ETV Bharat / crime

Cheating: హైకోర్టులో ఉద్యోగం పేరుతో మహిళ చీటింగ్​.. - హైకోర్టులో ఉద్యోగాలు పేరుతో మోసం

ఏపీ హైకోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు వసూలు చేసిన మహిళను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. రూ. లక్షా 80 వేలు తీసుకుని.. ఆపై బెదిరింపులకు పాల్పడుతుండటంతో సదరు బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదుతో మహిళను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.

cheating in the name of job
హైకోర్టులో ఉద్యోగం అంటూ మోసం
author img

By

Published : Jul 17, 2021, 4:34 PM IST

ఆంధ్రప్రదేశ్​ హైకోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ముగ్గురు మహిళల నుంచి రూ. లక్షా 80 వేలు వసూలు చేసిన మహిళపై విజయవాడలోని గవర్నర్​పేట పోలీసులు అరెస్టు చేశారు. పాయకాపురంలోని ప్రకాశ్ నగర్‌కు చెందిన సరోజిని.. భర్త మరణించడంతో ఇద్దరు పిల్లలతో కలిసి గవర్నర్​పేటలోని పెద్దిబొట్లవారివీధిలో టైలరింగ్ దుకాణంలో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది.

తన వద్దకు వచ్చే కస్టమర్లతో మాట కలిపి.. తనకు హైకోర్టులో జడ్జి తెలుసని మాయమాటలు చెప్పి ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికింది. రూ.60 వేలు కడితే ఉద్యోగం వస్తుందని నమ్మకంగా చెప్పగా.. గత సంవత్సరం సెప్టెంబరులో బాధితులు డబ్బులు కట్టారు. ఎన్నిసార్లు ఉద్యోగం గురించి అడిగినా దాటవేస్తూ వచ్చింది. పైగా డబ్బులు తిరిగి ఇవ్వకపోగా.. ఉద్యోగాలంటూ ఇబ్బంది పెడితే చంపిస్తానని స్వర్ణకుమారి బెదిరిస్తోందని బాధితులు వాపోయారు. మోసపోయామని గమనించి చివరికి పోలీసులను ఆశ్రయించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. స్వర్ణకుమారిని అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరు పరిచారు.

ఆంధ్రప్రదేశ్​ హైకోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ముగ్గురు మహిళల నుంచి రూ. లక్షా 80 వేలు వసూలు చేసిన మహిళపై విజయవాడలోని గవర్నర్​పేట పోలీసులు అరెస్టు చేశారు. పాయకాపురంలోని ప్రకాశ్ నగర్‌కు చెందిన సరోజిని.. భర్త మరణించడంతో ఇద్దరు పిల్లలతో కలిసి గవర్నర్​పేటలోని పెద్దిబొట్లవారివీధిలో టైలరింగ్ దుకాణంలో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది.

తన వద్దకు వచ్చే కస్టమర్లతో మాట కలిపి.. తనకు హైకోర్టులో జడ్జి తెలుసని మాయమాటలు చెప్పి ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికింది. రూ.60 వేలు కడితే ఉద్యోగం వస్తుందని నమ్మకంగా చెప్పగా.. గత సంవత్సరం సెప్టెంబరులో బాధితులు డబ్బులు కట్టారు. ఎన్నిసార్లు ఉద్యోగం గురించి అడిగినా దాటవేస్తూ వచ్చింది. పైగా డబ్బులు తిరిగి ఇవ్వకపోగా.. ఉద్యోగాలంటూ ఇబ్బంది పెడితే చంపిస్తానని స్వర్ణకుమారి బెదిరిస్తోందని బాధితులు వాపోయారు. మోసపోయామని గమనించి చివరికి పోలీసులను ఆశ్రయించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. స్వర్ణకుమారిని అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరు పరిచారు.

ఇదీ చదవండి: NGT: సింగరేణి అక్రమ మైనింగ్‌పై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఆగ్రహం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.