ETV Bharat / international

'మోదీతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తోన్నా'​

author img

By

Published : Nov 18, 2020, 9:55 AM IST

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన జో బైడెన్​. కొవిడ్​ కట్టడి సహా ప్రపంచ సవాళ్లపై మోదీతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల తర్వాత ఇరువురు నేతలు నేరుగా ఫోన్​లో మాట్లాడుకున్నారు. కీలక విషయాలపై చర్చించారు.

Biden modi
జో బైడెన్

కొవిడ్​ మహమ్మారి సహా ప్రపంచ సవాళ్లపై భారత ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు చెప్పారు అమెరికా అధ్యక్ష ఎన్నికల విజేత జో బైడెన్​. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ చర్యలు, సురక్షితమైన, సంపన్నమైన ఇండో-పసిఫిక్​ ప్రాంతాన్ని నిర్వహించేందుకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు.

నవంబర్​ 3న జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత తొలిసారి భారత్​ ప్రధాని నరేంద్ర మోదీ, జో బైడెన్​ల మధ్య ఫోన్​ సంభాషణ జరిగింది. ఈ సందర్భంగా ఇరువురు నేతలు కీలక విషయాలపై చర్చించారు. బైడెన్​కు మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

" కరోనా కట్టడి సహా అంతర్జాతీయ సవాళ్లపై ప్రధాని మోదీతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తోన్నా. భవిష్యత్తులో ఎదురయ్యే ఆరోగ్య సంక్షోభాలను ఎదుర్కోవటం, పర్యావరణ మార్పులను తగ్గించటం, ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణ చర్యలను ప్రారంభించటం, దేశీయంగా, విదేశాల్లో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయటం, సురక్షితమైన, సుసంపన్నమైన ఇండో-పసిఫిక్​ ప్రాంతాన్ని నిర్వహించటంపైనా కలిసి పనిచేయాలనుకుంటున్నాం. అమెరికా-భారత్​ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరించటం, బలోపేతం చేయాలనుకుంటున్నట్లు తెలిపిన ప్రధాని మోదీకి నా కృతజ్ఞతలు."

- జో బైడెన్​, అమెరికా అధ్యక్ష ఎన్నికల విజేత

బైడెన్​ 1970లో సెనేటర్​గా ఉన్నప్పటి నుంచి భారత్​-యూఎస్​ సంబంధాల బలమైన ప్రతిపాదకుడిగా పేరు పొందారు. 2008లో ద్వైపాక్షిక పౌర అణు ఒప్పందానికి సెనేట్​ ఆమోదం పొందడంలో కీలక పాత్ర పోషించారు.

ఇరువురు నేతల సంభాషణ సందర్భంగా బైడెన్​, కమలా హారిస్​కు శుభాకాంక్షలు తెలిపినట్లు ట్వీట్​ చేశారు మోదీ. భారత్​-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ఇరువురు కట్టుబడి ఉన్నట్టు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: జో బైడెన్​కు ప్రధాని మోదీ ఫోన్​

కొవిడ్​ మహమ్మారి సహా ప్రపంచ సవాళ్లపై భారత ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు చెప్పారు అమెరికా అధ్యక్ష ఎన్నికల విజేత జో బైడెన్​. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ చర్యలు, సురక్షితమైన, సంపన్నమైన ఇండో-పసిఫిక్​ ప్రాంతాన్ని నిర్వహించేందుకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు.

నవంబర్​ 3న జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత తొలిసారి భారత్​ ప్రధాని నరేంద్ర మోదీ, జో బైడెన్​ల మధ్య ఫోన్​ సంభాషణ జరిగింది. ఈ సందర్భంగా ఇరువురు నేతలు కీలక విషయాలపై చర్చించారు. బైడెన్​కు మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

" కరోనా కట్టడి సహా అంతర్జాతీయ సవాళ్లపై ప్రధాని మోదీతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తోన్నా. భవిష్యత్తులో ఎదురయ్యే ఆరోగ్య సంక్షోభాలను ఎదుర్కోవటం, పర్యావరణ మార్పులను తగ్గించటం, ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణ చర్యలను ప్రారంభించటం, దేశీయంగా, విదేశాల్లో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయటం, సురక్షితమైన, సుసంపన్నమైన ఇండో-పసిఫిక్​ ప్రాంతాన్ని నిర్వహించటంపైనా కలిసి పనిచేయాలనుకుంటున్నాం. అమెరికా-భారత్​ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరించటం, బలోపేతం చేయాలనుకుంటున్నట్లు తెలిపిన ప్రధాని మోదీకి నా కృతజ్ఞతలు."

- జో బైడెన్​, అమెరికా అధ్యక్ష ఎన్నికల విజేత

బైడెన్​ 1970లో సెనేటర్​గా ఉన్నప్పటి నుంచి భారత్​-యూఎస్​ సంబంధాల బలమైన ప్రతిపాదకుడిగా పేరు పొందారు. 2008లో ద్వైపాక్షిక పౌర అణు ఒప్పందానికి సెనేట్​ ఆమోదం పొందడంలో కీలక పాత్ర పోషించారు.

ఇరువురు నేతల సంభాషణ సందర్భంగా బైడెన్​, కమలా హారిస్​కు శుభాకాంక్షలు తెలిపినట్లు ట్వీట్​ చేశారు మోదీ. భారత్​-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ఇరువురు కట్టుబడి ఉన్నట్టు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: జో బైడెన్​కు ప్రధాని మోదీ ఫోన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.