ETV Bharat / international

కొవిడ్​ యాంటీబాడీలను కచ్చితంగా గుర్తించే కొత్త పరీక్ష

author img

By

Published : Dec 11, 2020, 8:37 AM IST

కరోనా యాంటీబాడీలను కచ్చితత్వంతో గుర్తించే సరికొత్త పరీక్షా విధానాన్ని అభివృద్ధి చేశారు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పరిశోధకులు. ఈ పరీక్షతో తక్కువ సమయంలోనే.. ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చని వారు పేర్కొన్నారు.

COVID-19 ANTIBODY TEST
కొవిడ్​ యాంటీబాడీలను కచ్చితంగా గుర్తించే కొత్త పరీక్ష

కొవిడ్​-19 యాంటీబాడీలను అత్యంత కచ్చితత్వంతో గుర్తించే విశ్వసనీయ పరీక్షా విధానాన్ని రూపొందించారు శాస్త్రవేత్తలు. దీని ద్వారా కేవలం 20 నిమిషాల్లోనే ఫలితాన్ని తెలుసుకోవచ్చు.

'బ్లి-ఇసా' విధానంతో..

కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం చేపట్టిన ఈ పరిశోధన వివరాలను సైంటిఫిక్​ రిపోర్ట్స్​ పత్రిక వెల్లడించింది. ఎలీసా విధానంలో సెరొలాజికల్​ ఎస్సేగా పిలిచే యాంటీబాడీ పరీక్ష ప్రస్తుతం అందుబాటులో ఉంది. దీని ద్వారా రోగ నిరోధక శక్తి ప్రతిస్పందన మాత్రమే తెలుస్తుంది. ఫలితం కోసం 4 నుంచి 6 గంటల సమయం నిరీక్షించాలి. వర్సిటీ పరిశోధకులు బ్లి-ఇసా(బయో లేయర్​ ఇంటర్ఫెరోమెట్రి- ఇమ్యునో సోర్బెంట్​ ఎస్సే) అనే సరికొత్త విధానాన్ని అభివృద్ధి చేశారు.

శరీరంలో యాంటీబాడీలు అత్యంత తక్కువ మోతాదులో ఉన్నా ఈ ఎస్సే గుర్తిస్తుందని, తప్పుడు ఫలితం వచ్చే ఆస్కారం చాలా తక్కువేనని పరిశోధనాకర్త రెబెక్కా డుబోయిస్​ పేర్కొన్నారు.

"టెస్ట్​ స్ట్రిప్స్​ క్వాంటిటేటివ్​ ప్రయోజనాలనూ, ఎలీసా పనితీరునూ మేళవించి బ్లి-ఇసాను రూపొందించాం. అత్యంత తక్కువ స్థాయిలో కొవిడ్​ యాంటీబాడీలు ఉన్నా, కొత్త పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. ఇన్​ఫెక్షన్ల ద్వారా అవి ఏర్పడ్డాయా? లేక వ్యాక్సినేషన్​ వల్ల వచ్చాయా? అన్నది కూడా తెలుస్తుంది."

- పరిశోధకులు

ఇదీ చదవండి: జన భాగస్వామ్యంతోనే పోరు- అవగాహనతోనే ఆరోగ్యం

కొవిడ్​-19 యాంటీబాడీలను అత్యంత కచ్చితత్వంతో గుర్తించే విశ్వసనీయ పరీక్షా విధానాన్ని రూపొందించారు శాస్త్రవేత్తలు. దీని ద్వారా కేవలం 20 నిమిషాల్లోనే ఫలితాన్ని తెలుసుకోవచ్చు.

'బ్లి-ఇసా' విధానంతో..

కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం చేపట్టిన ఈ పరిశోధన వివరాలను సైంటిఫిక్​ రిపోర్ట్స్​ పత్రిక వెల్లడించింది. ఎలీసా విధానంలో సెరొలాజికల్​ ఎస్సేగా పిలిచే యాంటీబాడీ పరీక్ష ప్రస్తుతం అందుబాటులో ఉంది. దీని ద్వారా రోగ నిరోధక శక్తి ప్రతిస్పందన మాత్రమే తెలుస్తుంది. ఫలితం కోసం 4 నుంచి 6 గంటల సమయం నిరీక్షించాలి. వర్సిటీ పరిశోధకులు బ్లి-ఇసా(బయో లేయర్​ ఇంటర్ఫెరోమెట్రి- ఇమ్యునో సోర్బెంట్​ ఎస్సే) అనే సరికొత్త విధానాన్ని అభివృద్ధి చేశారు.

శరీరంలో యాంటీబాడీలు అత్యంత తక్కువ మోతాదులో ఉన్నా ఈ ఎస్సే గుర్తిస్తుందని, తప్పుడు ఫలితం వచ్చే ఆస్కారం చాలా తక్కువేనని పరిశోధనాకర్త రెబెక్కా డుబోయిస్​ పేర్కొన్నారు.

"టెస్ట్​ స్ట్రిప్స్​ క్వాంటిటేటివ్​ ప్రయోజనాలనూ, ఎలీసా పనితీరునూ మేళవించి బ్లి-ఇసాను రూపొందించాం. అత్యంత తక్కువ స్థాయిలో కొవిడ్​ యాంటీబాడీలు ఉన్నా, కొత్త పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. ఇన్​ఫెక్షన్ల ద్వారా అవి ఏర్పడ్డాయా? లేక వ్యాక్సినేషన్​ వల్ల వచ్చాయా? అన్నది కూడా తెలుస్తుంది."

- పరిశోధకులు

ఇదీ చదవండి: జన భాగస్వామ్యంతోనే పోరు- అవగాహనతోనే ఆరోగ్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.