మెదక్ జిల్లా పడాలపల్లి గ్రామానికి చెందిన కానుకుంట యాదయ్య(65) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఇంట్లోనే ఉంటున్నాడు. ఆయన కొడుకు కృష్ణ (34) కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతూ మూడు రోజులుగా గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో తండ్రి తీవ్ర అస్వస్థతకు గురై చనిపోయాడు. అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తుండగానే గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొడుకు కృష్ణ చనిపోయినట్లు సమాచారం వచ్చింది.
ఒకే రోజు తండ్రీకొడుకులు అకస్మాత్తుగా చనిపోవడంతో ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. యాదయ్య భార్య నర్సమ్మ, కృష్ణ భార్య లక్ష్మి ఆమె ఇద్దరు పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపించారు. స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ అరుణ భర్త వెంకటేశ్ గౌడ్ దగ్గరుండి తండ్రీ కొడుకుల అంత్యక్రియలు పూర్తి చేయించారు.
ఇదీ చదవండి: పల్లెలను కబళిస్తున్న కరోనా మహమ్మారి