ETV Bharat / international

'ఒకే కాన్పులో 10 మంది' వార్తల్లో ఊహించని ట్విస్ట్​ - international news telugu

దక్షిణాఫ్రికాకు చెందిన ఓ మహిళ ఒకేసారి పది మందికి జన్మనిచ్చి రికార్డు సృష్టించింది అంటూ వైరలైన వార్త ఇప్పుడు మలుపు తిరిగింది. పది మంది కాదు.. అసలు ఆమెకు ఆ సమయంలో కాన్పు జరగలేదని తేల్చేసింది అక్కడి ప్రభుత్వం.

south african women fake news
దక్షిణాఫ్రికా మహిళ వార్తలు
author img

By

Published : Jun 26, 2021, 6:39 AM IST

ఇటీవల దక్షిణాఫ్రికాలోని ఓ మహిళ ఒకే కాన్పులో 10 మంది పిల్లలకు జన్మనిచ్చిందనే వార్త నెట్టింట చక్కర్లు కొట్టింది. ఇంత మందిని కన్నందుకు ఈమెకు గిన్నిస్​ రికార్డ్​ ఖాయం అని అనుకున్నారు అంతా! అయితే.. ఇప్పుడు ఇందులో కొత్త ట్విస్ట్​ వచ్చింది. స్థానిక ప్రభుత్వ యంత్రాంగం చేపట్టిన దర్యాప్తులో అసలు ఈమె పిల్లలనే కనలేదు అనే విషయం తెలిసింది. అంతే కాదు.. అసలు ఈమె గర్భవతి కూడా కాదని వెల్లడైంది. ఇందుకు సంబంధించి అక్కడి ప్రభుత్వం జూన్​ 23న ప్రకటన విడుదల చేసింది.

ఇదీ జరిగింది..

దక్షిణాఫ్రికాలోని గౌటెంగ్​ ప్రావిన్స్​కు చెందిన గొసియామి థమరా సిథోలే జూన్​ 7న 10 మంది పిల్లలకు జన్మనిచ్చినట్లు స్థానిక వార్తా సంస్థ పేర్కొంది. ఈ మేరకు జూన్​ 9న వార్తను ప్రచురించింది. ఈ వార్త వైరల్​గా మారింది.

సిథోలేకు స్టీవ్ బికో అకాడమిక్​ ఆసుపత్రిలో కాన్పు జరిగిందని.. అక్కడి వైద్యల నిర్లక్ష్యం కారణంగా ఆమెకు ప్రసవానికి ఇబ్బంది పడింది అంటూ అందులో పేర్కొంది. దీనిపై స్పందించిన స్థానిక ప్రభుత్వం.. దర్యాప్తును ప్రారంభించింది. ఈ క్రమంలో అధికారులకు.. సిథోలే అసలు కాన్పుకు ఆ ఆసుపత్రికే రాలేదని తెలిసింది. అంతే కాదు.. అక్కడున్న ఏ ఆసుపత్రిలో ఆమెకు ప్రవసం జరిగినట్లు సమాచారం లేదు.

వైద్య సిబ్బంది సిథోలేను సంప్రదించగా ఆ సమయంలో ఆమెకు కాన్పు జరగలేదని తెలిసింది. ఇందుకు సంబంధించి జూన్​ 18న ఆమెకు పరీక్షలు నిర్వహించారు. ఇటీవల కాలంలో సిథోలే అసలు గర్భం దాల్చనట్టు పరీక్షల్లో తేలింది. సిథోలే మానసిక స్థితి పట్ల అనుమానం వ్యక్తం చేసిన వైద్యులు.. ఆమెను పర్యవేక్షిస్తున్నారు.

ఇదీ చదవండి : అద్భుతం: ఒకే కాన్పులో 9 మంది జననం

ఇటీవల దక్షిణాఫ్రికాలోని ఓ మహిళ ఒకే కాన్పులో 10 మంది పిల్లలకు జన్మనిచ్చిందనే వార్త నెట్టింట చక్కర్లు కొట్టింది. ఇంత మందిని కన్నందుకు ఈమెకు గిన్నిస్​ రికార్డ్​ ఖాయం అని అనుకున్నారు అంతా! అయితే.. ఇప్పుడు ఇందులో కొత్త ట్విస్ట్​ వచ్చింది. స్థానిక ప్రభుత్వ యంత్రాంగం చేపట్టిన దర్యాప్తులో అసలు ఈమె పిల్లలనే కనలేదు అనే విషయం తెలిసింది. అంతే కాదు.. అసలు ఈమె గర్భవతి కూడా కాదని వెల్లడైంది. ఇందుకు సంబంధించి అక్కడి ప్రభుత్వం జూన్​ 23న ప్రకటన విడుదల చేసింది.

ఇదీ జరిగింది..

దక్షిణాఫ్రికాలోని గౌటెంగ్​ ప్రావిన్స్​కు చెందిన గొసియామి థమరా సిథోలే జూన్​ 7న 10 మంది పిల్లలకు జన్మనిచ్చినట్లు స్థానిక వార్తా సంస్థ పేర్కొంది. ఈ మేరకు జూన్​ 9న వార్తను ప్రచురించింది. ఈ వార్త వైరల్​గా మారింది.

సిథోలేకు స్టీవ్ బికో అకాడమిక్​ ఆసుపత్రిలో కాన్పు జరిగిందని.. అక్కడి వైద్యల నిర్లక్ష్యం కారణంగా ఆమెకు ప్రసవానికి ఇబ్బంది పడింది అంటూ అందులో పేర్కొంది. దీనిపై స్పందించిన స్థానిక ప్రభుత్వం.. దర్యాప్తును ప్రారంభించింది. ఈ క్రమంలో అధికారులకు.. సిథోలే అసలు కాన్పుకు ఆ ఆసుపత్రికే రాలేదని తెలిసింది. అంతే కాదు.. అక్కడున్న ఏ ఆసుపత్రిలో ఆమెకు ప్రవసం జరిగినట్లు సమాచారం లేదు.

వైద్య సిబ్బంది సిథోలేను సంప్రదించగా ఆ సమయంలో ఆమెకు కాన్పు జరగలేదని తెలిసింది. ఇందుకు సంబంధించి జూన్​ 18న ఆమెకు పరీక్షలు నిర్వహించారు. ఇటీవల కాలంలో సిథోలే అసలు గర్భం దాల్చనట్టు పరీక్షల్లో తేలింది. సిథోలే మానసిక స్థితి పట్ల అనుమానం వ్యక్తం చేసిన వైద్యులు.. ఆమెను పర్యవేక్షిస్తున్నారు.

ఇదీ చదవండి : అద్భుతం: ఒకే కాన్పులో 9 మంది జననం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.