ETV Bharat / international

దిల్లీ ప్రభుత్వ పాఠశాలకు ట్రంప్​ సతీమణి..!

author img

By

Published : Feb 20, 2020, 3:52 PM IST

Updated : Mar 1, 2020, 11:18 PM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ రెండురోజుల భారత పర్యటనలో భాగంగా అహ్మదాబాద్​, దిల్లీ ప్రాంతాలను సందర్శించనున్నారు. ట్రంప్​తో పాటు ఆయన సతీమణి మెలానియా ట్రంప్​ కూడా భారత్​కు రానున్నారు. అయితే.. ఆమె ఈ పర్యటనలో భాగంగా దిల్లీలోని ఓ ప్రభుత్వ పాఠశాలను సందర్శించనున్నట్లు సమాచారం.

Melania Trump to visit Delhi govt school during India visit: Sources
దిల్లీ ప్రభుత్వ పాఠశాలకు ట్రంప్​ సతీమణి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ఈనెల 24, 25 తేదీల్లో భారత్​లో పర్యటించనున్నారు. ట్రంప్​తో పాటే ఆయన భార్య మెలానియా ట్రంప్​ కూడా భారత్​కు వస్తున్నారు. పర్యటనలో భాగంగా ఆమె దిల్లీలోని ఓ ప్రభుత్వ పాఠశాలను సందర్శించనున్నట్లు తెలుస్తోంది.

ఈ నెల 24న అహ్మదాబాద్​లో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద మోటేరా స్టేడియాన్ని ట్రంప్​ ప్రారంభించనున్నారు. అహ్మదాబాద్​ పర్యటన అనంతరం దిల్లీకి చేరుకోనున్నారు.

25న అమెరికా అధ్యక్షుడికి రాష్ట్రపతి భవన్​లో ఘన స్వాగతం లభించనుంది. ఆ తరువాత భారత ప్రధాని నరేంద్ర మోదీతో ట్రంప్​ చర్చలు జరపనున్నారు. ఈ సమయంలో మెలానియా ట్రంప్​... దిల్లీలోని ఓ పాఠశాలను సందర్శించే అవకాశం ఉందని సమాచారం.

ఇదీ చదవండి: 'సీబీఎస్​ఈ' చొరవ.. వికాస కేంద్రాలుగా విద్యాలయాలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ఈనెల 24, 25 తేదీల్లో భారత్​లో పర్యటించనున్నారు. ట్రంప్​తో పాటే ఆయన భార్య మెలానియా ట్రంప్​ కూడా భారత్​కు వస్తున్నారు. పర్యటనలో భాగంగా ఆమె దిల్లీలోని ఓ ప్రభుత్వ పాఠశాలను సందర్శించనున్నట్లు తెలుస్తోంది.

ఈ నెల 24న అహ్మదాబాద్​లో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద మోటేరా స్టేడియాన్ని ట్రంప్​ ప్రారంభించనున్నారు. అహ్మదాబాద్​ పర్యటన అనంతరం దిల్లీకి చేరుకోనున్నారు.

25న అమెరికా అధ్యక్షుడికి రాష్ట్రపతి భవన్​లో ఘన స్వాగతం లభించనుంది. ఆ తరువాత భారత ప్రధాని నరేంద్ర మోదీతో ట్రంప్​ చర్చలు జరపనున్నారు. ఈ సమయంలో మెలానియా ట్రంప్​... దిల్లీలోని ఓ పాఠశాలను సందర్శించే అవకాశం ఉందని సమాచారం.

ఇదీ చదవండి: 'సీబీఎస్​ఈ' చొరవ.. వికాస కేంద్రాలుగా విద్యాలయాలు

Last Updated : Mar 1, 2020, 11:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.