ETV Bharat / entertainment

సూర్యతో బాలీవుడ్ బ్యూటీ రొమాన్స్, పదేళ్ల తర్వాత మళ్లీ కలిసి

త్వరలో సెట్స్​లోకి అడుగుపెట్టనున్న సూర్య 42 సినిమా గురించి ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది. బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ సూర్యతో ఆడిపాడనుందని టాక్. అయితే వీరిద్దరూ కలిసి నటించడం ఇదే తొలిసారి కాదు.

author img

By

Published : Aug 21, 2022, 4:20 PM IST

.
.

SURIYA LATEST MOVIE UPDATE: తమిళ స్టార్​ సూర్య అభిమానులు ఎంతగానో ఎదురుచుస్తున్న మూవీ షూటింగ్​కు సిద్ధం కానుంది. సిరుతై శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా షూట్​ కరోనా కారణంగా ఆలస్యమైంది. రెండేళ్ల క్రితమే మేకర్స్ ఈ చిత్రం గురించి అనౌన్స్​ చేశారు. దీంతో ఫ్యాన్స్​ ఎదురు చూపులు ఇంకా పెరిగాయి.

.
సూర్య లేటస్ట్​ మూవీ పోస్టర్​

'సూర్య 42' వర్కింట్ టైటిల్​తో తెరకెక్కుతున్న ఈ మెగా ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశా పటానీ సూర్యతో జతకట్టే అవకాశాలు కనిపిస్తున్నాయని కోలీవుడ్​ వర్గాల మాట. పైగా ఈ సినిమాకి సీక్వెల్​ ఉందని చిత్ర యూనిట్​​ తెలిపింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ జంట కలిసి పనిచేయడం ఇదే మొదటిసారేం కాదు. దాదాపు 10 ఏళ్ల క్రితం వాళ్లిద్దరు ఒక యాడ్​లో పని చేశారు. ఒకప్పటి సెల్యులార్​ కంపెనీ ఎయిర్​సెల్​ కోసం కలిసి పని చేశారు. మళ్లీ ఇప్పుడు 'సూర్య 42'తో ఈ జంట ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

స్టూడియో గ్రీన్, కే.ఈ. సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు జ్ఞానవేల్‌రాజా, దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని సమకూర్చనున్నారు. మొత్తానికి సూర్య ఫ్యాన్స్​ ఎదురుచూస్తున్న సినిమా సెట్స్​లోకి రానుందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దిశాకు ఇది తొలి తమిళ చిత్రం కావడం మరో విశేషం. దీంతో ఈ మూవీపై ఫ్యాన్స్​ అంచనాలు మరింత ఎక్కువయ్యాయి.

ఇదీ చదవండి:

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్​ హీరోయిన్

హీరోయిన్ రోజా కూతురిని చూశారా, సినిమాల్లో ఎంట్రీకి రంగం సిద్ధం

SURIYA LATEST MOVIE UPDATE: తమిళ స్టార్​ సూర్య అభిమానులు ఎంతగానో ఎదురుచుస్తున్న మూవీ షూటింగ్​కు సిద్ధం కానుంది. సిరుతై శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా షూట్​ కరోనా కారణంగా ఆలస్యమైంది. రెండేళ్ల క్రితమే మేకర్స్ ఈ చిత్రం గురించి అనౌన్స్​ చేశారు. దీంతో ఫ్యాన్స్​ ఎదురు చూపులు ఇంకా పెరిగాయి.

.
సూర్య లేటస్ట్​ మూవీ పోస్టర్​

'సూర్య 42' వర్కింట్ టైటిల్​తో తెరకెక్కుతున్న ఈ మెగా ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశా పటానీ సూర్యతో జతకట్టే అవకాశాలు కనిపిస్తున్నాయని కోలీవుడ్​ వర్గాల మాట. పైగా ఈ సినిమాకి సీక్వెల్​ ఉందని చిత్ర యూనిట్​​ తెలిపింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ జంట కలిసి పనిచేయడం ఇదే మొదటిసారేం కాదు. దాదాపు 10 ఏళ్ల క్రితం వాళ్లిద్దరు ఒక యాడ్​లో పని చేశారు. ఒకప్పటి సెల్యులార్​ కంపెనీ ఎయిర్​సెల్​ కోసం కలిసి పని చేశారు. మళ్లీ ఇప్పుడు 'సూర్య 42'తో ఈ జంట ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

స్టూడియో గ్రీన్, కే.ఈ. సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు జ్ఞానవేల్‌రాజా, దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని సమకూర్చనున్నారు. మొత్తానికి సూర్య ఫ్యాన్స్​ ఎదురుచూస్తున్న సినిమా సెట్స్​లోకి రానుందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దిశాకు ఇది తొలి తమిళ చిత్రం కావడం మరో విశేషం. దీంతో ఈ మూవీపై ఫ్యాన్స్​ అంచనాలు మరింత ఎక్కువయ్యాయి.

ఇదీ చదవండి:

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్​ హీరోయిన్

హీరోయిన్ రోజా కూతురిని చూశారా, సినిమాల్లో ఎంట్రీకి రంగం సిద్ధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.