ETV Bharat / crime

నిత్య పెళ్లికొడుకు చేతిలో బాధితులు ఎంతమందో?..

author img

By

Published : Apr 2, 2021, 8:11 PM IST

అతనో నిత్యపెళ్లికొడుకు.. ఎంత మందిని పెళ్లిచేసుకున్నాడో ఎవరికీ తెలీదు. అందుకే విశాఖ పోలీసులు వినూత్న ఆలోచన చేశారు. ఈ నిత్య పెళ్లికొడుకు కోసం ఓ ప్రత్యేక వాట్సాప్ నెంబర్​ను కేటాయించారు. నిత్యపెళ్లికొడుకు బాధితులు 9493336633 ఈ నెంబరుకు కాల్ చేసి లేదా మెసేజ్ ద్వారా కానీ ఇతగాడి మోసాల గురించి చెప్పొచ్చు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతారు. అసలు ఈ నిత్యపెళ్లికొడుకు గురించి తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.

arun kumar Many Marriages in ap
నిత్య పెళ్లికొడుకు అరుణ్​ కుమార్

చేసేది స్వీపర్ ఉద్యోగం. కానీ బిల్డప్ మాత్రం సాప్ట్​వేర్ ఉద్యోగిలా ఉంటుంది. అంతేకాదు ఏడు పెళ్లిళ్లు చేసుకున్నట్లు పోలీసులకు సమాచారం. ఇప్పటివరకు ముగ్గురు మాత్రం బయటకు వచ్చి అతని వల్ల అన్యాయం జరిగిందని పోలీసుల ముందు లబోదిబోమన్నారు. మరికొందరు బాధితులు పరువు కోసం ఆలోచించి.. పోలీసుస్టేషన్ మెట్లు ఎక్కడానికి భయపడుతున్నారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ స్వయంగా చొరవ తీసుకోవడంతో నిత్యపెళ్లికొడుకు అరుణ్ కుమార్ నేరాల చిట్టా బయటపడుతోంది. ఏపీలోని విశాఖ పోలీసులు రంగంలోకి దిగి కేసు దర్యాప్తు వేగవంతం చేయడంతో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి.

అసలు ఏమైందంటే...

నిత్య పెళ్లికొడుకు అరుణ్​ కుమార్

భార్య, కుమార్తెను, తనతో సహజీవనం చేస్తున్న మరో మహిళను వ్యభిచారం చేయాలని ఒత్తిడి తెస్తున్న అరుణ్‌కుమార్‌ను విశాఖ నగరం కంచరపాలెం పోలీసులు అరెస్ట్‌ చేసి గురువారం రిమాండుకు తరలించారు. అతనిపై భార్య, మరో మహిళ చేసిన పలు ఆరోపణలను నిర్ధరించుకునేందుకు అతడిని జ్యుడీషియల్‌ కస్టడీలోకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. విశాఖ నగర డీసీపీ ఐశ్వర్య రస్తోగి ప్రత్యక్ష పర్యవేక్షణలో కేసును వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అరుణ్‌కుమార్‌పై కంచరపాలెం పోలీసులు 498ఎ, 506, 509, 323 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

అరుణ్‌కుమార్​తో సహజీవనం చేస్తున్న మహిళ.. తన భర్తను అతనే హత్య చేసినట్లు ఆరోపిస్తోంది. బాధితురాలి భర్త గతేడాది మార్చిలో ఒక బార్‌ వద్ద మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. వైద్యుల నివేదికలో అతని శరీరంపై ఎలాంటి గాయాలు లేవని తేలింది. మద్యం అధికంగా తీసుకోవడంతోనే అతను మరణించాడని నిర్దరించారు. ఆ అనుమానాస్పద మరణం వెనక మిస్టరీ ఏమైనా ఉందా? అనే కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు. తన భర్త మరణించిన తరువాత.. అరుణ్‌కుమార్‌ ఆమెతో సహజీవనం చేస్తున్నది వాస్తవమేనని తేలింది.

నా కోసం నా భర్తను చంపానన్నాడు..

