భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంలో మరో ముందడుగు పడింది. ఇరుదేశాల మధ్య నిర్మాణాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి భారత్- అమెరికా దేశాలు అంగీకరించాయి. భారత విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే మూడు రోజుల పాటు అమెరికాలో పర్యటించారు.
పర్యటన విజయవంతమైందని గోఖలే వెల్లడించారు. భారత్-పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో గోఖలే అమెరికా పర్యటన విజవంతమవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇరుదేశాలు ఇండో-పసిఫిక్ సమస్యలపై దృష్టిని కేంద్రీకరించాయి. వ్యూహాత్మక రక్షణ, ఆర్థిక సంబంధాలు మరింత పటిష్టం చేసుకోవాలనిభారత్-అమెరికానిర్ణయించాయి. అలాగే ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక 'పౌర అణు ఇంధన సహకార' ఒప్పందం కుదిరింది. ఫలితంగా భారత్లో అమెరికా ఆరు పౌర అణు విద్యుత్ కేంద్రాలను నెలకొల్పడానికి అంగీకరించింది.
మూడు రోజుల పర్యటనలో విజయ్గోఖలే, అమెరికా విదేశాంగమంత్రి మైక్ పాంపియో, జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్తో విడివిడిగా సమావేశమయ్యారు.
భారత్కు బాసటగా...
జమ్ముకశ్మీర్ పుల్వామాలో ఫిబ్రవరి 14న జైషే మహ్మద్ ఉగ్రదాడిలో 40 మంది భారత సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. దాడి అనంతరం ఇరుదేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో భారతకు అమెరికా తన మద్దతు ప్రకటించింది. భారత్ స్వీయ రక్షణ హక్కును అగ్రరాజ్యం సమర్థించింది. ఉగ్రవాదంపై పోరులో భారత్కు బాసటగా నిలుస్తామని హామీ ఇచ్చింది.
కలిసికట్టుగా ముందుకెళ్దాం..
మారణాయుధాల నిర్మూలన, వాటి సరఫరాను అడ్డుకోవాలనిభారత్-అమెరికాలు సంయుక్తంగా తీర్మానించాయి.