ETV Bharat / international

'హౌదీ-మోదీ' వేదికగా ట్రంప్ కీలక ప్రకటన!

author img

By

Published : Sep 19, 2019, 1:37 PM IST

Updated : Oct 1, 2019, 4:49 AM IST

హ్యూస్టన్​ వేదికగా జరగనున్న 'హౌదీ-మోదీ' కార్యక్రమంలో భారత్​కు అనుకూలంగా కీలక ప్రకటన చేయనున్నట్లు సంకేతాలిచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. ఇరు దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య ఉద్రిక్తత, భారత్​కు జీఎస్పీ హోదా పునరుద్ధరణ అంశాలపైనే నిర్ణయం వెలువడొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈనెల 22న హౌదీ-మోదీ కార్యక్రమ వేదికగా భారత ప్రధాని, ట్రంప్​ భేటీ కానున్నారు.

'హౌదీ-మోదీ' వేదికగా ట్రంప్ కీలక ప్రకటన!

భారత్​-అమెరికా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి అగ్రరాజ్యం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈనెల 22న హ్యూస్టన్​లో జరగనున్న 'హౌదీ-మోదీ' కార్యక్రమంలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ భేటీ కానున్నారు. ఈ వేదికపై భారత్​కు అనుకూలంగా కీలక ప్రకటన చేయనున్నట్లు సంకేతాలిచ్చారు ట్రంప్​.

ముఖ్యంగా గత కొంత కాలంగా ఇరుదేశాల మధ్య నెలకొన్న వాణిజ్య ఉద్రిక్తతలు, భారత్​కు ప్రాధాన్యత గల దేశం హోదా (జీఎస్పీ) పునరుద్ధరణ వంటి అంశాలపైనే నిర్ణయం ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

భారత ప్రధాని మోదీతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు ట్రంప్​. హౌదీ-మోదీ కార్యక్రమంలో ఏదైన ప్రకటన చేయబోతున్నారా అన్న ప్రశ్నకు సమాధానంగా కొన్ని ప్రకటనలు ఉంటాయని తెలిపారు. హౌదీ-మోదీ కార్యక్రమానికి తాను హజరవుతున్నట్లు ప్రకటించిన అనంతరం సమావేశానికి నమోదు చేసుకున్న వారి సంఖ్య మరింత పెరిగిందన్నారు.

సుమారు 50వేల మంది భారతీయ అమెరికన్లతో ఏర్పాటు చేస్తోన్న కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరవుతున్నారు ట్రంప్​. ఒకే వేదికపై ట్రంప్​, మోదీ భేటీ కావటం ఇదే తొలిసారి. కాగా మూడు నెలల వ్యవధిలో ఇరువురి మధ్య ఇది మూడో సమావేశం. ఇటీవల జపాన్​లో జీ-20, ఫ్రాన్స్​లో జీ-7 సదస్సుల వేదికగా భేటీ అయ్యారు.

భేటీకి ముందే..

హ్యూస్టన్​లో మోదీ, ట్రంప్​ల భేటీకి ముందుగానే ఇరుదేశాల అధికారులు వాణిజ్య ఒప్పందాన్ని పూర్తి చేసే అవకాశం ఉందని నిపుణులు అంచనావేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం అమెరికా ఉత్పత్తులపై భారత్​ అధిక సుంకాలు విధిస్తుందని ట్రంప్​ ఆరోపించిన నేపథ్యంలో ఇరుదేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరుపక్షాలు సుంకాలు పెంచాయి. అనంతరం భారత్​కు వాణిజ్య ప్రాధాన్య హోదా (జీఎస్పీ)ను తొలగించారు ట్రంప్​.

భారత్​-అమెరికా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి అగ్రరాజ్యం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈనెల 22న హ్యూస్టన్​లో జరగనున్న 'హౌదీ-మోదీ' కార్యక్రమంలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ భేటీ కానున్నారు. ఈ వేదికపై భారత్​కు అనుకూలంగా కీలక ప్రకటన చేయనున్నట్లు సంకేతాలిచ్చారు ట్రంప్​.

ముఖ్యంగా గత కొంత కాలంగా ఇరుదేశాల మధ్య నెలకొన్న వాణిజ్య ఉద్రిక్తతలు, భారత్​కు ప్రాధాన్యత గల దేశం హోదా (జీఎస్పీ) పునరుద్ధరణ వంటి అంశాలపైనే నిర్ణయం ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

భారత ప్రధాని మోదీతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు ట్రంప్​. హౌదీ-మోదీ కార్యక్రమంలో ఏదైన ప్రకటన చేయబోతున్నారా అన్న ప్రశ్నకు సమాధానంగా కొన్ని ప్రకటనలు ఉంటాయని తెలిపారు. హౌదీ-మోదీ కార్యక్రమానికి తాను హజరవుతున్నట్లు ప్రకటించిన అనంతరం సమావేశానికి నమోదు చేసుకున్న వారి సంఖ్య మరింత పెరిగిందన్నారు.

సుమారు 50వేల మంది భారతీయ అమెరికన్లతో ఏర్పాటు చేస్తోన్న కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరవుతున్నారు ట్రంప్​. ఒకే వేదికపై ట్రంప్​, మోదీ భేటీ కావటం ఇదే తొలిసారి. కాగా మూడు నెలల వ్యవధిలో ఇరువురి మధ్య ఇది మూడో సమావేశం. ఇటీవల జపాన్​లో జీ-20, ఫ్రాన్స్​లో జీ-7 సదస్సుల వేదికగా భేటీ అయ్యారు.

భేటీకి ముందే..

హ్యూస్టన్​లో మోదీ, ట్రంప్​ల భేటీకి ముందుగానే ఇరుదేశాల అధికారులు వాణిజ్య ఒప్పందాన్ని పూర్తి చేసే అవకాశం ఉందని నిపుణులు అంచనావేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం అమెరికా ఉత్పత్తులపై భారత్​ అధిక సుంకాలు విధిస్తుందని ట్రంప్​ ఆరోపించిన నేపథ్యంలో ఇరుదేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరుపక్షాలు సుంకాలు పెంచాయి. అనంతరం భారత్​కు వాణిజ్య ప్రాధాన్య హోదా (జీఎస్పీ)ను తొలగించారు ట్రంప్​.

AP Video Delivery Log - 0600 GMT News
Thursday, 19 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0548: Thailand Haze No Access Thailand 4230709
Haze from Indonesian fires reaches south Thailand
AP-APTN-0510: Japan New Zealand AP Clients Only 4230708
Leaders of Japan and New Zealand hold talks
AP-APTN-0507: US DC Hong Kong AP Clients Only 4230707
Congressman: Hong Kong democracy act will get vote
AP-APTN-0502: US NV Sanders AP Clients Only 4230706
Bernie Sanders is still leading a revolution
AP-APTN-0412: Bolivia Museum AP Clients Only 4230704
Bolivia museum pays homage to Evo Morales
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Oct 1, 2019, 4:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.