ETV Bharat / crime

పురుగుల మందు తాగి సచివాలయ ఉద్యోగి బలవన్మరణం

పని ఒత్తిడి తాళలేక సచివాలయ ఉద్యోగి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా మీనవల్లూరులో జరిగింది.

author img

By

Published : Mar 29, 2021, 8:11 PM IST

ap west godavari, sachivalam employe
suicide, sachivalayam employe died

ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం మీనవల్లూరుకు చెందిన కోణాల వెంకట భాస్కరరావు.. స్థానికంగా ఉన్న గ్రామ సచివాలయంలో ఎడ్యుకేషన్ వెల్ఫేర్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నాడు. ఉద్యోగరీత్యా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటోందని పలుమార్లు తన భార్య వద్ద వాపోయాడు. ఈ క్రమంలో ఈ నెల 25న భాస్కరరావు అతని సోదరుడు నాగ సూర్యనారాయణ మూర్తి నివాసానికి వెళ్లాడు. అక్కడ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

గమనించిన సోదరుడు.. భాస్కరరావును ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ భాస్కరరావు.. ఆదివారం మృతి చెందాడు. ఊహించని ఈ ఘటనతో భాస్కరరావు కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం మీనవల్లూరుకు చెందిన కోణాల వెంకట భాస్కరరావు.. స్థానికంగా ఉన్న గ్రామ సచివాలయంలో ఎడ్యుకేషన్ వెల్ఫేర్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నాడు. ఉద్యోగరీత్యా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటోందని పలుమార్లు తన భార్య వద్ద వాపోయాడు. ఈ క్రమంలో ఈ నెల 25న భాస్కరరావు అతని సోదరుడు నాగ సూర్యనారాయణ మూర్తి నివాసానికి వెళ్లాడు. అక్కడ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

గమనించిన సోదరుడు.. భాస్కరరావును ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ భాస్కరరావు.. ఆదివారం మృతి చెందాడు. ఊహించని ఈ ఘటనతో భాస్కరరావు కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

ఇదీ చూడండి: లైవ్​ వీడియో: మద్యం మత్తులో 220 కేవీ విద్యుత్​ టవర్​ ఎక్కి హల్​చల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.