ETV Bharat / international

'సైన్యం దాడిలో 90 మంది తాలిబన్లు హతం'

author img

By

Published : Dec 12, 2020, 8:58 PM IST

Updated : Dec 13, 2020, 6:22 AM IST

అఫ్గానిస్థాన్ సైన్యం జరిపిన దాడిలో 90 మంది తాలిబన్లు హతమైనట్లు ఆ దేశ రక్షణ శాఖ వెల్లడించింది. మరో తొమ్మిది మంది గాయపడ్డారని తెలిపింది. అయితే ఈ దాడి అసలు జరగనేలేదని తాలిబన్ పేర్కొంది.

US military confirms retaliatory airstrike against Taliban in Kandahar
'సైన్యం దాడిలో 90 మంది తాలిబన్లు బలి'

అఫ్గాన్ భద్రతా దళాలకు తాలిబన్లకు మధ్య భీకర పోరు జరిగింది. ఈ దాడిలో 90 మంది తాలిబన్లు హతమయ్యారు. మరో తొమ్మిది మంది గాయపడ్డారు.

కందహార్​లోని పంజ్వై, ఝరి, అర్ఘందాబ్, మైవాండ్ జిల్లాలలో ఈ ఉద్రిక్తతలు తలెత్తినట్లు అఫ్గాన్ రక్షణ శాఖ తెలిపింది. తాలిబన్ల దాడులను సైన్యం తిప్పికొట్టిందని వెల్లడించింది. వాహనాలను పేల్చేసే 15 ల్యాండ్​మైన్లను గుర్తించి, నిర్వీర్యం చేసినట్లు స్పష్టం చేసింది. ఉగ్రవాద కార్యకలాపాల్లో ఉపయోగించారని అనుమానిస్తున్న ఆయుధాలను ధ్వంసం చేశామని పేర్కొంది.

దాడి జరగలేదు..

అయితే అఫ్గాన్ ప్రకటను తాలిబన్ ఖండించింది. సైన్యంతో ఉద్రిక్తతలు తలెత్తనేలేదని పేర్కొంది. ఎలాంటి మరణాలు సంభవించలేదని వెల్లడించింది. 90 మంది మరణించారని ప్రభుత్వం చెప్పిన గణాంకాలు వాస్తవదూరంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. నైతిక స్థైర్యం కోల్పోయిన సైన్యానికి హామీలు ఇచ్చేందుకే తప్పుడు ప్రకటనలు చేశారని ఆరోపించింది.

'దాడి చేశాం'

మరోవైపు, డిసెంబర్ 10న కందహార్​ రాష్ట్రంలోని ఝరి జిల్లాలో తాలిబన్లపై వాయు మార్గంలో దాడులు నిర్వహించినట్లు అమెరికా తెలిపింది. ఏఎన్​డీఎస్ఎఫ్ చెక్​పాయింట్ వద్ద అఫ్గాన్ సైన్యంపై జరిగిన దాడికి బదులుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

అమెరికా దాడిని తాలిబన్ తప్పుబట్టింది. అమెరికా-తాలిబన్ మధ్య కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందానికి ఇది విఘాతం కలిగిస్తుందని పేర్కొంది. అమెరికా దాడి వల్ల అఫ్గాన్ పౌరులు బలయ్యారని ఆరోపించింది. కాగా.. ఈ ఆరోపణలను అఫ్గాన్ సైనికాధికారులు ఖండించారు.

అఫ్గాన్ భద్రతా దళాలకు తాలిబన్లకు మధ్య భీకర పోరు జరిగింది. ఈ దాడిలో 90 మంది తాలిబన్లు హతమయ్యారు. మరో తొమ్మిది మంది గాయపడ్డారు.

కందహార్​లోని పంజ్వై, ఝరి, అర్ఘందాబ్, మైవాండ్ జిల్లాలలో ఈ ఉద్రిక్తతలు తలెత్తినట్లు అఫ్గాన్ రక్షణ శాఖ తెలిపింది. తాలిబన్ల దాడులను సైన్యం తిప్పికొట్టిందని వెల్లడించింది. వాహనాలను పేల్చేసే 15 ల్యాండ్​మైన్లను గుర్తించి, నిర్వీర్యం చేసినట్లు స్పష్టం చేసింది. ఉగ్రవాద కార్యకలాపాల్లో ఉపయోగించారని అనుమానిస్తున్న ఆయుధాలను ధ్వంసం చేశామని పేర్కొంది.

దాడి జరగలేదు..

అయితే అఫ్గాన్ ప్రకటను తాలిబన్ ఖండించింది. సైన్యంతో ఉద్రిక్తతలు తలెత్తనేలేదని పేర్కొంది. ఎలాంటి మరణాలు సంభవించలేదని వెల్లడించింది. 90 మంది మరణించారని ప్రభుత్వం చెప్పిన గణాంకాలు వాస్తవదూరంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. నైతిక స్థైర్యం కోల్పోయిన సైన్యానికి హామీలు ఇచ్చేందుకే తప్పుడు ప్రకటనలు చేశారని ఆరోపించింది.

'దాడి చేశాం'

మరోవైపు, డిసెంబర్ 10న కందహార్​ రాష్ట్రంలోని ఝరి జిల్లాలో తాలిబన్లపై వాయు మార్గంలో దాడులు నిర్వహించినట్లు అమెరికా తెలిపింది. ఏఎన్​డీఎస్ఎఫ్ చెక్​పాయింట్ వద్ద అఫ్గాన్ సైన్యంపై జరిగిన దాడికి బదులుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

అమెరికా దాడిని తాలిబన్ తప్పుబట్టింది. అమెరికా-తాలిబన్ మధ్య కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందానికి ఇది విఘాతం కలిగిస్తుందని పేర్కొంది. అమెరికా దాడి వల్ల అఫ్గాన్ పౌరులు బలయ్యారని ఆరోపించింది. కాగా.. ఈ ఆరోపణలను అఫ్గాన్ సైనికాధికారులు ఖండించారు.

Last Updated : Dec 13, 2020, 6:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.