ETV Bharat / international

ట్రంప్​కు సొంత పార్టీ నేతల నుంచే మద్దతు కరవు

author img

By

Published : Nov 6, 2020, 11:36 AM IST

ఎన్నికల ఫలితాల విషయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తోన్న ఆరోపణలకు సొంత పార్టీ నుంచే మద్దతు కరవైంది. గెలుపుపై ముందస్తు ప్రకటన, ఓట్ల లెక్కింపు నిలిపివేతకు ట్రంప్ డిమాండ్ చేయటాన్ని కొంతమంది రిపబ్లికన్​ నేతలే వ్యతిరేకిస్తున్నారు.

trump republicans
ట్రంప్​

అమెరికా ఎన్నికల ఫలితాలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరిని సొంత పార్టీ నేతలే విభేదిస్తున్నారు. గెలిచినట్లు ముందుగానే ప్రకటించటం, కొన్ని రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపును నిలిపేయాలని కోరడాన్ని కొంత మంది రిపబ్లికన్లు తప్పుబడుతున్నారు. ఫలితంగా ట్రంప్​ ప్రయత్నాలకు పార్టీలోని కీలక నేతల మద్దతు కరవైంది.

ట్రంప్​ వైఖరిని వ్యతిరేకించిన వారిలో రిపబ్లికన్ సెనేటర్లు మిచ్ మెక్​కానెల్, మార్కో రుబియో, లీసా ముర్కోస్కీ, ఆడమ్​ కింజింజర్​ వంటి కీలక నేతలు ఉన్నారు. న్యాయంగా వేసిన ఓట్లను ఎన్ని రోజులు లెక్కించినా తప్పు కాదని, ఫలితాల విషయంలో ప్రతి ఒక్కరూ ఓపికగా ఎదురుచూడాలని సూచించారు.

  • Stop. Full stop. The votes will be counted and you will either win or lose. And America will accept that. Patience is a virtue. https://t.co/iZr78QoPIH

    — Adam Kinzinger (@RepKinzinger) November 4, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఇక చాలు.. ఆపండి. మీరు గెలిచినా ఓడినా.. ఓట్లను లెక్కించాల్సిందే. అమెరికా దాన్ని అంగీకరిస్తుంది. ఓపిక చాలా విలువైనది" అని కింజింజర్​ నేరుగా ట్రంప్​కే ట్వీట్ చేశారు.

నిక్కీ హేలీపై విమర్శలు..

రిపబ్లికన్​ పార్టీలో భారత సంతతి నేత నిక్కీ హేలీపై అధ్యక్షుడు కుమారుడు ట్రంప్ జూనియర్ విమర్శలు చేశారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉన్న వ్యక్తులు ప్రస్తుతం 'ఎన్నికల్లో కుట్ర'పై ట్రంప్​కు మద్దతు ఇవ్వటం లేదని మండిపడ్డారు. దేశంపై భారీ కుట్ర జరుగుతోందని డొనాల్డ్ ట్రంప్ ఆరోపించిన తర్వాత ఆయన కుమారుడు ఈ మేరకు ట్వీట్ చేశారు.

"ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇన్నాళ్లు ట్రంప్ పక్కన కూర్చున్న వాళ్లు నిశబ్దంగా ఉన్నారు. భవిష్యత్తు రిపబ్లికన్​ అభ్యర్థులగా చెప్పుకొనేవారు ఎక్కడున్నారు? నిక్కి హేలీ ఏం చేస్తున్నారు? వాళ్ల నుంచి ఎలాంటి స్పందన లేకపోవటం ఆశ్చర్యకరం. "

- ట్రంప్ జూనియర్

ఇదీ చూడండి: ట్రంప్​కు షాక్.. పిటిషన్లను కొట్టేసిన కోర్టులు

అమెరికా ఎన్నికల ఫలితాలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరిని సొంత పార్టీ నేతలే విభేదిస్తున్నారు. గెలిచినట్లు ముందుగానే ప్రకటించటం, కొన్ని రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపును నిలిపేయాలని కోరడాన్ని కొంత మంది రిపబ్లికన్లు తప్పుబడుతున్నారు. ఫలితంగా ట్రంప్​ ప్రయత్నాలకు పార్టీలోని కీలక నేతల మద్దతు కరవైంది.

ట్రంప్​ వైఖరిని వ్యతిరేకించిన వారిలో రిపబ్లికన్ సెనేటర్లు మిచ్ మెక్​కానెల్, మార్కో రుబియో, లీసా ముర్కోస్కీ, ఆడమ్​ కింజింజర్​ వంటి కీలక నేతలు ఉన్నారు. న్యాయంగా వేసిన ఓట్లను ఎన్ని రోజులు లెక్కించినా తప్పు కాదని, ఫలితాల విషయంలో ప్రతి ఒక్కరూ ఓపికగా ఎదురుచూడాలని సూచించారు.

  • Stop. Full stop. The votes will be counted and you will either win or lose. And America will accept that. Patience is a virtue. https://t.co/iZr78QoPIH

    — Adam Kinzinger (@RepKinzinger) November 4, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఇక చాలు.. ఆపండి. మీరు గెలిచినా ఓడినా.. ఓట్లను లెక్కించాల్సిందే. అమెరికా దాన్ని అంగీకరిస్తుంది. ఓపిక చాలా విలువైనది" అని కింజింజర్​ నేరుగా ట్రంప్​కే ట్వీట్ చేశారు.

నిక్కీ హేలీపై విమర్శలు..

రిపబ్లికన్​ పార్టీలో భారత సంతతి నేత నిక్కీ హేలీపై అధ్యక్షుడు కుమారుడు ట్రంప్ జూనియర్ విమర్శలు చేశారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉన్న వ్యక్తులు ప్రస్తుతం 'ఎన్నికల్లో కుట్ర'పై ట్రంప్​కు మద్దతు ఇవ్వటం లేదని మండిపడ్డారు. దేశంపై భారీ కుట్ర జరుగుతోందని డొనాల్డ్ ట్రంప్ ఆరోపించిన తర్వాత ఆయన కుమారుడు ఈ మేరకు ట్వీట్ చేశారు.

"ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇన్నాళ్లు ట్రంప్ పక్కన కూర్చున్న వాళ్లు నిశబ్దంగా ఉన్నారు. భవిష్యత్తు రిపబ్లికన్​ అభ్యర్థులగా చెప్పుకొనేవారు ఎక్కడున్నారు? నిక్కి హేలీ ఏం చేస్తున్నారు? వాళ్ల నుంచి ఎలాంటి స్పందన లేకపోవటం ఆశ్చర్యకరం. "

- ట్రంప్ జూనియర్

ఇదీ చూడండి: ట్రంప్​కు షాక్.. పిటిషన్లను కొట్టేసిన కోర్టులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.