అరుణ్ కుమార్ నా భర్తతో సన్నిహితంగా ఉండేవాడు... నన్ను చెల్లి అని పిలిచేవాడు. నా భర్త రాము 2019లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఆ తరువాత అరుణ్‌కుమార్‌ వచ్చి నా భర్తను తన కోసమే చంపానని చెప్పాడు. సహజీవనం చేయకపోతే పిల్లలిద్దరినీ చంపేస్తానని బెదిరించి కాపురం చేస్తున్నాడు. దీంతో అరుణ్ కుమార్ భార్య, నేను కొన్నాళ్లుగా ఒకే ఇంటిలో ఉంటున్నాం. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న అరుణ్‌కుమార్‌.. అతని భార్యను, నన్ను వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేశాడు.. నిరాకరించడంతో బాగా కొట్టాడు. విసిగిపోయి గత నెలలో పోలీసు కమిషనర్​కు వాయిస్‌ మేసేజ్‌ ద్వారా ఫిర్యాదు చేశాం. కేసును కంచరపాలెం పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. - బాధితురాలు

అప్పటికే ఓసారి జైలుకు వెళ్లి వచ్చాడు..

ఫిబ్రవరి 2021లో అరుణ్‌కుమార్‌ భార్య దిశ పోలీసులను ఆశ్రయించి తన గోడు వెళ్లబోసుకుంది. తన భర్తపై ఉన్న కేసుల విషయాలను ప్రస్తావించి.. అతనికి కౌన్సెలింగ్‌ ఇచ్చి మంచిగా మార్చాలని కోరింది. రెండు కేసుల్లో నిందితుడికి రిమాండ్‌ విధించగా.. అతన్ని జైలు నుంచి బయటకు తీసుకురావడానికి బెయిల్‌ దరఖాస్తు చేసింది కూడా ఆమెనని గుర్తించారు. ఫిబ్రవరి నెలలో అరుణ్‌కుమార్‌ జైలు నుంచి విడుదలయ్యాడు. సుమారు నెలన్నర వ్యవధిలోనే భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తాయి. వేధింపులకు గురి చేయడంతోపాటు దాడులు కూడా చేస్తుండడంతో అరుణ్‌కుమార్‌పై కేసు నమోదైంది.

బాధితులు ఒక్కొక్కరూ బయటకి వస్తున్నారు

అరుణ్‌కుమార్‌ కారణంగా వేధింపులకు గురైన మహిళల నుంచి సమాచారాన్ని సేకరించాలని పోలీసులు భావిస్తున్నారు. డీజీపీ కూడా బాధిత మహిళలు ఎవరైనా ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించిన విషయం తెలిసిందే. దీంతో మరో బాధితురాలు అరుణ్‌కుమార్‌పై ఫిర్యాదు చేయడానికి ముందుకు వచ్చారు. ఆమెను వివాహం చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అరుణ్‌కుమార్‌తో విభేదాలు రావడంతో ఆమె విడిపోయి వేరుగా బతుకుతున్నట్లు తేలింది. అరుణ్‌కుమార్‌పై వివిధ పోలీసుస్టేషన్లలో ఏమైనా కేసులు నమోదయ్యాయేమోనన్న కోణంలో పోలీసులు దృష్టి సారించారు.

నిత్యపెళ్లికొడుకుపై ఫిర్యాదు చేసేందుకు పోలీసులు ప్రత్యేక నెంబర్

ఈ మేరకు పోలీసులకు వచ్చిన సమాచారాన్ని కూడా పరిశీలిస్తున్నారు. అరుణ్‌కుమార్‌కు సంబంధించిన కేసు దర్యాప్తు జరుగుతోంది. అతనిపై ఉన్న అన్ని ఆరోపణలపై విచారిస్తున్నారు. ఆయా ఆరోపణలకు సంబంధించిన సాక్ష్యాలను సేకరిస్తున్నారు. అరుణ్‌కుమార్‌ కారణంగా వేధింపులకు గురైన మహిళలు ఎవరైనా ధైర్యంగా డీసీపీ-1 కార్యాలయానికి నేరుగా వచ్చిగానీ, పోలీసు వాట్సప్‌ నెంబరు 9493336633 ద్వారా గానీ ఫిర్యాదు, సమాచారం పంపితే తగిన చర్యలు తీసుకుంటామని.. బాధితుల వివరాలు గోప్యంగా ఉంచుతామని.. నగర శాంతి భద్రతల డీసీపీ ఐశ్వర్య రస్తోగి ప్రకటించారు.

