ప్రపంచంలో అతిపెద్ద వాణిజ్య కూటమి ఏర్పాటుకు చైనా సహా 14 దేశాలు అంగీకారం తెలిపాయి. ఆగ్నేయాసియ దేశాల 10వ నేషనల్ అసోసియేషన్ వార్షిక సదస్సు(ఏఎస్ఈఏఎన్) విరామంలో.. ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం (ఆర్సెప్) దేశాలు ఈ ఒప్పందంపై ఆదివారం వర్చువల్గా సంతకాలు చేయనున్నాయి.
కరోనా సంక్షోభం నుంచి రికవరీకి ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాయి ఆర్సెప్ దేశాలు.
ఎనిమిదేళ్ల సుధీర్ఘ చర్చల తర్వాత ఎంతో కష్టపడి.. చివరకి ఒప్పందం వరకు వచ్చామని మలేసియా వాణిజ్య మంత్రి మహమ్మద్ అజ్మిన్ అలీ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రక్షణాత్మక విధానాలు పాటించకుడా ఆర్సెప్ దేశాలు తమ మార్కెట్లను తెరిచాయని తెలిపారు.
ఈ ఒప్పందతో సభ్య దేశాల మధ్య ఇప్పటికే తక్కువగా ఉన్న టారీఫ్లు రానున్న రోజుల్లో ఇంకా తగ్గుతాయని తెలిపారు.