ETV Bharat / international

కరోనా: ఇరాన్​లో ఇద్దరు బలి.. చైనా జైళ్లల్లోనూ కేసులు

author img

By

Published : Feb 21, 2020, 10:53 PM IST

Updated : Mar 2, 2020, 3:06 AM IST

కరోనా వైరస్​తో ఇరాన్​లో మరో ఇద్దరు బలయ్యారు. ఇజ్రాయెల్​, లెబనాన్​లో మొదటి కేసు నమోదైంది. మహమ్మారి విజృంభణతో పలు దేశాల్లో రాకపోకలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. చైనాలోని జైళ్లలో వైరస్​ బారిన పడ్డవారి సంఖ్య శుక్రవారం భారీగా పెరిగింది.

Another virus hotspot surfaces in China: prisons
కరోనా: ఇరాన్​లో ఇద్దరు బలి.. చైనా జైళ్లలో పెరుగుతున్న కేసులు

ఇరాన్​లోనూ కరోనా వైరస్​ పంజా విసురుతోంది. తాజాగా మరో ఇద్దరు మృతి చెందగా.. 13 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఇరాన్​లో 18 మంది మృతి చెందారని ఇరాన్​ ఆరోగ్య శాఖ వెల్లడించింది. వైరస్​ను ఎదుర్కొనేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) నుంచి మెడికల్​ కిట్లను తెప్పించుకుంది ఈ దేశం. కరోనా ప్రభావంతో ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇరాక్​​ ప్రజలు.. ఇరాన్​​ వెళ్లకుండా నిషేధం విధించింది బాగ్దాద్. కువైట్​ నుంచి ఇరాన్​కు విమాన సేవలు కూడా నిలిపివేశారు.

ఇజ్రాయెల్​లో మొదటి కేసు..

ఇజ్రాయెల్​లో శుక్రవారం మొదటి కరోనా కేసు నమోదైంది. డైమండ్ ప్రిన్సెస్​ క్రూయిజ్​ నౌకలో నిర్భందం తర్వాత నుంచి ఇంటికి చేరుకున్న వ్యక్తిగా అతడిని గుర్తించారు. ఈ నౌకలో ప్రయాణించిన 15 మంది ఇజ్రాయెల్​ వాసుల్లో 11 మంది నిర్భందం నుంచి తమ ఇళ్లకు చేరుకున్నారు. మిగతావారిలో వైరస్​ లక్షణాలను గుర్తించారు. ఈ నేపథ్యంలో చైనా నుంచి వచ్చే అన్ని విమానాలపై ఆంక్షలు విధించింది ఇజ్రాయెల్​ ప్రభుత్వం.

చైనా జైళ్లలో 500మంది బాధితులు

చైనాలో కరోనా వైరస్​ సోకిన వారి సంఖ్య 74,756కు చేరింది. 2,118 మంది మృతి చెందారు. చైనా వ్యాప్తంగా ఉన్న జైళ్లలో 500 పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గురువారం నాటికి 220 ఉన్న కేసులు శుక్రవారం భారీగా పెరిగాయి. వుహాన్​లోని​ మహిళా జైలులోనే అధికంగా వైరస్​ బారినపడ్డారు.

ఇదీ చదవండి: 'గ్రే' జాబితాలోనే పాక్​.. జూన్​ వరకు గడువు

ఇరాన్​లోనూ కరోనా వైరస్​ పంజా విసురుతోంది. తాజాగా మరో ఇద్దరు మృతి చెందగా.. 13 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఇరాన్​లో 18 మంది మృతి చెందారని ఇరాన్​ ఆరోగ్య శాఖ వెల్లడించింది. వైరస్​ను ఎదుర్కొనేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) నుంచి మెడికల్​ కిట్లను తెప్పించుకుంది ఈ దేశం. కరోనా ప్రభావంతో ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇరాక్​​ ప్రజలు.. ఇరాన్​​ వెళ్లకుండా నిషేధం విధించింది బాగ్దాద్. కువైట్​ నుంచి ఇరాన్​కు విమాన సేవలు కూడా నిలిపివేశారు.

ఇజ్రాయెల్​లో మొదటి కేసు..

ఇజ్రాయెల్​లో శుక్రవారం మొదటి కరోనా కేసు నమోదైంది. డైమండ్ ప్రిన్సెస్​ క్రూయిజ్​ నౌకలో నిర్భందం తర్వాత నుంచి ఇంటికి చేరుకున్న వ్యక్తిగా అతడిని గుర్తించారు. ఈ నౌకలో ప్రయాణించిన 15 మంది ఇజ్రాయెల్​ వాసుల్లో 11 మంది నిర్భందం నుంచి తమ ఇళ్లకు చేరుకున్నారు. మిగతావారిలో వైరస్​ లక్షణాలను గుర్తించారు. ఈ నేపథ్యంలో చైనా నుంచి వచ్చే అన్ని విమానాలపై ఆంక్షలు విధించింది ఇజ్రాయెల్​ ప్రభుత్వం.

చైనా జైళ్లలో 500మంది బాధితులు

చైనాలో కరోనా వైరస్​ సోకిన వారి సంఖ్య 74,756కు చేరింది. 2,118 మంది మృతి చెందారు. చైనా వ్యాప్తంగా ఉన్న జైళ్లలో 500 పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గురువారం నాటికి 220 ఉన్న కేసులు శుక్రవారం భారీగా పెరిగాయి. వుహాన్​లోని​ మహిళా జైలులోనే అధికంగా వైరస్​ బారినపడ్డారు.

ఇదీ చదవండి: 'గ్రే' జాబితాలోనే పాక్​.. జూన్​ వరకు గడువు

Last Updated : Mar 2, 2020, 3:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.