ETV Bharat / crime

రెండు వేర్వేరు ఘటనల్లో చెరువులో పడి ఇద్దరు మృతి

author img

By

Published : Apr 19, 2021, 3:20 PM IST

రెండు వేర్వేరు ఘటనల్లో చెరువులో పడి ఇద్దరు మృతి చెందిన ఘటన మేడ్చల్​ మల్కాజ్​గిరి జిల్లాలో చోటుచేసుకుంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు.

two died in lake
చెరువులో పడి ఇద్దరు మృతి

మేడ్చల్​ మల్కాజ్​గిరి జిల్లాలో ప్రమాదవశాత్తు ఇద్దరు చెరువులో పడి మృతి చెందారు. బౌరంపేటకు చెందిన సంతోష్​(24), వినోద్​ ఆదివారం సాయంత్రం గేదెలను మేపేందుకు సమీప చెరువు వద్దకు తీసుకెళ్లారు. చెరువులోకి వెళ్లిన గేదెలను బయటకు తీసే క్రమంలో సంతోష్​ ప్రమాదవశాత్తు అందులోనే మునిగి చనిపోయాడు. వినోద్​ ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. గజ ఈతగాళ్ల సాయంతో బయటకు తీశారు.

మరో ఘటనలో దుండిగల్​ పరిధికి చెందిన సురేష్​ మద్యం మత్తులో.. మల్లంపేట కత్వ చెరువు వద్దకు వెళ్లాడు. మత్తులో ఉన్న అతను​ అందులో పడి మృతి చెందాడు. ప్రమాదవశాత్తు చెరువులో పడ్డాడా.. లేక ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రులకు తరలించారు.

మేడ్చల్​ మల్కాజ్​గిరి జిల్లాలో ప్రమాదవశాత్తు ఇద్దరు చెరువులో పడి మృతి చెందారు. బౌరంపేటకు చెందిన సంతోష్​(24), వినోద్​ ఆదివారం సాయంత్రం గేదెలను మేపేందుకు సమీప చెరువు వద్దకు తీసుకెళ్లారు. చెరువులోకి వెళ్లిన గేదెలను బయటకు తీసే క్రమంలో సంతోష్​ ప్రమాదవశాత్తు అందులోనే మునిగి చనిపోయాడు. వినోద్​ ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. గజ ఈతగాళ్ల సాయంతో బయటకు తీశారు.

మరో ఘటనలో దుండిగల్​ పరిధికి చెందిన సురేష్​ మద్యం మత్తులో.. మల్లంపేట కత్వ చెరువు వద్దకు వెళ్లాడు. మత్తులో ఉన్న అతను​ అందులో పడి మృతి చెందాడు. ప్రమాదవశాత్తు చెరువులో పడ్డాడా.. లేక ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రులకు తరలించారు.

ఇదీ చదవండి: రాగల మూడ్రోజులు ఒకట్రెండు చోట్ల వర్షాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.