ETV Bharat / crime

స్కూల్​ బస్సును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. అందులో 30 మంది విద్యార్థులు

author img

By

Published : Jan 31, 2023, 9:50 AM IST

Updated : Jan 31, 2023, 2:00 PM IST

school bus accident at yellareddypet
school bus accident at yellareddypet

09:47 January 31

ఎల్లారెడ్డిపేటలో స్కూల్ బస్సును వెనక నుంచి ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

school bus accident at yellareddypet: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రమాదం జరిగింది. జిల్లాలోని ఎల్లారెడ్డిపేటలో ఇవాళ ఉదయం స్కూల్‌ పిల్లలతో వెళ్తున్న బస్సును వెనుక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు బలంగా ఢీ కొట్టింది. దీంతో బస్సులో ఉన్న సుమారు 30 మంది చిన్నారులకు గాయాలయ్యాయి. వెంటనే గమనించిన స్థానికులు, కొందరు యువకులు గాయపడిన విద్యార్థులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ ఘటనపై జిల్లా కలెక్టర్‌ స్పందించారు. ప్రమాదానికి గల కారణాలను డీఈవోను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన చిన్నారులకు మెరుగైన వైద్యం అందించేలా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

KTR response on yellareddypet accident: ఎల్లారెడ్డిపేట ప్రమాద ఘటనపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ , బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యతో ఫోన్​లో మాట్లాడి.. విద్యార్థుల క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నారు. గాయపడిన చిన్నారులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. అవసరమైతే హైదరాబాద్‌కు తరలించి చికిత్స అందేలా చూడాలని సూచించారు.

ఇవీ చదవండి:

09:47 January 31

ఎల్లారెడ్డిపేటలో స్కూల్ బస్సును వెనక నుంచి ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

school bus accident at yellareddypet: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రమాదం జరిగింది. జిల్లాలోని ఎల్లారెడ్డిపేటలో ఇవాళ ఉదయం స్కూల్‌ పిల్లలతో వెళ్తున్న బస్సును వెనుక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు బలంగా ఢీ కొట్టింది. దీంతో బస్సులో ఉన్న సుమారు 30 మంది చిన్నారులకు గాయాలయ్యాయి. వెంటనే గమనించిన స్థానికులు, కొందరు యువకులు గాయపడిన విద్యార్థులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ ఘటనపై జిల్లా కలెక్టర్‌ స్పందించారు. ప్రమాదానికి గల కారణాలను డీఈవోను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన చిన్నారులకు మెరుగైన వైద్యం అందించేలా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

KTR response on yellareddypet accident: ఎల్లారెడ్డిపేట ప్రమాద ఘటనపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ , బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యతో ఫోన్​లో మాట్లాడి.. విద్యార్థుల క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నారు. గాయపడిన చిన్నారులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. అవసరమైతే హైదరాబాద్‌కు తరలించి చికిత్స అందేలా చూడాలని సూచించారు.

ఇవీ చదవండి:

Last Updated : Jan 31, 2023, 2:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.