ETV Bharat / international

Delta Variant: 'అమెరికా ప్రయత్నాలకు ఇది అడ్డంకే'

అమెరికాకు డెల్టా వేరియంట్​తో పొంచి ఉన్న ముప్పుపై ప్రముఖ వైద్య నిపుణుడు ఆంటోనీ ఫౌచీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఆ వేరియంట్‌ను అడ్డుకొనే అయుధాలు మనచెంత ఉన్నాయని, వాటిని సమర్థవంతంగా ఉపయోగించుకుందామని పిలుపునిచ్చారు.

author img

By

Published : Jun 23, 2021, 3:29 PM IST

Delta variant
డెల్టా వేరియంట్

కరోనా వైరస్‌ను పారదోలడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు డెల్టా వేరియంట్ ముప్పుగా పరిణమించిందని ప్రముఖ వైద్య నిపుణుడు ఆంటోనీ ఫౌచీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. "మొదట వెలుగులోకి వచ్చిన కరోనా వేరియంట్‌ కంటే డెల్టా వేరియంట్‌కు వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉంది. అలాగే వ్యాధి తీవ్రతకు కూడా ఇది కారణమవుతోంది. అయితే, ఆ వేరియంట్‌ను అడ్డుకొనే అయుధాలు మనచెంత ఉన్నాయి. వాటిని సమర్థవంతంగా ఉపయోగించుకుందాం" అని ఫౌచీ అన్నారు. ఫైజర్, మోడెర్నా టీకాలతో సహా అమెరికాలో అందుబాటులో ఉన్న టీకాలన్నీ ఈ వేరియంట్‌పై ప్రభావంతంగా పనిచేస్తున్నాయని చెప్పారు.

జులై 4 నాటికి 70 శాతం మంది వయోజనులకు టీకాలు వేయాలనే లక్ష్యాన్ని చేరేందుకు.. అమెరికాకు మరికొంత సమయం పట్టేలా ఉంది. ఈ విషయాన్ని శ్వేతసౌధ సీనియర్ సలహాదారు జెఫ్రే జీంట్స్ వెల్లడించారు. అధికారిక గణాంకాల ప్రకారం సోమవారం నాటికి.. 45 శాతం మంది ప్రజలు టీకా రెండుడోసులను పొందారు.

భారత్‌లో రెండోదశలో కరోనా ఉగ్రరూపానికి డెల్టా వేరియంటే కారణమని నిపుణులు చెప్తున్నారు. ఈ వేరియంట్‌ను మొదట మనదేశంలోనే గుర్తించారు. ఇప్పటికే ఇది పలుదేశాలకు వ్యాపించింది. బ్రిటన్‌లో కొత్త కేసుల పెరుగుదలకు ఇదే కారణమవుతోందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీని విస్తృతిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

కరోనా వైరస్‌ను పారదోలడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు డెల్టా వేరియంట్ ముప్పుగా పరిణమించిందని ప్రముఖ వైద్య నిపుణుడు ఆంటోనీ ఫౌచీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. "మొదట వెలుగులోకి వచ్చిన కరోనా వేరియంట్‌ కంటే డెల్టా వేరియంట్‌కు వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉంది. అలాగే వ్యాధి తీవ్రతకు కూడా ఇది కారణమవుతోంది. అయితే, ఆ వేరియంట్‌ను అడ్డుకొనే అయుధాలు మనచెంత ఉన్నాయి. వాటిని సమర్థవంతంగా ఉపయోగించుకుందాం" అని ఫౌచీ అన్నారు. ఫైజర్, మోడెర్నా టీకాలతో సహా అమెరికాలో అందుబాటులో ఉన్న టీకాలన్నీ ఈ వేరియంట్‌పై ప్రభావంతంగా పనిచేస్తున్నాయని చెప్పారు.

జులై 4 నాటికి 70 శాతం మంది వయోజనులకు టీకాలు వేయాలనే లక్ష్యాన్ని చేరేందుకు.. అమెరికాకు మరికొంత సమయం పట్టేలా ఉంది. ఈ విషయాన్ని శ్వేతసౌధ సీనియర్ సలహాదారు జెఫ్రే జీంట్స్ వెల్లడించారు. అధికారిక గణాంకాల ప్రకారం సోమవారం నాటికి.. 45 శాతం మంది ప్రజలు టీకా రెండుడోసులను పొందారు.

భారత్‌లో రెండోదశలో కరోనా ఉగ్రరూపానికి డెల్టా వేరియంటే కారణమని నిపుణులు చెప్తున్నారు. ఈ వేరియంట్‌ను మొదట మనదేశంలోనే గుర్తించారు. ఇప్పటికే ఇది పలుదేశాలకు వ్యాపించింది. బ్రిటన్‌లో కొత్త కేసుల పెరుగుదలకు ఇదే కారణమవుతోందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీని విస్తృతిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ఇదీ చదవండి:జంట యాంటీబాడీలతో కొత్త వేరియంట్లకు చెక్​

టీకాలు వేసినా మళ్లీ మళ్లీ కరోనా.. కారణమిదే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.