మేడ్చల్ జిల్లా కీసర మండలం నేతాజీ నగర్లో పేకాట స్థావరంపై మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ... గత కొంత కాలంగా నేతాజీ నగర్లో పలువురు పేకాట ఆడుతున్నారు. పక్కా సమాచారంతో పోలీసులు ఈ రోజు దాడులు నిర్వహించారు.
మొత్తం 19 మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 2 లక్షల 4 వేల 380 రూపాయలు, 16 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఇంకెవరైనా పేకాట ఆడినట్లు తెలిస్తే... కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ఇదీ చదవండి: PRC: ఉద్యోగులకు గుడ్న్యూస్... అమల్లోకి రానున్న పీఆర్సీ!!