ఇప్పటివరకూ ముగ్గురు..

ఈ నిత్యపెళ్లికొడుకు ఇప్పటివరకు ముగ్గురిని పెళ్లిచేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఏడుగురిని మోసం చేసినట్లు పోలీసులకు సమాచారం ఉంది. ఇంకా బాధితులు ఎంతమంది ఉన్నారనే విషయం తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి: లారీ రూపంలో దూసుకొచ్చిన మృతువు.. దంపతులు మృతి

చేసేది స్వీపర్ ఉద్యోగం. కానీ బిల్డప్ మాత్రం సాప్ట్​వేర్ ఉద్యోగిలా ఉంటుంది. అంతేకాదు ఏడు పెళ్లిళ్లు చేసుకున్నట్లు పోలీసులకు సమాచారం. ఇప్పటివరకు ముగ్గురు మాత్రం బయటకు వచ్చి అతని వల్ల అన్యాయం జరిగిందని పోలీసుల ముందు లబోదిబోమన్నారు. మరికొందరు బాధితులు పరువు కోసం ఆలోచించి.. పోలీసుస్టేషన్ మెట్లు ఎక్కడానికి భయపడుతున్నారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ స్వయంగా చొరవ తీసుకోవడంతో నిత్యపెళ్లికొడుకు అరుణ్ కుమార్ నేరాల చిట్టా బయటపడుతోంది. ఏపీలోని విశాఖ పోలీసులు రంగంలోకి దిగి కేసు దర్యాప్తు వేగవంతం చేయడంతో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి.

అసలు ఏమైందంటే...

నిత్య పెళ్లికొడుకు అరుణ్​ కుమార్

భార్య, కుమార్తెను, తనతో సహజీవనం చేస్తున్న మరో మహిళను వ్యభిచారం చేయాలని ఒత్తిడి తెస్తున్న అరుణ్‌కుమార్‌ను విశాఖ నగరం కంచరపాలెం పోలీసులు అరెస్ట్‌ చేసి గురువారం రిమాండుకు తరలించారు. అతనిపై భార్య, మరో మహిళ చేసిన పలు ఆరోపణలను నిర్ధరించుకునేందుకు అతడిని జ్యుడీషియల్‌ కస్టడీలోకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. విశాఖ నగర డీసీపీ ఐశ్వర్య రస్తోగి ప్రత్యక్ష పర్యవేక్షణలో కేసును వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అరుణ్‌కుమార్‌పై కంచరపాలెం పోలీసులు 498ఎ, 506, 509, 323 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

అరుణ్‌కుమార్​తో సహజీవనం చేస్తున్న మహిళ.. తన భర్తను అతనే హత్య చేసినట్లు ఆరోపిస్తోంది. బాధితురాలి భర్త గతేడాది మార్చిలో ఒక బార్‌ వద్ద మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. వైద్యుల నివేదికలో అతని శరీరంపై ఎలాంటి గాయాలు లేవని తేలింది. మద్యం అధికంగా తీసుకోవడంతోనే అతను మరణించాడని నిర్దరించారు. ఆ అనుమానాస్పద మరణం వెనక మిస్టరీ ఏమైనా ఉందా? అనే కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు. తన భర్త మరణించిన తరువాత.. అరుణ్‌కుమార్‌ ఆమెతో సహజీవనం చేస్తున్నది వాస్తవమేనని తేలింది.

నా కోసం నా భర్తను చంపానన్నాడు..

