ETV Bharat / international

ఏదైనా ముందు మాకే.. తర్వాతే ఎగుమతులు: ట్రంప్

author img

By

Published : May 15, 2020, 9:21 AM IST

Updated : May 15, 2020, 9:27 AM IST

అమెరికా నిత్యావసర, అత్యవసర నిల్వలను తిరిగి పెంచుకునేందుకు ఉత్పత్తులు పెంచి, ఎగుమతులు తగ్గిస్తామని తెలిపారు అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. భవిష్యత్తులో కరోనా లాంటి మహమ్మారి విజృంభిస్తే, సమర్థవంతగా ఎదుర్కొనేందుకే ఈ ఆలోచన చేసినట్లు చెప్పారు.

Trump says he'll restock stockpile for future pandemics
ఏదైనా ముందు మాకే.. తర్వాతే ఎగుమతులు: ట్రంప్

భవిష్యత్తులో కరోనా లాంటి విపత్తు సంభవిస్తే ఎదుర్కొనేందుకు అత్యవసర, నిత్యావసర నిల్వలను పెంచాలన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. అమెరికాలో ఉత్పత్తి అయ్యే వస్తువులను.. ముందు దేశం కోసం నిల్వ చేసుకున్నాకే ఎగుమతి చేయాలని స్పష్టం చేశారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా పెన్సిల్వేనియా, అలెన్​టౌన్​లో పర్యటించిన ట్రంప్​ ఎగుమతులను తగ్గించి దేశీయ నిల్వలకు ప్రాధ్యాన్యమిస్తామన్నారు. మాస్కులు, వెంటిలేటర్లు వంటి వైద్య పరికరాల ఉత్పత్తిని విస్తృతంగా పెంచుతామన్నారు. భవిష్యత్తులో వచ్చే అధ్యక్షులు దేశంలో నిల్వలు లేక తనలా ఇబ్బంది పడకూడదని పేర్కొన్నారు.

ట్రంప్​ ప్రభుత్వం కరోనా విపత్తును ఎదర్కోవడంలో విఫలమైందని.. అమెరికా విజిల్​బ్లోయర్​ రిక్​ బ్రైట్​ హెచ్చరించిన రోజే ట్రంప్​ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

"నా లక్ష్యం ఏంటంటే.. అమెరికాకు కావల్సిన వస్తువులను ఉత్పత్తి చేసి భవిష్యత్తు కోసం నిల్వ చేయాలి. ఆ తర్వాతే ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయాలి. ప్రస్తుతం ప్రపంచంలో చెత్త సరఫరా గొలుసు ఉంది. దీంతో ఒక్క చోట చిన్న పొరపాటు జరిగితే ప్రపంచమంతా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే, యూఎస్​లో ఈ పద్ధతిని మార్చాలి. "

- డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు

ఇదీ చదవండి:తెరుచుకున్న బద్రినాథ్ ఆలయ తలుపులు

భవిష్యత్తులో కరోనా లాంటి విపత్తు సంభవిస్తే ఎదుర్కొనేందుకు అత్యవసర, నిత్యావసర నిల్వలను పెంచాలన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. అమెరికాలో ఉత్పత్తి అయ్యే వస్తువులను.. ముందు దేశం కోసం నిల్వ చేసుకున్నాకే ఎగుమతి చేయాలని స్పష్టం చేశారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా పెన్సిల్వేనియా, అలెన్​టౌన్​లో పర్యటించిన ట్రంప్​ ఎగుమతులను తగ్గించి దేశీయ నిల్వలకు ప్రాధ్యాన్యమిస్తామన్నారు. మాస్కులు, వెంటిలేటర్లు వంటి వైద్య పరికరాల ఉత్పత్తిని విస్తృతంగా పెంచుతామన్నారు. భవిష్యత్తులో వచ్చే అధ్యక్షులు దేశంలో నిల్వలు లేక తనలా ఇబ్బంది పడకూడదని పేర్కొన్నారు.

ట్రంప్​ ప్రభుత్వం కరోనా విపత్తును ఎదర్కోవడంలో విఫలమైందని.. అమెరికా విజిల్​బ్లోయర్​ రిక్​ బ్రైట్​ హెచ్చరించిన రోజే ట్రంప్​ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

"నా లక్ష్యం ఏంటంటే.. అమెరికాకు కావల్సిన వస్తువులను ఉత్పత్తి చేసి భవిష్యత్తు కోసం నిల్వ చేయాలి. ఆ తర్వాతే ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయాలి. ప్రస్తుతం ప్రపంచంలో చెత్త సరఫరా గొలుసు ఉంది. దీంతో ఒక్క చోట చిన్న పొరపాటు జరిగితే ప్రపంచమంతా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే, యూఎస్​లో ఈ పద్ధతిని మార్చాలి. "

- డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు

ఇదీ చదవండి:తెరుచుకున్న బద్రినాథ్ ఆలయ తలుపులు

Last Updated : May 15, 2020, 9:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.