ETV Bharat / international

అఫ్గాన్​లో పేలుడు- 8మంది సైనికులు మృతి

author img

By

Published : Jan 30, 2021, 7:24 PM IST

అఫ్గానిస్థాన్​లో జరిగిన కారుబాంబు పేలుడులో ఎనిమిది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి తామే చేశామని తాలిబాన్లు ప్రకటించారు.

8 Afghan soldiers dead in car bombing
అఫ్గాన్​లో పేలుడు-8 మంది సైనికుల మృతి

అఫ్గానిస్థాన్​లోని నంగర్హర్ సైనిక స్థావరంపై కారు బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో కనీసం ఎనిమిది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారని సైన్యం ప్రకటించింది.

షిర్జాద్ జిల్లాలోని గండుమక్​లో పేలుడు పదార్థాలు నింపిన వాహనంతో సైనిక స్థావరంలోకి ఉగ్రవాదులు ప్రవేశించారని స్థానిక ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఉగ్రవాదులు జలాలాబాద్ నగరంలోనూ పేలుళ్లకు ప్రణాళికలు రచించారని.. ఈ మేరకు పేలుడు పదార్థాలు నింపిన వాహనాన్ని భద్రతా దళాలు కనుగొన్నాయని అధికారులు వెల్లడించారు.

ఈ పేలుళ్లకు బాధ్యత వహించిన తాలిబన్.. ముల్లా మొహమ్మద్ యూసుఫ్ కాందహారి అనే ముష్కరుడు పేలుడు పదార్థాలు ఉన్న కారుతో ఆత్మహుతికి పాల్పడ్డాడని వెల్లడించింది.

ఇదీ చదవండి: 'భారత్​-పాక్​ల మధ్య యుద్ధం ప్రపంచానికే పెను ముప్పు'

అఫ్గానిస్థాన్​లోని నంగర్హర్ సైనిక స్థావరంపై కారు బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో కనీసం ఎనిమిది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారని సైన్యం ప్రకటించింది.

షిర్జాద్ జిల్లాలోని గండుమక్​లో పేలుడు పదార్థాలు నింపిన వాహనంతో సైనిక స్థావరంలోకి ఉగ్రవాదులు ప్రవేశించారని స్థానిక ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఉగ్రవాదులు జలాలాబాద్ నగరంలోనూ పేలుళ్లకు ప్రణాళికలు రచించారని.. ఈ మేరకు పేలుడు పదార్థాలు నింపిన వాహనాన్ని భద్రతా దళాలు కనుగొన్నాయని అధికారులు వెల్లడించారు.

ఈ పేలుళ్లకు బాధ్యత వహించిన తాలిబన్.. ముల్లా మొహమ్మద్ యూసుఫ్ కాందహారి అనే ముష్కరుడు పేలుడు పదార్థాలు ఉన్న కారుతో ఆత్మహుతికి పాల్పడ్డాడని వెల్లడించింది.

ఇదీ చదవండి: 'భారత్​-పాక్​ల మధ్య యుద్ధం ప్రపంచానికే పెను ముప్పు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.