ETV Bharat / elections

'సార్వత్రికం' తుది దశకు సర్వం సిద్ధం

author img

By

Published : May 18, 2019, 4:33 PM IST

Updated : May 18, 2019, 4:57 PM IST

సార్వత్రిక సమరం ముగింపు దశకు చేరుకుంది. చివరిదైన ఏడో విడతలో 59 లోక్​సభ స్థానాలకు ఆదివారం పోలింగ్ జరగనుంది. ఎన్నికల నిర్వహణకు ఈసీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ దశ ఎన్నికలే ఫలితాలను శాసిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఎన్నికల భారతం
'సార్వత్రికం' తుది దశకు సర్వం సిద్ధం

లోక్​సభ ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఇప్పటికే ఆరు దశలు పూర్తికాగా ఆఖరిదైన ఏడో విడత పోలింగ్ ఆదివారం జరగనుంది. ఓటింగ్​ ప్రక్రియ సజావుగా జరిగేలా ఎన్నికల సంఘం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది.

ఏడో విడతలో భాగంగా 7 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 59 స్థానాలకు ఓటింగ్ జరగనుంది. 918 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 10.01 కోట్ల మంది ఓటర్లు నిర్ణయించనున్నారు. అన్ని నియోజకవర్గాల్లో కలిపి లక్షా 12 వేల పోలింగ్​ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం.

ఏడో విడత వివరాలు
ఏడో విడత వివరాలు

కట్టుదిట్టమైన భద్రత

పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈసీ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే బంగాల్​లో భారీగా కేంద్ర బలగాలను మోహరించింది. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించింది ఎన్నికల సంఘం.

ఏడో విడత వివరాలు
ఏడో విడత వివరాలు

భాజపాకు కీలకం

చివరి దశ నిర్ణయాత్మకమైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏడో దశలోని స్థానాలు భాజపాకు కీలకం కానున్నాయి. 2014 లోక్​సభ ఎన్నికల్లో ఎక్కువ మంది భాజపా అభ్యర్థులు ఈ దశలోని స్థానాల్లోనే గెలిచారు. వీటిని నిలుపుకుంటేనే భాజపా తిరిగి అధికారం సాధించగలుగుతుందని నిపుణుల విశ్లేషణ. బంగాల్​ మినహా మిగతావన్నీ హిందీ రాష్ట్రాలే కావటం విశేషం.

ప్రముఖ స్థానాలు

  1. వారణాసి (ఉత్తరప్రదేశ్): ప్రధాని నరేంద్రమోదీ ఇదే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్​ తరఫున అజయ్​ రాయ్​, ఎస్పీ తరఫున షాలినీ యాదవ్​ బరిలో ఉన్నారు.
  2. పాటలీపుత్ర (బిహార్​): ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్​ యాదవ్​ కుమార్తె మిశా భారతి పోటీ చేస్తున్నారు. భాజపా నుంచి లాలూ మాజీ సన్నిహితుడు, కేంద్రమంత్రి రామ్​ కృపాల్​ యాదవ్​ బరిలో ఉన్నారు.
  3. పట్నా సాహిబ్ (బిహార్​): ఒకప్పటి సహచరులు ప్రత్యర్థులుగా మారారు. కేంద్ర మంత్రి రవిశంకర్​ప్రసాద్​, సిట్టింగ్​ ఎంపీ, కాంగ్రెస్ నేత శతృఘ్న సిన్హా మధ్య పోటీ ఆసక్తికరం.
  4. గురుదాస్​పుర్ (పంజాబ్​)​: రాష్ట్రంలో భాజపా ఆశలు పెట్టుకున్నది సన్నీ దేఓల్​పైనే. ప్రత్యర్థిగా కాంగ్రెస్​ నుంచి సునీల్​ కుమార్​ జాఖర్​ నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది.

