ETV Bharat / international

అమెరికా ఎన్నికల్లో భారతీయులు అదుర్స్​

author img

By

Published : Nov 5, 2020, 8:57 AM IST

Updated : Nov 5, 2020, 1:23 PM IST

అమెరికా ఎన్నికల్లో భారత సంతతి అభ్యర్థుల హవా కొనసాగుతోంది. గత ఫలితాలను పునరావృతం చేస్తూ.. ప్రతినిధుల సభకు నలుగురు ఎన్నికయ్యారు. రాష్ట్ర చట్ట సభల్లోనూ ఐదుగురు మహిళలు సహా 12 మందికిపైగా ఎన్నికయ్యారు. నలుగురు అభ్యర్థులు ఓటమితో సరిపెట్టుకున్నారు.

us election
అమెరికా

అగ్రరాజ్యంలో భారతీయ అమెరికన్​ల జోరు కొనసాగిస్తూ.. మరోసారి నలుగురు అభ్యర్థులు ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. డెమొక్రటిక్​ పార్టీ తరఫున శాసనసభ్యులుగా బరిలోకి దిగిన డాక్టర్​ అమీ బెరా, ప్రమీలా జయపాల్​, రో ఖన్నా, రాజా కృష్ణమూర్తి ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు.

రాష్ట్రాల చట్టసభల్లోనూ భారత సంతతి అభ్యర్థులు సత్తా చాటారు. ఐదుగురు మహిళలు సహా 12 మందికిపైగా రాష్ట్రాల ప్రతినిధుల సభల ఎన్నికల్లో గెలుపొందారు. మిషిగన్​లో ప్రముఖ వ్యాపారవేత్త, శాస్త్రవేత్త డాక్టర్ థానేదార్ 93 శాతం ఓట్లతో ఘన విజయం సాధించారు.

'సమోసా కాకస్​'లో రెండో మహిళగా..

ప్రతినిధుల సభకు ఎన్నికైన భారతీయ అమెరికన్ల బృందాన్ని 'సమోసా కాకస్'​గా పిలుస్తారు. చట్టసభ్యుడు రాజా కృష్ణమూర్తి తొలిసారిగా ఈ పదబంధాన్ని ఉపయోగించారు.

అమెరికన్​ దిగువసభకు అరిజోనా ఆరో కాంగ్రెస్​ జిల్లా నుంచి రిపబ్లికన్ల తరపున బరిలోకి దిగిన డాక్టర్​ హీరాల్​ తిపిర్నేని.. ప్రత్యర్థి (డేవిడ్​ ష్వీకర్ట్)పై ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తోంది. 52 ఏళ్ల తిపిర్నేని ఈ సారి ఎన్నికైతే.. రెండోసారి ఈ ఘనత సాధించిన భారతీయ-అమెరికన్​ మహిళగా నిలవనున్నారు. 2016లో ప్రతినిధుల సభకు ఎన్నికైన జయపాల్​(55).. తొలి భారత సంతతి మహిళగా గుర్తింపు పొందారు.

'సమోసా కాకస్'లో ప్రస్తుతం ఐదుగురు భారతీయ-అమెరికన్ చట్టసభ సభ్యులు ఉన్నారు. ఇందులో నలుగురు ప్రతినిధుల సభ నుంచి ఎన్నికవ్వగా.. డెమొక్రటిక్​ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా బరిలోకి దిగిన కమలా హ్యారిస్​(56) సెనేటర్​గా ఉన్నారు.

గెలుపొందిన భారతీయ అమెరికన్లు..

