మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాలానగర్ పరిధిలోని.. బీహెచ్ఈఎల్లో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్పై ఉన్న ముగ్గురు మైనర్లకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు.
తీవ్ర గాయాల పాలైన బాధితులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:భర్తపై వేడి నూనె, కారం చల్లి పరారైన భార్య, కూతురు