ETV Bharat / crime

Pigs breeders tyranny: 'అధికారులనే కొడతాం... మీరెంత..'

author img

By

Published : Mar 24, 2022, 6:57 PM IST

Pigs breeders tyranny: ఏపీలోని పెద్దాపురంలో పందులను పట్టుకోవడానికి మున్సిపల్​ అధికారులు పురమాయించిన వారిపై పందుల పెంపకందారులు కర్రలతో దాడి చేశారు. పందుల బెడదపై ఫిర్యాదులు రావడంతో.. పందులను పట్టుకునేందుకు అధికారులు రప్పించిన వారిపై పెంపకందారులు కర్రలతో దాడికి దిగారు.

Pigs breeders tyranny: 'అధికారులనే కొడతాం... మీరెంత..'
Pigs breeders tyranny: 'అధికారులనే కొడతాం... మీరెంత..'
'అధికారులనే కొడతాం... మీరెంత..'

Pigs breeders tyranny: రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతున్న పందులను పట్టుకునేందుకు వెళ్లిన వారిని పందుల పెంపకందారులు కర్రలతో కొట్టి, పిడి గుద్దులు గుద్దిన ఘటన ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో చోటుచేసుకుంది. నివాస ప్రాంతాల్లో పందులు తిరుగుతూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయని.. మున్సిపల్​ అధికారులకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. దీంతో మున్సిపల్​ కౌన్సిల్​లో తీర్మానం చేసి పందుల పెంపకం దారులను పట్టణానికి దూరంగా వెళ్లాలని నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ వారిలో మార్పు రాకపోవడంతో ప్రజారోగ్యం దృష్ట్యా పందులను పట్టుకునేందుకు మున్సిపల్​ అధికారులు.. తెలంగాణలోని ఖమ్మం నుంచి మనుషులను రప్పించి వీధుల్లో తిరుగుతున్న పందులను పట్టుకునే ప్రయత్నం చేశారు.

పందుల పెంపకం దారులు ఒక్కసారిగా పందులను పట్టుకుంటున్న వారిపై కర్రలతో దాడి చేశారు. అంతటితో ఆగకుండా మున్సిపల్​ అధికారులపై దౌర్జన్యానికి దిగారు. వాహనంలో ఉన్న పందులను విడిపించుకుని వెళ్లిపోయారు. ఈ విషయంపై పెద్దాపురం పోలీసులకు బాధితులు, మునిసిపల్ అధికారులు ఫిర్యాదు చేశారు. అధికారులనే కొడతాం మీరెంతా.. అంటూ తమను విచక్షణ రహితంగా కొట్టారని.. మీడియా ముందు బాధితులు వాపోయారు.

ఇదీ చదవండి:

'అధికారులనే కొడతాం... మీరెంత..'

Pigs breeders tyranny: రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతున్న పందులను పట్టుకునేందుకు వెళ్లిన వారిని పందుల పెంపకందారులు కర్రలతో కొట్టి, పిడి గుద్దులు గుద్దిన ఘటన ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో చోటుచేసుకుంది. నివాస ప్రాంతాల్లో పందులు తిరుగుతూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయని.. మున్సిపల్​ అధికారులకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. దీంతో మున్సిపల్​ కౌన్సిల్​లో తీర్మానం చేసి పందుల పెంపకం దారులను పట్టణానికి దూరంగా వెళ్లాలని నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ వారిలో మార్పు రాకపోవడంతో ప్రజారోగ్యం దృష్ట్యా పందులను పట్టుకునేందుకు మున్సిపల్​ అధికారులు.. తెలంగాణలోని ఖమ్మం నుంచి మనుషులను రప్పించి వీధుల్లో తిరుగుతున్న పందులను పట్టుకునే ప్రయత్నం చేశారు.

పందుల పెంపకం దారులు ఒక్కసారిగా పందులను పట్టుకుంటున్న వారిపై కర్రలతో దాడి చేశారు. అంతటితో ఆగకుండా మున్సిపల్​ అధికారులపై దౌర్జన్యానికి దిగారు. వాహనంలో ఉన్న పందులను విడిపించుకుని వెళ్లిపోయారు. ఈ విషయంపై పెద్దాపురం పోలీసులకు బాధితులు, మునిసిపల్ అధికారులు ఫిర్యాదు చేశారు. అధికారులనే కొడతాం మీరెంతా.. అంటూ తమను విచక్షణ రహితంగా కొట్టారని.. మీడియా ముందు బాధితులు వాపోయారు.

ఇదీ చదవండి:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.