్మార్​ రక్తసిక్తం- ఒక్కరోజే 114 మంది మృతి

మయన్మార్​లో సైనిక హింసను తీవ్రంగా తప్పుపట్టారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​. అమాయక ప్రజలపై అనవసరంగా కాల్పులకు పాల్పడటం సరికాదని సూచించారు. మయన్మార్​ సైన్యం అవలంబిస్తున్న తీరు క్రూరమైనదిగా పేర్కొన్నారు.

"ఇది చాలా క్రూరమైనది. పూర్తిగా దారుణం. ఎంతో మందిని అన్యాయంగా, అనవసరంగా బలిచేశారు. ఓకే రోజు వంద మందికిపైగా చనిపోయినట్లు తెలిసింది. అది చాలా దారుణమైన సంఘటన. "

- జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు

76వ సైనిక దినోత్సవాన మయన్మార్​ భద్రతా బలగాలు శనివారం పేట్రేగిపోయాయి. సైనిక పాలనకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న ఆందోళనకారులను పిట్టలను కాల్చినట్లు కాల్చేశాయి. దీంతో దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో 114 మంది చనిపోయారు. ఫిబ్రవరి 1న ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చివేసి, సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకున్న తర్వాత ఈ స్థాయిలో రక్తపాతం సంభవించడం ఇదే తొలిసారి.

ఇదీ చూడండి: మయన్మార్​ రక్తసిక్తం- ఒక్కరోజే 114 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.