ETV Bharat / international

ముగ్గురు శాంతి పరిరక్షకులను హతమార్చిన ఉగ్రవాదులు

మధ్య ఆఫ్రికాలో ఐక్యరాజ్యసమితికి చెందిన శాంతి పరిరక్షకులపై దాడి చేశారు ఉగ్రవాదులు. ఈ ఘటనలో మగ్గురు మరణించగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ దాడిని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటేరస్ ఖండించారు. ఇది తీవ్రమైన నేరంగా పరిగణించారు. వెంటనే ఈ ఘటనపై విచారణ జరపాలన్నారు.

author img

By

Published : Dec 26, 2020, 7:57 PM IST

3 UN peacekeepers killed in Central African Republic
ముగ్గురు శాంతి పరిరక్షకులను హతమార్చిన ఉగ్రవాదులు

మధ్య ఆఫ్రికాలో ఆదివారం అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బురుండికి చెందిన శాంతి పరిరక్షకులపై దాడికి పాల్పడ్డారు ఉగ్రవాదులు. ఈ ఘటనలో మగ్గురు శాంతి పరిరక్షకులు మరణించారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన మధ్య ఆఫ్రికాలోని డెకువా ప్రాంతంలో జరిగింది. శాంతి పరిరక్షకులపై దాడిని తీవ్రంగా ఖండించారు ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటేరస్. వెంటనే ఈ ఘటనపై విచారణ జరిపి నేరస్థులను న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టాలన్నారు.

అయితే ఉగ్రవాద సంస్థలు మంగళవారం స్వాధీనం చేసుకున్న బంబారీ నగరంలో ఐరాస కార్యకలాపాలు జరుపుతోంది.

మధ్య ఆఫ్రికాలో ఆదివారం అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బురుండికి చెందిన శాంతి పరిరక్షకులపై దాడికి పాల్పడ్డారు ఉగ్రవాదులు. ఈ ఘటనలో మగ్గురు శాంతి పరిరక్షకులు మరణించారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన మధ్య ఆఫ్రికాలోని డెకువా ప్రాంతంలో జరిగింది. శాంతి పరిరక్షకులపై దాడిని తీవ్రంగా ఖండించారు ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటేరస్. వెంటనే ఈ ఘటనపై విచారణ జరిపి నేరస్థులను న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టాలన్నారు.

అయితే ఉగ్రవాద సంస్థలు మంగళవారం స్వాధీనం చేసుకున్న బంబారీ నగరంలో ఐరాస కార్యకలాపాలు జరుపుతోంది.

ఇదీ చదవండి : దక్షిణాఫ్రికాలో కొత్త రకం కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.