ETV Bharat / international

సోషల్ మీడియాపై బైడెన్ ఫైర్.. ప్రజల్ని చంపేస్తోందంటూ..

author img

By

Published : Jul 17, 2021, 9:18 AM IST

సామాజిక మాధ్యమాల్లో టీకాలపై తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతుండటం పట్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియాలు ప్రజలను చంపేస్తున్నాయని అన్నారు. మరోవైపు, ప్రజల ప్రాణాలను కాపాడటంలో ఫేస్​బుక్ ఎంతగానో ఉపయోగపడుతోందని ఆ సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు.

vaccine misinformation biden
జో బైడెన్ టీకా దుష్ప్రచారం

తప్పుడు సమాచారంతో సామాజిక మాధ్యమాలు ప్రజలను చంపేస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. కరోనా టీకాలపై ఫేస్​బుక్​లో దుష్ప్రచారం జరుగుతోందని, దీనిపై స్పందించాలని శ్వేతసౌధంలో ఓ విలేకరి కోరగా.. ఇలా స్పందించారు. టీకా తీసుకోనివారిలోనే మహమ్మారి వ్యాప్తి చెందుతోందని పేర్కొన్నారు.

టీకాపై అసత్య వార్తలు ప్రచారం కావడం పట్ల అమెరికా సర్జన్ జనరల్ వివేక్ మూర్తి గురువారమే ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని 'ఇన్ఫోడెమిక్​'గా అభివర్ణించారు. వ్యాక్సిన్ల వల్లే కరోనా అదుపులోకి వచ్చిందని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాలు తప్పుడు వార్తలపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. లేదంటే ఇంకెంతో కాలం వేచి చూడకుండా.. తామే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

'కచ్చితమైన సమాచారమూ చూస్తున్నారు'

అయితే, ఈ వ్యవహారంపై ఫేస్​బుక్ ప్రతినిధి డానీ లీవర్ స్పందించారు. సరైన ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. నిజానికి ఫేస్​బుక్​లో కరోనా టీకాలపై కచ్చితమైన సమాచారాన్ని 200 కోట్ల మంది వీక్షించారని తెలిపారు. అంతర్జాలం మొత్తంలో ఇదే అత్యధికమని అన్నారు. టీకా ఎక్కడ లభిస్తుందనే వివరాలు వెల్లడించే 'వ్యాక్సిన్ ఫైండర్ టూల్​'ను 33 లక్షల మంది అమెరికన్లు ఉపయోగించారని చెప్పారు. ప్రాణాలను కాపాడటంలో ఫేస్​బుక్ ఎంతగానో సహాయపడుతోందని ఈ గణాంకాలతో స్పష్టమవుతోందని వివరించారు.

ఇదీ చదవండి: 'హబుల్ టెలిస్కోప్'​పై నాసా కీలక ప్రకటన

తప్పుడు సమాచారంతో సామాజిక మాధ్యమాలు ప్రజలను చంపేస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. కరోనా టీకాలపై ఫేస్​బుక్​లో దుష్ప్రచారం జరుగుతోందని, దీనిపై స్పందించాలని శ్వేతసౌధంలో ఓ విలేకరి కోరగా.. ఇలా స్పందించారు. టీకా తీసుకోనివారిలోనే మహమ్మారి వ్యాప్తి చెందుతోందని పేర్కొన్నారు.

టీకాపై అసత్య వార్తలు ప్రచారం కావడం పట్ల అమెరికా సర్జన్ జనరల్ వివేక్ మూర్తి గురువారమే ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని 'ఇన్ఫోడెమిక్​'గా అభివర్ణించారు. వ్యాక్సిన్ల వల్లే కరోనా అదుపులోకి వచ్చిందని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాలు తప్పుడు వార్తలపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. లేదంటే ఇంకెంతో కాలం వేచి చూడకుండా.. తామే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

'కచ్చితమైన సమాచారమూ చూస్తున్నారు'

అయితే, ఈ వ్యవహారంపై ఫేస్​బుక్ ప్రతినిధి డానీ లీవర్ స్పందించారు. సరైన ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. నిజానికి ఫేస్​బుక్​లో కరోనా టీకాలపై కచ్చితమైన సమాచారాన్ని 200 కోట్ల మంది వీక్షించారని తెలిపారు. అంతర్జాలం మొత్తంలో ఇదే అత్యధికమని అన్నారు. టీకా ఎక్కడ లభిస్తుందనే వివరాలు వెల్లడించే 'వ్యాక్సిన్ ఫైండర్ టూల్​'ను 33 లక్షల మంది అమెరికన్లు ఉపయోగించారని చెప్పారు. ప్రాణాలను కాపాడటంలో ఫేస్​బుక్ ఎంతగానో సహాయపడుతోందని ఈ గణాంకాలతో స్పష్టమవుతోందని వివరించారు.

ఇదీ చదవండి: 'హబుల్ టెలిస్కోప్'​పై నాసా కీలక ప్రకటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.