ETV Bharat / crime

రసాయన పరిశ్రమలో అగ్నిప్రమాదం.. చికిత్స పొందుతూ కార్మికుడు మృతి

author img

By

Published : Jan 23, 2022, 10:04 AM IST

Fire Accident in pharma company: సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని ఓ రసాయన పరిశ్రమలో రెండ్రోజుల క్రితం జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన కార్మికుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు. ఆ అగ్నిప్రమాదంలో నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.

రసాయన పరిశ్రమలో అగ్నిప్రమాదం..  చికిత్స పొందుతూ కార్మికుడు మృతి
రసాయన పరిశ్రమలో అగ్నిప్రమాదం.. చికిత్స పొందుతూ కార్మికుడు మృతి

Fire Accident: సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలోని ఏరిన్ లైఫ్ సైన్స్ పరిశ్రమలో శుక్రవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. డ్రైయర్ వద్ద పౌడర్​ను తీస్తుండగా నిప్పురవ్వలు చెలరేగి ఆ ప్రాంతమంతా తగలబడింది. ఈ ఘటనలో నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.

వీరిని హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆ నలుగురిలో కెమిస్ట్ నితీశ్​ పండిట్​ చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఇతను ఆరునెలల క్రితమే ఉద్యోగంలో చేరినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ రమణకుమార్​ వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Fire Accident: సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలోని ఏరిన్ లైఫ్ సైన్స్ పరిశ్రమలో శుక్రవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. డ్రైయర్ వద్ద పౌడర్​ను తీస్తుండగా నిప్పురవ్వలు చెలరేగి ఆ ప్రాంతమంతా తగలబడింది. ఈ ఘటనలో నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.

వీరిని హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆ నలుగురిలో కెమిస్ట్ నితీశ్​ పండిట్​ చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఇతను ఆరునెలల క్రితమే ఉద్యోగంలో చేరినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ రమణకుమార్​ వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.