పాకిస్థాన్, పీఓకేను భూకంపం కుదిపేసింది. ఈ భూకంపం దాటికి ఇప్పటివరకు 20 మంది మృతి చెందారు. చిన్నారులు, మహిళలు సహా 300పైగా మంది గాయపడ్డారు. పాక్ రాజధాని ఇస్లామాబాద్ సహా ఉత్తర భారతదేశంలోని పలు నగరాల్లో భూకంప ప్రభావం కనిపించింది.
పాకిస్థాన్ పంజాబ్లోని పర్వత నగరమైన జెహ్లం సమీపంలో 5.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని పాక్ వాతావరణశాఖ తెలిపింది. 10 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉందని స్పష్టం చేసింది. అయితే, భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.1గా నమోదైందని పాక్ విజ్ఞాన శాస్త్ర మంత్రి ఫవాద్ చౌదరి పేర్కొనడం గమనార్హం.
భూకంపం దాటికి పీఓకేలోని మీర్పుర్లో ఓ మసీదు కుప్పకూలింది. రోడ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. పరిస్థితుల తీవ్రత దృష్ట్యా ఆ ప్రాంతంలోని ఆసుపత్రుల వద్ద అధికారులు ఎమర్జెన్సీ ప్రకటించారు. భూకంప బాధితుల కోసం తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని.. ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా అధికారులను ఆదేశించారు.
పాకిస్థాన్లోని పెషావర్, రావల్పిండి, లాహోర్ సహా పలు నగరాల్లో భూకంప తీవ్రత కనిపించింది. భారత్లోని దిల్లీ, పంజాబ్, హరియాణాలోనూ భూమి కంపించింది.
ఇదీ చూడండి: పసిడి మళ్లీ పైపైకి.. నేడు ఎంత పెరిగిందంటే?