  • రాజా కృష్ణమూర్తి(47) లిబర్టేరియన్​ పార్టీ అభ్యర్థి ప్రెస్టన్​ నెల్సన్​(30)పై అలవోక విజయం సాధించారు. 71 శాతం ఓట్లు కైవసం చేసుకొని ప్రత్యర్థిని ఓడించారు కృష్ణమూర్తి. ఫలితంగా వరుసగా మూడోసారి అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు.
  • రో ఖన్నా(44) రిపబ్లికన్​ పార్టీకి చెందిన తోటి భారత సంతతి వ్యక్తి రితేశ్​ టాండన్​(48)పై 50 శాతం ఓట్ల ఆధిక్యాన్ని కనబరిచారు. కాలిఫోర్నియాలోని 17వ కాంగ్రెస్​ జిల్లాలో ఆయనకు ఇది వరుసగా మూడో విజయం కావడం విశేషం.
  • 'సమోసా కాకస్​'లో అత్యంత సీనియర్​ సభ్యులైన డాక్టర్​ అమీ బెరా(55) వరుసగా ఐదోసారి ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. కాలిఫోర్నియాలోని ఏడో కాంగ్రెస్ జిల్లా తరఫున బరిలోకి దిగిన బెరా.. రిపబ్లికన్​ అభ్యర్థి బజ్​ ప్యాటర్సన్​పై 25 శాతం పాయింట్ల ఆధిక్యం ప్రదర్శించారు.
  • వాషింగ్టన్ రాష్ట్రం నుంచి బరిలోకి దిగిన ప్రమీలా జయపాల్‌ మూడోసారి విజయం సాధించారు.42 ఏళ్ల శ్రీ ప్రెస్టన్​ కులకర్ణి.. జీఓపీ అభ్యర్థి ట్రాయ్​ నెహ్ల్స్​(52)పై గెలుపు దిశగా సాగుతున్నారు. టెక్సాస్​లోని 22 కాంగ్రెస్​ జిల్లాలో బరిలోకి దిగిన కులకర్ణి.. ప్రత్యర్థి కంటే కేవలం 5 శాతం పాయింట్లు వెనుకంజలో ఉన్నారు.

ఓటమితో సరి

మరికొంత మంది భారత అమెరికన్ సంతతి అభ్యర్థులు ఓడిపోయినట్లు అమెరికన్ మీడియా వెల్లడించింది. న్యూజెర్సీ, మైన్​ నుంచి పోటీ చేసిన రికిన్ మెహతా, సారా గిద్వాన్​ సెనేట్ రేసులో ఓడిపోయారు.

ఈ ఎన్నికల్లో తొలిసారిగా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన మంగా అనంతాత్ముల కూడా పరాజయం పాలయ్యారు. రిపబ్లిక్​ పార్టీకి చెందిన నిషా శర్మ కూడా తన తొలి ప్రయత్నంలో విఫలమయ్యారు.

ఇదీ చూడండి: 6 అడుగుల దూరంలో బైడెన్​- న్యాయపోరాటానికి ట్రంప్

అగ్రరాజ్యంలో భారతీయ అమెరికన్​ల జోరు కొనసాగిస్తూ.. మరోసారి నలుగురు అభ్యర్థులు ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. డెమొక్రటిక్​ పార్టీ తరఫున శాసనసభ్యులుగా బరిలోకి దిగిన డాక్టర్​ అమీ బెరా, ప్రమీలా జయపాల్​, రో ఖన్నా, రాజా కృష్ణమూర్తి ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు.

రాష్ట్రాల చట్టసభల్లోనూ భారత సంతతి అభ్యర్థులు సత్తా చాటారు. ఐదుగురు మహిళలు సహా 12 మందికిపైగా రాష్ట్రాల ప్రతినిధుల సభల ఎన్నికల్లో గెలుపొందారు. మిషిగన్​లో ప్రముఖ వ్యాపారవేత్త, శాస్త్రవేత్త డాక్టర్ థానేదార్ 93 శాతం ఓట్లతో ఘన విజయం సాధించారు.

'సమోసా కాకస్​'లో రెండో మహిళగా..

ప్రతినిధుల సభకు ఎన్నికైన భారతీయ అమెరికన్ల బృందాన్ని 'సమోసా కాకస్'​గా పిలుస్తారు. చట్టసభ్యుడు రాజా కృష్ణమూర్తి తొలిసారిగా ఈ పదబంధాన్ని ఉపయోగించారు.

