ETV Bharat / international

'ట్రంప్​పై విమర్శలు ఎందుకు..? ఆ మందు మంచిదే' - Indian-American doctor

హైడ్రాక్సీక్లోరోక్విన్ ఔషధ వినియోగంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో అమెరికా భారత సంతతి డాక్టర్​ భరత్​ బరాయ్​ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఔషధానికి దుష్ప్రభావాలు ఉంటాయని, వైద్యుల పర్యవేక్షణలో క్లోరోక్విన్​ ఇస్తే.. సైడ్​ ఎఫెక్ట్స్​ ఏర్పడినా వాటిని తగ్గించొచ్చన్నారు. ఈ మందు చుట్టూ రాజకీయాలు చేయటం తగదన్నారు.

Hydroxychloroquine
హైడ్రాక్సీక్లోరోక్విన్​ ప్రమాదకరం కాదు
author img

By

Published : May 26, 2020, 3:59 PM IST

కరోనా చికిత్సకు మలేరియా మందు హైడ్రాక్సీక్లోరోక్విన్​ను వినియోగిస్తున్నాయి పలు దేశాలు. తాను కూడా ఈ మందును తీసుకుంటున్నట్లు ఇటీవల వెల్లడించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. అయితే.. ఈ మందు వినియోగంతో లాభాల కన్నా నష్టాలే ఎక్కువగా ఉన్నాయని పలు నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో హైడ్రాక్సీక్లోరోక్విన్​పై కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికాలోని భారత సంతతి డాక్టర్​ భరత్​ బరాయ్.

హెచ్​సీక్యూ వైద్యుల పర్యవేక్షణలో ఇచ్చినట్లయితే.. దుష్ప్రభావాలు తలెత్తినా తగ్గించొచ్చని పేర్కొన్నారు బరాయ్. అమెరికాలో హైడ్రాక్సీక్లోరోక్విన్​పై రాజకీయాలు చేస్తున్నారన్నారు.

కొన్ని మీడియా నివేదికలు, వైద్యులు అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ను విమర్శించటం, హైడ్రాక్సీక్లోరోక్విన్​ దుష్ప్రభావాలను ఎక్కువ చేసి చూపటాన్ని గమనించినట్లు పేర్కొన్నారు డా. భరత్​.

" అన్ని ఔషధాలు కొంత మేర దుష్ప్రభావాలను కలిగి ఉంటాయి. అది ఎప్పుడూ ప్రయోజనాలు, ప్రమాదాలపై ఆధారపడి ఉంటుంది. హైడ్రాక్సీక్లోరోక్విన్​ను ఎఫ్​డీఏ అనుమతించింది. లూపస్​, రుమటాయిడ్​ ఆర్థరైటిస్​, ఇతర రోగనిరోధక శక్తిపై ప్రభావం చూపే వ్యాధులకు సంవత్సరాలుగా ఈ మందును వినియోగిస్తున్నారు. చాలా మంది రోజుకు ఒకటి లేదా రెండు ట్యాబ్లెట్లను తీసుకుంటున్నారు. ఏళ్ల పాటు ప్రతిరోజు తీసుకునే వారికి సురక్షితమైతే.. కరోనా వైరస్​ చికిత్సలో కూడా ఇది సురక్షితమే. కరోనాతో తీవ్ర అనారోగ్యానికి గురైనవారు, పాజిటివ్​గా తేలిన వారికి 14 రోజుల పాటు చికిత్స చేసేందుకు దాని వినియోగం గురించి మాట్లాడుతున్నాం. వైద్యుల పర్యవేక్షణలో వినియోగిస్తే ఏదైనా దుష్ప్రబావాలు ఏర్పడితే.. వాటిని పరిష్కరించవచ్చు."

- భరత్​ బరాయ్​, ఆంకాలజిస్ట్​

ప్రపంచవ్యాప్తంగా ట్రయల్స్​లో ఉన్న ఔషధాల జాబితా నుంచి హైడ్రాక్సీక్లోరోక్విన్​ను తొలగిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈనెల 25న ప్రకటించింది. ఈ ఔషధం వల్ల కలిగే ప్రయోజనాలు, సమస్యలను నిపుణుల బృందం విశ్లేషిస్తుందని తెలిపారు.

జీవితాలను కాపాడే హైడ్రాక్సీక్లోరోక్విన్​ చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయన్నారు బరాయ్​. 'నిజమైన శాస్త్రీయ ఆధారాలు చూపడానికి బదులు.. అమెరికాలోని కొన్ని మీడియా సంస్థలు సహా పలువురు స్వార్థ ప్రయోజనాల కోసం చూస్తున్నారు. వారి రాజకీయ అజెండాలో భాగంగా హైడ్రాక్సీక్లోరక్విన్​పై దుష్ప్రచారాలు చేస్తున్నారు.

రాజకీయాలకు బదులు సైన్స్​కు కట్టుబడి ఉండాలి. న్యూయార్క్​ సహా అమెరికావ్యాప్తంగా పలువురు వైద్యులు హైడ్రాక్సీక్లోరోక్విన్​, అజిత్రోమైసిన్​ల కలయికను వినియోగిస్తున్నారని భరత్​ పేర్కొన్నారు.

