బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి వేడుకల కోసం స్నేహితులతో కలిసి ఏర్పాట్లు చేస్తుండగా ఓ యువకుడిని విద్యుదాఘాతం రూపంలో మృత్యువు కబళించింది. ఈ విషాద ఘటన.. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కొండాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొందరు యువకులు మంగళవారం.. అంబేడ్కర్ జయంత్యుత్సవాల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ సమయంలో విగ్రహం వద్ద అజయ్.. తోరణాలు, లైటింగ్ ఏర్పాటు చేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంటు వైర్లు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు.
యువకుడి మృతితో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. చేతికందొచ్చిన కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి: దేశంలో ఎక్కడా లేని విధంగా దివ్యాంగులకు సాయం: ఎర్రబెల్లి