ETV Bharat / crime

లారీ-కారు ఢీ.. నలుగురు దుర్మరణం

author img

By

Published : May 13, 2021, 7:15 AM IST

Updated : May 13, 2021, 11:45 AM IST

లారీ-కారు ఢీకొన్న ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. ఈ దుర్ఘటన ఏపీలోని పెద్దాపురంలో చోటు చేసుకుంది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పెద్దాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

road-accident-at-samarlakota-four-died
లారీ-కారు ఢీ.. నలుగురు దుర్మరణం

ఆంధ్రప్రదేశ్​లోని తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం ఏడీబీ రహదారిపై గురువారు తెల్లవారుజామున ఘోరప్రమాదం జరిగింది. లారీ-కారు ఢీకొని 5 నెలల చిన్నారి సహా నలుగురు మృతి చెందారు. ఏడీబీ రహదారి పారిశ్రామిక ప్రాంతం వద్ద ఈ ఘటన జరిగింది.

లారీ-కారు ఢీ.. నలుగురు దుర్మరణం

గృహప్రవేశ వేడుకలో పాల్గొనేందుకు తాళ్లరేవు మండలం పెద్దవలస నుంచి రాజమహేంద్రవరానికి తొమ్మిది మంది కుటుంబసభ్యులు ఓ కారులో బయలుదేరారు. పెద్దాపురంలోని ఏడీబీ రోడ్డుపై ఉన్న రుచి సోయా పరిశ్రమ వద్దకు చేరుకునేసరికి డ్రైవర్‌ నిద్రమత్తులో ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మృతిచెందిన వారిలో ఐదు నెలల చిన్నారి ఉంది. సమాచారం అందుకున్న పెద్దాపురం సీఐ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘ‌ట‌నపై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పెద్దాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి: కరోనా వైరస్‌ను దరిచేరనివ్వని బస్తీ వాసులు

ఆంధ్రప్రదేశ్​లోని తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం ఏడీబీ రహదారిపై గురువారు తెల్లవారుజామున ఘోరప్రమాదం జరిగింది. లారీ-కారు ఢీకొని 5 నెలల చిన్నారి సహా నలుగురు మృతి చెందారు. ఏడీబీ రహదారి పారిశ్రామిక ప్రాంతం వద్ద ఈ ఘటన జరిగింది.

లారీ-కారు ఢీ.. నలుగురు దుర్మరణం

గృహప్రవేశ వేడుకలో పాల్గొనేందుకు తాళ్లరేవు మండలం పెద్దవలస నుంచి రాజమహేంద్రవరానికి తొమ్మిది మంది కుటుంబసభ్యులు ఓ కారులో బయలుదేరారు. పెద్దాపురంలోని ఏడీబీ రోడ్డుపై ఉన్న రుచి సోయా పరిశ్రమ వద్దకు చేరుకునేసరికి డ్రైవర్‌ నిద్రమత్తులో ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మృతిచెందిన వారిలో ఐదు నెలల చిన్నారి ఉంది. సమాచారం అందుకున్న పెద్దాపురం సీఐ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘ‌ట‌నపై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పెద్దాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి: కరోనా వైరస్‌ను దరిచేరనివ్వని బస్తీ వాసులు

Last Updated : May 13, 2021, 11:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.