ETV Bharat / crime

MURDER: దారుణం: నవవధువు గొంతు కోసి హతమార్చారు!

author img

By

Published : Jul 24, 2021, 11:37 AM IST

కరీంనగర్ జిల్లా బొమ్మనపల్లిలో దారుణం చోటుచేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు నవవధువు గొంతు కోశారు. అత్తగారింట్లో ఒంటరిగా ఉన్న వివాహితపై ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

MURDER in bommanapalli, woman murdered
మహిళ దారుణ హత్య, బొమ్మనపల్లిలో నవవధువు హత్య

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లిలో దారుణం చోటుచేసుకుంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న ప్రణాళిక అనే వివాహితను గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోశారు. రెండు నెలల క్రితమే బొమ్మనపల్లి గ్రామానికి చెందిన మ్యాధర అనిల్ (26)తో ఆమె వివాహం జరిగింది. శుక్రవారం సాయంత్రం అత్తగారింట్లో ప్రణాళిక ఒంటరిగా ఉన్న సమయంలో ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. మృతురాలు ప్రణాళిక బీటెక్ పూర్తి చేసింది. భర్త అనిల్ హుస్నాబాద్ పట్టణంలో వాహనాల బ్యాటరీ షాపు నిర్వహిస్తుంటాడు.

వ్యవసాయ పనుల కోసం బయటికి వెళ్లి వచ్చిన అత్తమామలు రక్తపు మడుగులో పడి ఉన్న ప్రణాళికను చూసి... వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సీపీ కమలాసన్ రెడ్డి మృతదేహాన్ని, హత్య జరిగిన పరిసరాలను పరిశీలించారు. కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

హత్య కేసు కింద కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నారు. నవ వధువు మృతితో రెండు కుటుంబాల్లో విషాదం చోటుచేసుకుంది.

ఇదీ చదవండి: ACCIDENT: అమ్మకు ఆయువు తీరింది.. పాపాయికి కన్నీరే మిగిలింది..

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లిలో దారుణం చోటుచేసుకుంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న ప్రణాళిక అనే వివాహితను గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోశారు. రెండు నెలల క్రితమే బొమ్మనపల్లి గ్రామానికి చెందిన మ్యాధర అనిల్ (26)తో ఆమె వివాహం జరిగింది. శుక్రవారం సాయంత్రం అత్తగారింట్లో ప్రణాళిక ఒంటరిగా ఉన్న సమయంలో ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. మృతురాలు ప్రణాళిక బీటెక్ పూర్తి చేసింది. భర్త అనిల్ హుస్నాబాద్ పట్టణంలో వాహనాల బ్యాటరీ షాపు నిర్వహిస్తుంటాడు.

వ్యవసాయ పనుల కోసం బయటికి వెళ్లి వచ్చిన అత్తమామలు రక్తపు మడుగులో పడి ఉన్న ప్రణాళికను చూసి... వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సీపీ కమలాసన్ రెడ్డి మృతదేహాన్ని, హత్య జరిగిన పరిసరాలను పరిశీలించారు. కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

హత్య కేసు కింద కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నారు. నవ వధువు మృతితో రెండు కుటుంబాల్లో విషాదం చోటుచేసుకుంది.

ఇదీ చదవండి: ACCIDENT: అమ్మకు ఆయువు తీరింది.. పాపాయికి కన్నీరే మిగిలింది..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.