'ఆఫ్రికా చిన్నారుల్లో పోషకాహార లోపం మరింత తీవ్రం' - ఆఫ్రికా
కోటి మందికిపైగా పిల్లలు 2021లో పోషకాహార సమస్యను ఎదుర్కొంటారని యూనిసెఫ్ తెలిపింది. ఆఫ్రికాలోని పలు దేశాల్లో ఈ సమస్య తీవ్రమవనుందని పేర్కొంటూ బుధవారం ప్రకటించింది.
!['ఆఫ్రికా చిన్నారుల్లో పోషకాహార లోపం మరింత తీవ్రం' unicef, malnutrition](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10066650-460-10066650-1609390067823.jpg?imwidth=3840)
ఆఫ్రికాలో 2021 సంవత్సరంలో కోటి మందికిపైగా చిన్నారులు తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతారని యూనిసెఫ్ (యునైడెట్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్) అంచనా వేసింది. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేసింది. డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, నైజీరియా, దక్షిణ సూడాన్, యెమెన్ దేశాలు సహా సెంట్రల్ సహేల్ ప్రాంతాలను ఆ జాబితాలో పేర్కొంది.
ప్రస్తుతం సెంట్రల్ సహేల్ మినహా మిగతా ప్రాంతాలు అన్నీ తీవ్ర సంక్షోభంలో ఉన్నాయని తెలిపింది.
"ఇప్పటికే ఆహార సంక్షోభంలో ఉన్న దేశాలకు కొవిడ్ 19 తీవ్ర విపత్తు దాపురించేలా చేసింది. ఆహారం కోసం ప్రజలు పడుతున్న ఇక్కట్లు ఇప్పటికే తారస్థాయికి చేరుకున్నాయి. 2020 బాధితులుగా మనం వారిని వదిలేయలేం."
-హెన్రిటా ఫోరె, యూనిసెఫ్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్
సేవలను విస్తరించేందుకు..
భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సామాజిక కార్యకర్తలకు యూనిసెఫ్ పిలుపునిచ్చింది. 2021లో పౌష్టికాహార సమస్యకు ప్రభావితమయ్యే ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు రూ.7,300 కోట్లను విరాళంగా సేకరించనుంది.
ఇదీ చదవండి : అందరికీ పోషకాలు అందేదెలా?