రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మైలార్ దేవులపల్లి ఠాణా పరిధిలో ఓ నీళ్ల ట్యాంకర్ బీభత్సం సృష్టించింది. మహఫిల్ హోటల్ ముందు నిలిపి ఉంచిన వాహనాలను ఢీకొట్టింది. ప్రమాదంలో నాలుగు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఘటనలో గాయపడిన ఓ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది.
వాహనం బ్రేకులు పనిచేయకపోవడం వల్లనే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: సీఐ ఫేస్బుక్ హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు