ETV Bharat / crime

నీటిగుంతలో పడి ఇద్దరు బాలికలు మృతి - telangana news

నీటిగుంతలో చేపలు పట్టడానికి వెళ్లిన బాలికలు ప్రమాదవశాత్తు నీటిలో పడి గల్లంతయ్యారు. ఈ విషాద ఘటన మేడ్చల్ జిల్లా దూలపల్లిలో చోటుచేసుకుంది.

girls died in medchal distrit, two girls died in medchal
మేడ్చల్ జిల్లాలో బాలికలు గల్లంతు, నీటి గుంతలో పడి బాలికలు మృతి
author img

By

Published : May 31, 2021, 10:23 PM IST

మేడ్చల్ జిల్లా దూలపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉండే బాలికలు సంజన(13), కరీనా(12) క్వారీ నీటిగుంతలో చేపలు పట్టడానికి వెళ్లారు. ప్రమాదవశాత్తు అందులో పడి గల్లంతయ్యారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్లను రంగంలోకి దింపారు.

ఒకరి మృతదేహాన్ని వెలికి తీసిన ఈతగాళ్లు.. మరో బాలిక కోసం గాలిస్తున్నారు. ఇద్దరు బాలికలు మృతి చెందడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

మేడ్చల్ జిల్లా దూలపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉండే బాలికలు సంజన(13), కరీనా(12) క్వారీ నీటిగుంతలో చేపలు పట్టడానికి వెళ్లారు. ప్రమాదవశాత్తు అందులో పడి గల్లంతయ్యారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్లను రంగంలోకి దింపారు.

ఒకరి మృతదేహాన్ని వెలికి తీసిన ఈతగాళ్లు.. మరో బాలిక కోసం గాలిస్తున్నారు. ఇద్దరు బాలికలు మృతి చెందడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.