అమెరికన్​ దిగువసభకు అరిజోనా ఆరో కాంగ్రెస్​ జిల్లా నుంచి రిపబ్లికన్ల తరపున బరిలోకి దిగిన డాక్టర్​ హీరాల్​ తిపిర్నేని.. ప్రత్యర్థి (డేవిడ్​ ష్వీకర్ట్)పై ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తోంది. 52 ఏళ్ల తిపిర్నేని ఈ సారి ఎన్నికైతే.. రెండోసారి ఈ ఘనత సాధించిన భారతీయ-అమెరికన్​ మహిళగా నిలవనున్నారు. 2016లో ప్రతినిధుల సభకు ఎన్నికైన జయపాల్​(55).. తొలి భారత సంతతి మహిళగా గుర్తింపు పొందారు.

'సమోసా కాకస్'లో ప్రస్తుతం ఐదుగురు భారతీయ-అమెరికన్ చట్టసభ సభ్యులు ఉన్నారు. ఇందులో నలుగురు ప్రతినిధుల సభ నుంచి ఎన్నికవ్వగా.. డెమొక్రటిక్​ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా బరిలోకి దిగిన కమలా హ్యారిస్​(56) సెనేటర్​గా ఉన్నారు.

గెలుపొందిన భారతీయ అమెరికన్లు..

  • రాజా కృష్ణమూర్తి(47) లిబర్టేరియన్​ పార్టీ అభ్యర్థి ప్రెస్టన్​ నెల్సన్​(30)పై అలవోక విజయం సాధించారు. 71 శాతం ఓట్లు కైవసం చేసుకొని ప్రత్యర్థిని ఓడించారు కృష్ణమూర్తి. ఫలితంగా వరుసగా మూడోసారి అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు.
  • రో ఖన్నా(44) రిపబ్లికన్​ పార్టీకి చెందిన తోటి భారత సంతతి వ్యక్తి రితేశ్​ టాండన్​(48)పై 50 శాతం ఓట్ల ఆధిక్యాన్ని కనబరిచారు. కాలిఫోర్నియాలోని 17వ కాంగ్రెస్​ జిల్లాలో ఆయనకు ఇది వరుసగా మూడో విజయం కావడం విశేషం.
  • 'సమోసా కాకస్​'లో అత్యంత సీనియర్​ సభ్యులైన డాక్టర్​ అమీ బెరా(55) వరుసగా ఐదోసారి ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. కాలిఫోర్నియాలోని ఏడో కాంగ్రెస్ జిల్లా తరఫున బరిలోకి దిగిన బెరా.. రిపబ్లికన్​ అభ్యర్థి బజ్​ ప్యాటర్సన్​పై 25 శాతం పాయింట్ల ఆధిక్యం ప్రదర్శించారు.
  • వాషింగ్టన్ రాష్ట్రం నుంచి బరిలోకి దిగిన ప్రమీలా జయపాల్‌ మూడోసారి విజయం సాధించారు.42 ఏళ్ల శ్రీ ప్రెస్టన్​ కులకర్ణి.. జీఓపీ అభ్యర్థి ట్రాయ్​ నెహ్ల్స్​(52)పై గెలుపు దిశగా సాగుతున్నారు. టెక్సాస్​లోని 22 కాంగ్రెస్​ జిల్లాలో బరిలోకి దిగిన కులకర్ణి.. ప్రత్యర్థి కంటే కేవలం 5 శాతం పాయింట్లు వెనుకంజలో ఉన్నారు.

ఓటమితో సరి

మరికొంత మంది భారత అమెరికన్ సంతతి అభ్యర్థులు ఓడిపోయినట్లు అమెరికన్ మీడియా వెల్లడించింది. న్యూజెర్సీ, మైన్​ నుంచి పోటీ చేసిన రికిన్ మెహతా, సారా గిద్వాన్​ సెనేట్ రేసులో ఓడిపోయారు.

ఈ ఎన్నికల్లో తొలిసారిగా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన మంగా అనంతాత్ముల కూడా పరాజయం పాలయ్యారు. రిపబ్లిక్​ పార్టీకి చెందిన నిషా శర్మ కూడా తన తొలి ప్రయత్నంలో విఫలమయ్యారు.

ఇదీ చూడండి: 6 అడుగుల దూరంలో బైడెన్​- న్యాయపోరాటానికి ట్రంప్

Last Updated : Nov 5, 2020, 1:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.