పంజాబ్​లో శిరోమణి అకాలీదళ్​ అధినేత సుఖ్​బీర్​ సింగ్​ బాదల్​, ఇద్దరు కేంద్రమంత్రులు హర్​సిమ్రత్​ కౌర్​ బాదల్​, హర్​దీప్​ సింగ్​ పురి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

ఇదీ చూడండి: పవిత్ర గుహలో 'మోదీ బాబా' యోగ ముద్ర

'సార్వత్రికం' తుది దశకు సర్వం సిద్ధం

లోక్​సభ ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఇప్పటికే ఆరు దశలు పూర్తికాగా ఆఖరిదైన ఏడో విడత పోలింగ్ ఆదివారం జరగనుంది. ఓటింగ్​ ప్రక్రియ సజావుగా జరిగేలా ఎన్నికల సంఘం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది.

ఏడో విడతలో భాగంగా 7 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 59 స్థానాలకు ఓటింగ్ జరగనుంది. 918 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 10.01 కోట్ల మంది ఓటర్లు నిర్ణయించనున్నారు. అన్ని నియోజకవర్గాల్లో కలిపి లక్షా 12 వేల పోలింగ్​ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం.

ఏడో విడత వివరాలు
ఏడో విడత వివరాలు

కట్టుదిట్టమైన భద్రత

పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈసీ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే బంగాల్​లో భారీగా కేంద్ర బలగాలను మోహరించింది. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించింది ఎన్నికల సంఘం.

ఏడో విడత వివరాలు
ఏడో విడత వివరాలు

భాజపాకు కీలకం

చివరి దశ నిర్ణయాత్మకమైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏడో దశలోని స్థానాలు భాజపాకు కీలకం కానున్నాయి. 2014 లోక్​సభ ఎన్నికల్లో ఎక్కువ మంది భాజపా అభ్యర్థులు ఈ దశలోని స్థానాల్లోనే గెలిచారు. వీటిని నిలుపుకుంటేనే భాజపా తిరిగి అధికారం సాధించగలుగుతుందని నిపుణుల విశ్లేషణ. బంగాల్​ మినహా మిగతావన్నీ హిందీ రాష్ట్రాలే కావటం విశేషం.

ప్రముఖ స్థానాలు

  1. వారణాసి (ఉత్తరప్రదేశ్): ప్రధాని నరేంద్రమోదీ ఇదే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్​ తరఫున అజయ్​ రాయ్​, ఎస్పీ తరఫున షాలినీ యాదవ్​ బరిలో ఉన్నారు.
  2. పాటలీపుత్ర (బిహార్​): ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్​ యాదవ్​ కుమార్తె మిశా భారతి పోటీ చేస్తున్నారు. భాజపా నుంచి లాలూ మాజీ సన్నిహితుడు, కేంద్రమంత్రి రామ్​ కృపాల్​ యాదవ్​ బరిలో ఉన్నారు.
  3. పట్నా సాహిబ్ (బిహార్​): ఒకప్పటి సహచరులు ప్రత్యర్థులుగా మారారు. కేంద్ర మంత్రి రవిశంకర్​ప్రసాద్​, సిట్టింగ్​ ఎంపీ, కాంగ్రెస్ నేత శతృఘ్న సిన్హా మధ్య పోటీ ఆసక్తికరం.
  4. గురుదాస్​పుర్ (పంజాబ్​)​: రాష్ట్రంలో భాజపా ఆశలు పెట్టుకున్నది సన్నీ దేఓల్​పైనే. ప్రత్యర్థిగా కాంగ్రెస్​ నుంచి సునీల్​ కుమార్​ జాఖర్​ నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది.

పంజాబ్​లో శిరోమణి అకాలీదళ్​ అధినేత సుఖ్​బీర్​ సింగ్​ బాదల్​, ఇద్దరు కేంద్రమంత్రులు హర్​సిమ్రత్​ కౌర్​ బాదల్​, హర్​దీప్​ సింగ్​ పురి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

ఇదీ చూడండి: పవిత్ర గుహలో 'మోదీ బాబా' యోగ ముద్ర

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : May 18, 2019, 4:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.