బాలికను లైంగికంగా వేధించిన ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని చర్లపల్లి ఐజీ కాలనీకి చెందిన మదిశెట్టి శ్రీనివాస్.. ఓ బాలికను లైంగిక వేధింపులకు గురిచేసేవాడు, అనంతరం విషయం ఎవరికీ చెప్పొద్దని భయపెట్టేవాడు. బాధితురాలు విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
ఇదీ చదవండి: పరిహారం కోసం ఆత్మహత్య.. మృతదేహంతో బంధువుల ఆందోళన