ETV Bharat / entertainment

గుంటూరు కారం : అప్పుడేమో రొమాంటిక్​గా - ఇప్పుడేమో తల్లి కొడుకులుగా!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 11, 2024, 5:04 PM IST

Guntur Kaaram Mahesh Babu Ramya Krishna : 'గుంటూరు కారం' చిత్రంలో మహేశ్​ బాబు తల్లిగా నటించింది రమ్యకృష్ణ. ఈ నేపథ్యంలో గతంలో వీరిద్దరు కలిసి చేసిన ఓ రొమాంటిక్ సాంగ్ ప్రస్తుతం సోషల్​ మీడియాలో పుల్​ వైరల్ అవుతోంది.

ఫ్లాష్ బ్యాక్​ : అప్పుడేమో రొమాంటిక్​గా - ఇప్పుడేమో తల్లి కొడుకులుగా!
ఫ్లాష్ బ్యాక్​ : అప్పుడేమో రొమాంటిక్​గా - ఇప్పుడేమో తల్లి కొడుకులుగా!

Guntur Kaaram Mahesh Babu Ramya Krishna : చిత్రం భళారే విచిత్రం అన్నట్లుగా చిత్ర పరిశ్రమలో విచిత్రాలు చోటు చేసుకుంటుంటాయి. స్టార్ హీరోలు ఎవర్ గ్రీన్ గా అలానే ఉంటే వారితో నటించిన హీరోయిన్స్ మాత్రం త్వరగా ఫేడ్ అవుట్ అయిపోతారు. అప్పటివరకు హీరోల పక్కన హీరోయిన్లుగా నటించినవారే కొన్నాళ్ల తర్వాత అదే హీరోలకు తల్లిగా, అక్కగా నటిస్తుంటారు! ఇప్పుడు గుంటూరు కారం సినిమా విషయంలోనూ అదే జరిగింది.

మహేశ్​ బాబు హీరోగా - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో విడుదల కాబోతున్న కొత్త చిత్రం 'గుంటూరు కారం'. సంక్రాంతి కానుకగ జనవరి 12న రానుంది. ఇప్పటికే మహేశ్​, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన 'అతడు', 'ఖలేజా' సినిమాలు ఆకట్టుకోవడం వల్ల - గుంటూరు కారంపైనా భారీగా అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగ్గట్టుగానే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్​ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి.

అయితే ఈ చిత్రంలో సీనియర్ నటి రమ్యకృష్ణ - మహేశ్​ బాబు తల్లిగా కనిపించబోతుంది. ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా కీలకంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రమ్యకృష్ణ, మహేశ్​కు సంబంధించిన ఓ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అదేంటంటే? 2004లో మహేశ్​ బాబు, ఎస్​ జే సూర్య కాంబోలో వచ్చిన 'నాని' చిత్రం అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది. అయితే ఈ చిత్రంలో రమ్యకృష్ణ, మహేశ్ మధ్య ఓ మాస్ మసాలా రొమాంటిక్ సాంగ్ ఉంటుంది. 'మార్కండేయా' అంటూ సాగే ఈ సాంగ్​లో రమ్యకృష్ణ - మహేశ్​తో రొమాన్స్​ చేస్తూ​ తన అందాల ఆరబోతతో ఆకట్టుకుంటుంది. కారణాలు ఏమో తెలీదు కానీ ఈ సినిమా నుంచి ఆ పాటను తొలగించేశారు. యూట్యూబ్​లో మాత్రం ఆ సాంగ్​ ఇప్పటికీ ఉంటుంది. అయితే ఇప్పుడు 'గుంటూరు కారం' సినిమా రిలీజ్ కారణంగా మళ్లీ ఈ మార్కండేయా సాంగ్​ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇది చూసిన కొంతమంది ఆశ్చర్యపోతున్నారు.

Guntur Kaaram Mahesh Babu Ramya Krishna : చిత్రం భళారే విచిత్రం అన్నట్లుగా చిత్ర పరిశ్రమలో విచిత్రాలు చోటు చేసుకుంటుంటాయి. స్టార్ హీరోలు ఎవర్ గ్రీన్ గా అలానే ఉంటే వారితో నటించిన హీరోయిన్స్ మాత్రం త్వరగా ఫేడ్ అవుట్ అయిపోతారు. అప్పటివరకు హీరోల పక్కన హీరోయిన్లుగా నటించినవారే కొన్నాళ్ల తర్వాత అదే హీరోలకు తల్లిగా, అక్కగా నటిస్తుంటారు! ఇప్పుడు గుంటూరు కారం సినిమా విషయంలోనూ అదే జరిగింది.

మహేశ్​ బాబు హీరోగా - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో విడుదల కాబోతున్న కొత్త చిత్రం 'గుంటూరు కారం'. సంక్రాంతి కానుకగ జనవరి 12న రానుంది. ఇప్పటికే మహేశ్​, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన 'అతడు', 'ఖలేజా' సినిమాలు ఆకట్టుకోవడం వల్ల - గుంటూరు కారంపైనా భారీగా అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగ్గట్టుగానే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్​ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి.

అయితే ఈ చిత్రంలో సీనియర్ నటి రమ్యకృష్ణ - మహేశ్​ బాబు తల్లిగా కనిపించబోతుంది. ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా కీలకంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రమ్యకృష్ణ, మహేశ్​కు సంబంధించిన ఓ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అదేంటంటే? 2004లో మహేశ్​ బాబు, ఎస్​ జే సూర్య కాంబోలో వచ్చిన 'నాని' చిత్రం అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది. అయితే ఈ చిత్రంలో రమ్యకృష్ణ, మహేశ్ మధ్య ఓ మాస్ మసాలా రొమాంటిక్ సాంగ్ ఉంటుంది. 'మార్కండేయా' అంటూ సాగే ఈ సాంగ్​లో రమ్యకృష్ణ - మహేశ్​తో రొమాన్స్​ చేస్తూ​ తన అందాల ఆరబోతతో ఆకట్టుకుంటుంది. కారణాలు ఏమో తెలీదు కానీ ఈ సినిమా నుంచి ఆ పాటను తొలగించేశారు. యూట్యూబ్​లో మాత్రం ఆ సాంగ్​ ఇప్పటికీ ఉంటుంది. అయితే ఇప్పుడు 'గుంటూరు కారం' సినిమా రిలీజ్ కారణంగా మళ్లీ ఈ మార్కండేయా సాంగ్​ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇది చూసిన కొంతమంది ఆశ్చర్యపోతున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

మహేశ్ మాస్ జాతర - 'గుంటూరు కారం'ను ఇలా తీర్చిదిద్దారు

హలీవుడ్​ మూవీతో హనుమాన్​ పోటీ - అక్కడ తొలి తెలుగు చిత్రంగా రికార్డ్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.