ETV Bharat / crime

ROBBERY: గుడిలో చోరీ... 48 గంటల్లో ఛేదించిన పోలీసులు

author img

By

Published : Jun 18, 2021, 5:39 PM IST

గుడిలో చోరి జరిగిన 48 గంటల్లో దొంగలను పట్టుకోని ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు వికారాబాద్ పోలీసులు. దొంగలను అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. కేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

robber in temple and police chase the case
ROBBERY: గుడిలో చోరీ... 48 గంటల్లో ఛేదించిన పోలీసులు

వికారాబాద్ జిల్లా మోమిన్​పేట మండలం ఎన్కతల గ్రామంలోని శనేశ్వరాలయంలో ఈనెల 16వ తేదీ అర్థరాత్రి దొంగతనం జరిగింది. ఆలయ ఈవో శేఖర్ గౌడ్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ ముమ్మరం చేసి 48 గంటల్లో కేసును ఛేదించారు.

పాత నేరస్థుడైన మహ్మద్ మారూఫ్​పై గతంలో దొంగతనం ఆరోపణలు ఉండడంతో పోలీసులు ఆ కోణంలో విచారణ చేశారు. మహ్మద్ మారూఫ్​ను అదుపులోకి తీసుకోని తమదైన రీతిలో విచారించగా... మహ్మద్ ఖుద్దుస్, మహ్మద్ ఖలీల్​లతో కలిసి దొంగతనం చేసినట్లు నేరం అంగీకరించాడు. మొత్తం 6 కిలోల వెండి ఆభరణాలను వారి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ నారాయణ తెలిపారు. నిందితులను రిమాండ్​కు తరలించారు. కేసును 48 గంటల్లో ఛేదించిన పోలీసు సిబ్బందికి ఎస్పీ రివార్డులు అందించారు.

వికారాబాద్ జిల్లా మోమిన్​పేట మండలం ఎన్కతల గ్రామంలోని శనేశ్వరాలయంలో ఈనెల 16వ తేదీ అర్థరాత్రి దొంగతనం జరిగింది. ఆలయ ఈవో శేఖర్ గౌడ్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ ముమ్మరం చేసి 48 గంటల్లో కేసును ఛేదించారు.

పాత నేరస్థుడైన మహ్మద్ మారూఫ్​పై గతంలో దొంగతనం ఆరోపణలు ఉండడంతో పోలీసులు ఆ కోణంలో విచారణ చేశారు. మహ్మద్ మారూఫ్​ను అదుపులోకి తీసుకోని తమదైన రీతిలో విచారించగా... మహ్మద్ ఖుద్దుస్, మహ్మద్ ఖలీల్​లతో కలిసి దొంగతనం చేసినట్లు నేరం అంగీకరించాడు. మొత్తం 6 కిలోల వెండి ఆభరణాలను వారి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ నారాయణ తెలిపారు. నిందితులను రిమాండ్​కు తరలించారు. కేసును 48 గంటల్లో ఛేదించిన పోలీసు సిబ్బందికి ఎస్పీ రివార్డులు అందించారు.

ఇదీ చూడండి: Murder : తల్లీకూతుళ్ల దారుణ హత్య.. అల్లుడే హంతకుడు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.