అమెరికాలో కరోనా మహమ్మారి చికిత్సకు అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ వినతి మేరకు ఏప్రిల్​లో 50 మిలియన్​ హెచ్​సీక్యూ మందులను ఎగుమతి చేసింది భారత్​. ఇప్పటి వరకు అమెరికాలో 17 లక్షల మందికి వైరస్​ సోకింది. దాదాపు 99 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.

కరోనా చికిత్సకు మలేరియా మందు హైడ్రాక్సీక్లోరోక్విన్​ను వినియోగిస్తున్నాయి పలు దేశాలు. తాను కూడా ఈ మందును తీసుకుంటున్నట్లు ఇటీవల వెల్లడించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. అయితే.. ఈ మందు వినియోగంతో లాభాల కన్నా నష్టాలే ఎక్కువగా ఉన్నాయని పలు నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో హైడ్రాక్సీక్లోరోక్విన్​పై కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికాలోని భారత సంతతి డాక్టర్​ భరత్​ బరాయ్.

హెచ్​సీక్యూ వైద్యుల పర్యవేక్షణలో ఇచ్చినట్లయితే.. దుష్ప్రభావాలు తలెత్తినా తగ్గించొచ్చని పేర్కొన్నారు బరాయ్. అమెరికాలో హైడ్రాక్సీక్లోరోక్విన్​పై రాజకీయాలు చేస్తున్నారన్నారు.

కొన్ని మీడియా నివేదికలు, వైద్యులు అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ను విమర్శించటం, హైడ్రాక్సీక్లోరోక్విన్​ దుష్ప్రభావాలను ఎక్కువ చేసి చూపటాన్ని గమనించినట్లు పేర్కొన్నారు డా. భరత్​.

" అన్ని ఔషధాలు కొంత మేర దుష్ప్రభావాలను కలిగి ఉంటాయి. అది ఎప్పుడూ ప్రయోజనాలు, ప్రమాదాలపై ఆధారపడి ఉంటుంది. హైడ్రాక్సీక్లోరోక్విన్​ను ఎఫ్​డీఏ అనుమతించింది. లూపస్​, రుమటాయిడ్​ ఆర్థరైటిస్​, ఇతర రోగనిరోధక శక్తిపై ప్రభావం చూపే వ్యాధులకు సంవత్సరాలుగా ఈ మందును వినియోగిస్తున్నారు. చాలా మంది రోజుకు ఒకటి లేదా రెండు ట్యాబ్లెట్లను తీసుకుంటున్నారు. ఏళ్ల పాటు ప్రతిరోజు తీసుకునే వారికి సురక్షితమైతే.. కరోనా వైరస్​ చికిత్సలో కూడా ఇది సురక్షితమే. కరోనాతో తీవ్ర అనారోగ్యానికి గురైనవారు, పాజిటివ్​గా తేలిన వారికి 14 రోజుల పాటు చికిత్స చేసేందుకు దాని వినియోగం గురించి మాట్లాడుతున్నాం. వైద్యుల పర్యవేక్షణలో వినియోగిస్తే ఏదైనా దుష్ప్రబావాలు ఏర్పడితే.. వాటిని పరిష్కరించవచ్చు."

- భరత్​ బరాయ్​, ఆంకాలజిస్ట్​

ప్రపంచవ్యాప్తంగా ట్రయల్స్​లో ఉన్న ఔషధాల జాబితా నుంచి హైడ్రాక్సీక్లోరోక్విన్​ను తొలగిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈనెల 25న ప్రకటించింది. ఈ ఔషధం వల్ల కలిగే ప్రయోజనాలు, సమస్యలను నిపుణుల బృందం విశ్లేషిస్తుందని తెలిపారు.

జీవితాలను కాపాడే హైడ్రాక్సీక్లోరోక్విన్​ చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయన్నారు బరాయ్​. 'నిజమైన శాస్త్రీయ ఆధారాలు చూపడానికి బదులు.. అమెరికాలోని కొన్ని మీడియా సంస్థలు సహా పలువురు స్వార్థ ప్రయోజనాల కోసం చూస్తున్నారు. వారి రాజకీయ అజెండాలో భాగంగా హైడ్రాక్సీక్లోరక్విన్​పై దుష్ప్రచారాలు చేస్తున్నారు.

రాజకీయాలకు బదులు సైన్స్​కు కట్టుబడి ఉండాలి. న్యూయార్క్​ సహా అమెరికావ్యాప్తంగా పలువురు వైద్యులు హైడ్రాక్సీక్లోరోక్విన్​, అజిత్రోమైసిన్​ల కలయికను వినియోగిస్తున్నారని భరత్​ పేర్కొన్నారు.

అమెరికాలో కరోనా మహమ్మారి చికిత్సకు అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ వినతి మేరకు ఏప్రిల్​లో 50 మిలియన్​ హెచ్​సీక్యూ మందులను ఎగుమతి చేసింది భారత్​. ఇప్పటి వరకు అమెరికాలో 17 లక్షల మందికి వైరస్​ సోకింది. దాదాపు 99 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.