సిమ్ నెట్వర్క్ యాక్టివేషన్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న నిందితున్ని రాచకొండ సైబర్ క్రైం పొలీసులు అరెస్ట్ చేశారు. జార్ఖండ్ జాంతారకి చెందిన బీర్బల్ పండిట్... నెట్వర్క్ గడువు ముగుస్తుందంటూ జనవరి 17 ఓ మహిళకు సందేశం పంపించాడు. అనంతరం ఫోన్చేసి క్విక్ సపోర్ట్ యాప్ డౌన్లోడ్ చేయించిన పండిట్... రీ యాక్టివేషన్ కోసం ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా రూ.10 పంపమనన్నాడు.
బాధితురాలు వెంటనే రూ.10 పంపింది. క్విక్ సపోర్ట్ యాప్ ద్వారా ఓటీపీ కాపీ చేసిన పండిట్.. ఖాతాలోని 6 లక్షల 40 వేలను స్వాహా చేశాడు. మోసపోయానని తెలుసుకున్న బాధితురాలు రాచకొండ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితున్ని అరెస్ట్ చేశారు.