ETV Bharat / entertainment

భారత్​లో నెం.1 వెబ్​ సిరీస్​గా​ 'ఫర్జీ'.. అందుకు వారిద్దరే కారణమా!?

author img

By

Published : Mar 25, 2023, 1:54 PM IST

బాలీవుడ్ స్టార్​ హీరో షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ 'ఫర్జీ'. ఫ్యామిలీ మ్యాన్​ సిరీస్​ను తెరకెక్కించిన రాజ్​,​ డీకే కాంబో దర్శకత్వంలో వచ్చిన ఈ సిరీ..స్​ ఇప్పుడు దేశంలోనే ఎక్కువ మంది వీక్షించిన వెబ్​సిరీస్​గా నిలిచింది. ఆ వివరాలు..

farzi series
farzi

కొవిడ్​ లాక్​డౌన్​ సమయంలో సినీ ప్రేక్షకులు ఆన్​లైన్​ కంటెంట్​కు ఎక్కువగా అలవాటుపడిపోయారు. అప్పటి నుంచి అందరూ సినిమాలతో పాటు వెబ్ సిరీస్​లనూ ఇంట్రెస్టింగ్​గా చూస్తున్నారు. ప్రేక్షకులు ఈ వెబ్​ కంటెంట్​పై మక్కువ చూపించడం వల్ల.. ఇటీవలి కాలంలో స్టార్​ నటీనటులు సైతం వెబ్ సిరీస్‌లో నటించేందుకు రెడీ అవుతున్నారు. అజయ్ దేవ్​గణ్​, విజయ్ సేతుపతి, రాశీ ఖన్నా, సమంత, వెంకటేశ్​, రానా లాంటి పాపులర్​ స్టార్స్​ ఇప్పటికే ఓటీటీ ప్లాట్​ ఫామ్​లో సందడి చేయగా.. నాగ చైతన్య కూడా త్వరలో ఓ సిరీస్​తో ఆడియన్స్ ముందుకు రానున్నారు.

ఇక నార్త్​లో వెబ్​సిరీస్​ అంటే మనకు గుర్తుకొచ్చేవి మీర్జాపుర్​, ఫ్యామిలీ మ్యాన్. ఈ సిరీస్​లు రెండు సీజన్లు పూర్తి చేసుకుని ప్రేక్షకులను అలరించాయి. ఇక ఫ్యామిలీ మ్యాన్​ గురించి అయితే చెప్పనక్కర్లేదు. 2019లో రిలీజైన ఈ సిరీస్​ అప్పట్లో సంచలనం సృష్టించింది. దర్శకులు రాజ్​, డీకేలకు ఈ సిరీస్​తో పాన్​ ఇండియా లెవెల్​లో మంచి గుర్తింపు కూడా లభించింది. దీంతో రాజ్​, డీకే కాంబోలో తెరకెక్కుతున్న వెబ్​ సిరీస్​లపై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.​ అలా వీరిద్దరి కలయికలో తెరకెక్కిన ఫర్జీ వెబ్​ సిరీస్​ ప్రస్తుతం ట్రెండింగ్​లో ఉంది. దొంగ నోట్లు ప్రింట్ చేసే కథాంశంతో ఫిబ్రవరిలో రిలీజైన ఈ వెబ్​ సిరీస్​లో బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్​తో పాటు సౌత్ స్టార్స్ విజయ్ సేతుపతి, రాశీ ఖన్నా లీడ్​ రోల్స్​ చేశారు.

ఎనిమిది ఎపిసోడ్లుగా తెరకెక్కిన ఈ సీజన్ అనతికాలంలోనే సూపర్ హిట్​గా నిలిచింది. ఇక సౌత్​ స్టార్స్​ విజయ్ సేతుపతి, రాశీ ఖన్నా కూడా ఉండడంతో దక్షిణాది ప్రేక్షకులు కూడా ఈ సిరీస్​ను ఎంతగానో ఆదరించారు. దీంతో ఈ వెబ్​ సిరీస్​ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. భారత్​లో ఎక్కువమంది చూసిన వెబ్ ​సిరీస్​గా నిలిచింది. అయితే ఈ విజయం వెనుక కచ్చితంగా నటీనటులతో పాటు దర్శకులిద్దరి కృషి ఉందని నెటిజన్లు అంటున్నారు.

ఇక ఫర్జీ​ విషయానికి వస్తే.. యాక్షన్ థ్రిల్లర్​గా తెరకెక్కిన ఈ వెబ్​ సిరీస్​లో షాహిద్‌ కపూర్​, విజయ్​, రాశీ ఖన్నాతోపాటు భువన్‌ అరోడా, కేకే మేనన్‌, జాకీర్‌ హుస్సేన్‌, రెజీనా వంటి ప్రముఖ తారలు నటించారు. ఈ వెబ్​ సిరీస్​.. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్​ ప్రైమ్​లో స్ట్రీమింగ్​ అవుతోంది.

కొవిడ్​ లాక్​డౌన్​ సమయంలో సినీ ప్రేక్షకులు ఆన్​లైన్​ కంటెంట్​కు ఎక్కువగా అలవాటుపడిపోయారు. అప్పటి నుంచి అందరూ సినిమాలతో పాటు వెబ్ సిరీస్​లనూ ఇంట్రెస్టింగ్​గా చూస్తున్నారు. ప్రేక్షకులు ఈ వెబ్​ కంటెంట్​పై మక్కువ చూపించడం వల్ల.. ఇటీవలి కాలంలో స్టార్​ నటీనటులు సైతం వెబ్ సిరీస్‌లో నటించేందుకు రెడీ అవుతున్నారు. అజయ్ దేవ్​గణ్​, విజయ్ సేతుపతి, రాశీ ఖన్నా, సమంత, వెంకటేశ్​, రానా లాంటి పాపులర్​ స్టార్స్​ ఇప్పటికే ఓటీటీ ప్లాట్​ ఫామ్​లో సందడి చేయగా.. నాగ చైతన్య కూడా త్వరలో ఓ సిరీస్​తో ఆడియన్స్ ముందుకు రానున్నారు.

ఇక నార్త్​లో వెబ్​సిరీస్​ అంటే మనకు గుర్తుకొచ్చేవి మీర్జాపుర్​, ఫ్యామిలీ మ్యాన్. ఈ సిరీస్​లు రెండు సీజన్లు పూర్తి చేసుకుని ప్రేక్షకులను అలరించాయి. ఇక ఫ్యామిలీ మ్యాన్​ గురించి అయితే చెప్పనక్కర్లేదు. 2019లో రిలీజైన ఈ సిరీస్​ అప్పట్లో సంచలనం సృష్టించింది. దర్శకులు రాజ్​, డీకేలకు ఈ సిరీస్​తో పాన్​ ఇండియా లెవెల్​లో మంచి గుర్తింపు కూడా లభించింది. దీంతో రాజ్​, డీకే కాంబోలో తెరకెక్కుతున్న వెబ్​ సిరీస్​లపై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.​ అలా వీరిద్దరి కలయికలో తెరకెక్కిన ఫర్జీ వెబ్​ సిరీస్​ ప్రస్తుతం ట్రెండింగ్​లో ఉంది. దొంగ నోట్లు ప్రింట్ చేసే కథాంశంతో ఫిబ్రవరిలో రిలీజైన ఈ వెబ్​ సిరీస్​లో బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్​తో పాటు సౌత్ స్టార్స్ విజయ్ సేతుపతి, రాశీ ఖన్నా లీడ్​ రోల్స్​ చేశారు.

ఎనిమిది ఎపిసోడ్లుగా తెరకెక్కిన ఈ సీజన్ అనతికాలంలోనే సూపర్ హిట్​గా నిలిచింది. ఇక సౌత్​ స్టార్స్​ విజయ్ సేతుపతి, రాశీ ఖన్నా కూడా ఉండడంతో దక్షిణాది ప్రేక్షకులు కూడా ఈ సిరీస్​ను ఎంతగానో ఆదరించారు. దీంతో ఈ వెబ్​ సిరీస్​ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. భారత్​లో ఎక్కువమంది చూసిన వెబ్ ​సిరీస్​గా నిలిచింది. అయితే ఈ విజయం వెనుక కచ్చితంగా నటీనటులతో పాటు దర్శకులిద్దరి కృషి ఉందని నెటిజన్లు అంటున్నారు.

ఇక ఫర్జీ​ విషయానికి వస్తే.. యాక్షన్ థ్రిల్లర్​గా తెరకెక్కిన ఈ వెబ్​ సిరీస్​లో షాహిద్‌ కపూర్​, విజయ్​, రాశీ ఖన్నాతోపాటు భువన్‌ అరోడా, కేకే మేనన్‌, జాకీర్‌ హుస్సేన్‌, రెజీనా వంటి ప్రముఖ తారలు నటించారు. ఈ వెబ్​ సిరీస్​.. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్​ ప్రైమ్​లో స్ట్రీమింగ్​ అవుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.