ETV Bharat / international

మరోసారి కొవిడ్​ పంజా- సాధారణ పరిస్థితి కలేనా?

author img

By

Published : Jul 15, 2021, 12:08 PM IST

టీకాల(Corona vaccine) పంపిణీ, కఠిన ఆంక్షలతో క్రమంగా తగ్గుతూ వచ్చిన కరోనా కేసులు(Corona cases) మరోసారి పెరుగుతూ ఆందోళన కలిగిస్తున్నాయి. గతవారం పెరిగిన మరణాలు, కేసులు.. సాధారణ పరిస్థితులు నెలకొంటాయనే ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి.

Coronavirus
కరోనా

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్(Covid-19) మరణాలు, కేసులు మరోసారి పెరగడం.. సాధారణ పరిస్థితులకు తిరిగి చేరతామనే ఆశలకు గండికొడుతోంది. మరోమారు ఆంక్షల విధింపు ఉంటుందనే ఆందోళన నెలకొంది. వరుసగా 9 వారాలపాటు తగ్గుతూ వచ్చిన కరోనా మరణాలు గతవారం పెరిగాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) బుధవారం వెల్లడించింది. ఏకంగా 55 వేల మంది కరోనాకు బలయ్యారని, అది అంతకుముందు వారంతో పోలిస్తే 3శాతం అధికమని తెలిపింది. బ్రెజిల్, భారత్, ఇండోనేషియా, బ్రిటన్​లో అత్యధిక కేసులతో అంతకుముందు వారంతో పోలిస్తే గతవారం 10 శాతం పెరిగి దాదాపు 30లక్షల కేసులు నమోదైనట్లు డబ్ల్యూహెచ్​ఓ తెలిపింది.

కొంపముంచిన నిర్లక్ష్యం..

అయితే అత్యల్ప స్థాయిలో టీకా పంపిణీ(Vaccination), మాస్కులు ధరించకపోవడం, ఆంక్షల సడలింపు సహా ఉద్ధృతంగా వ్యాపిస్తున్న డెల్టా వేరియంటే పరిస్థితి దిగజారడానికి కారణమని డబ్ల్యూహెచ్​ఓ విశ్లేషించింది. ప్రస్తుతం 111 దేశాల్లో డెల్టా రకం వైరస్​ను గుర్తించగా, రాబోయే రోజుల్లో అది మరింత తీవ్ర రూపం దాల్చనుందని అంచనా వేస్తోంది.

సడలింపులో జాగ్రత్త..

జనవరిలో రోజుకు 18 వేల మరణాలు సంభవించగా, 7 నెలల క్రితం ప్రారంభమైన టీకా కార్యక్రమంతో ప్రస్తుతానికి రోజువారీ మరణాలు 7900లకు దిగొచ్చాయి. కాగా, అమల్లో ఉన్న ఆంక్షలను ఎత్తివేయాలని చాలా దేశాల్లో ఒత్తిడి పెరుగుతోందని, అయితే అది సరైన పద్ధతిలో జరగకపోతే వైరస్​ వ్యాప్తికి మరింత అవకాశమిచ్చినట్లు అవుతుందని డబ్ల్యూహెచ్​ఓ హెచ్చరించింది.

ఇదీ చూడండి: కరోనా వేళ ఇలా ఉంటే ఆనందం!

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్(Covid-19) మరణాలు, కేసులు మరోసారి పెరగడం.. సాధారణ పరిస్థితులకు తిరిగి చేరతామనే ఆశలకు గండికొడుతోంది. మరోమారు ఆంక్షల విధింపు ఉంటుందనే ఆందోళన నెలకొంది. వరుసగా 9 వారాలపాటు తగ్గుతూ వచ్చిన కరోనా మరణాలు గతవారం పెరిగాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) బుధవారం వెల్లడించింది. ఏకంగా 55 వేల మంది కరోనాకు బలయ్యారని, అది అంతకుముందు వారంతో పోలిస్తే 3శాతం అధికమని తెలిపింది. బ్రెజిల్, భారత్, ఇండోనేషియా, బ్రిటన్​లో అత్యధిక కేసులతో అంతకుముందు వారంతో పోలిస్తే గతవారం 10 శాతం పెరిగి దాదాపు 30లక్షల కేసులు నమోదైనట్లు డబ్ల్యూహెచ్​ఓ తెలిపింది.

కొంపముంచిన నిర్లక్ష్యం..

అయితే అత్యల్ప స్థాయిలో టీకా పంపిణీ(Vaccination), మాస్కులు ధరించకపోవడం, ఆంక్షల సడలింపు సహా ఉద్ధృతంగా వ్యాపిస్తున్న డెల్టా వేరియంటే పరిస్థితి దిగజారడానికి కారణమని డబ్ల్యూహెచ్​ఓ విశ్లేషించింది. ప్రస్తుతం 111 దేశాల్లో డెల్టా రకం వైరస్​ను గుర్తించగా, రాబోయే రోజుల్లో అది మరింత తీవ్ర రూపం దాల్చనుందని అంచనా వేస్తోంది.

సడలింపులో జాగ్రత్త..

జనవరిలో రోజుకు 18 వేల మరణాలు సంభవించగా, 7 నెలల క్రితం ప్రారంభమైన టీకా కార్యక్రమంతో ప్రస్తుతానికి రోజువారీ మరణాలు 7900లకు దిగొచ్చాయి. కాగా, అమల్లో ఉన్న ఆంక్షలను ఎత్తివేయాలని చాలా దేశాల్లో ఒత్తిడి పెరుగుతోందని, అయితే అది సరైన పద్ధతిలో జరగకపోతే వైరస్​ వ్యాప్తికి మరింత అవకాశమిచ్చినట్లు అవుతుందని డబ్ల్యూహెచ్​ఓ హెచ్చరించింది.

ఇదీ చూడండి: కరోనా వేళ ఇలా ఉంటే ఆనందం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.