ETV Bharat / international

రెండు రైళ్లు ఢీ- 32 మంది దుర్మరణం

author img

By

Published : Mar 26, 2021, 5:47 PM IST

Updated : Mar 26, 2021, 7:43 PM IST

Trains collide in south Egypt, train accident
రెండు రైళ్లు ఢీ

17:45 March 26

రెండు రైళ్లు ఢీ- 32 మంది దుర్మరణం

దక్షిణ ఈజిప్టులో ఘోర ప్రమాదం జరిగింది.  రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో 32 మంది మరణించారు. 66 మంది గాయపడ్డారు. సొహాగ్​ రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దక్షిణ కైరోకు 460 కి.మీల దూరంలోని షోహాగ్‌లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. రెండు రైళ్లు ఢీకొని నాలుగు బోగీలు బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. 

ఘటనా స్థలానికి 36 అంబులెన్స్‌లు చేరుకున్నట్టు ఆరోగ్య మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి డాక్టర్‌ ఖలీద్‌ మెజాహెద్‌ వెల్లడించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు చెప్పారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.  

17:45 March 26

రెండు రైళ్లు ఢీ- 32 మంది దుర్మరణం

దక్షిణ ఈజిప్టులో ఘోర ప్రమాదం జరిగింది.  రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో 32 మంది మరణించారు. 66 మంది గాయపడ్డారు. సొహాగ్​ రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దక్షిణ కైరోకు 460 కి.మీల దూరంలోని షోహాగ్‌లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. రెండు రైళ్లు ఢీకొని నాలుగు బోగీలు బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. 

ఘటనా స్థలానికి 36 అంబులెన్స్‌లు చేరుకున్నట్టు ఆరోగ్య మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి డాక్టర్‌ ఖలీద్‌ మెజాహెద్‌ వెల్లడించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు చెప్పారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.  

Last Updated : Mar 26, 2021, 7:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.