అరుణ్ కుమార్ నా భర్తతో సన్నిహితంగా ఉండేవాడు... నన్ను చెల్లి అని పిలిచేవాడు. నా భర్త రాము 2019లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఆ తరువాత అరుణ్‌కుమార్‌ వచ్చి నా భర్తను తన కోసమే చంపానని చెప్పాడు. సహజీవనం చేయకపోతే పిల్లలిద్దరినీ చంపేస్తానని బెదిరించి కాపురం చేస్తున్నాడు. దీంతో అరుణ్ కుమార్ భార్య, నేను కొన్నాళ్లుగా ఒకే ఇంటిలో ఉంటున్నాం. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న అరుణ్‌కుమార్‌.. అతని భార్యను, నన్ను వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేశాడు.. నిరాకరించడంతో బాగా కొట్టాడు. విసిగిపోయి గత నెలలో పోలీసు కమిషనర్​కు వాయిస్‌ మేసేజ్‌ ద్వారా ఫిర్యాదు చేశాం. కేసును కంచరపాలెం పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. - బాధితురాలు

అప్పటికే ఓసారి జైలుకు వెళ్లి వచ్చాడు..

ఫిబ్రవరి 2021లో అరుణ్‌కుమార్‌ భార్య దిశ పోలీసులను ఆశ్రయించి తన గోడు వెళ్లబోసుకుంది. తన భర్తపై ఉన్న కేసుల విషయాలను ప్రస్తావించి.. అతనికి కౌన్సెలింగ్‌ ఇచ్చి మంచిగా మార్చాలని కోరింది. రెండు కేసుల్లో నిందితుడికి రిమాండ్‌ విధించగా.. అతన్ని జైలు నుంచి బయటకు తీసుకురావడానికి బెయిల్‌ దరఖాస్తు చేసింది కూడా ఆమెనని గుర్తించారు. ఫిబ్రవరి నెలలో అరుణ్‌కుమార్‌ జైలు నుంచి విడుదలయ్యాడు. సుమారు నెలన్నర వ్యవధిలోనే భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తాయి. వేధింపులకు గురి చేయడంతోపాటు దాడులు కూడా చేస్తుండడంతో అరుణ్‌కుమార్‌పై కేసు నమోదైంది.

బాధితులు ఒక్కొక్కరూ బయటకి వస్తున్నారు

అరుణ్‌కుమార్‌ కారణంగా వేధింపులకు గురైన మహిళల నుంచి సమాచారాన్ని సేకరించాలని పోలీసులు భావిస్తున్నారు. డీజీపీ కూడా బాధిత మహిళలు ఎవరైనా ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించిన విషయం తెలిసిందే. దీంతో మరో బాధితురాలు అరుణ్‌కుమార్‌పై ఫిర్యాదు చేయడానికి ముందుకు వచ్చారు. ఆమెను వివాహం చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అరుణ్‌కుమార్‌తో విభేదాలు రావడంతో ఆమె విడిపోయి వేరుగా బతుకుతున్నట్లు తేలింది. అరుణ్‌కుమార్‌పై వివిధ పోలీసుస్టేషన్లలో ఏమైనా కేసులు నమోదయ్యాయేమోనన్న కోణంలో పోలీసులు దృష్టి సారించారు.

నిత్యపెళ్లికొడుకుపై ఫిర్యాదు చేసేందుకు పోలీసులు ప్రత్యేక నెంబర్

ఈ మేరకు పోలీసులకు వచ్చిన సమాచారాన్ని కూడా పరిశీలిస్తున్నారు. అరుణ్‌కుమార్‌కు సంబంధించిన కేసు దర్యాప్తు జరుగుతోంది. అతనిపై ఉన్న అన్ని ఆరోపణలపై విచారిస్తున్నారు. ఆయా ఆరోపణలకు సంబంధించిన సాక్ష్యాలను సేకరిస్తున్నారు. అరుణ్‌కుమార్‌ కారణంగా వేధింపులకు గురైన మహిళలు ఎవరైనా ధైర్యంగా డీసీపీ-1 కార్యాలయానికి నేరుగా వచ్చిగానీ, పోలీసు వాట్సప్‌ నెంబరు 9493336633 ద్వారా గానీ ఫిర్యాదు, సమాచారం పంపితే తగిన చర్యలు తీసుకుంటామని.. బాధితుల వివరాలు గోప్యంగా ఉంచుతామని.. నగర శాంతి భద్రతల డీసీపీ ఐశ్వర్య రస్తోగి ప్రకటించారు.

ఇప్పటివరకూ ముగ్గురు..

ఈ నిత్యపెళ్లికొడుకు ఇప్పటివరకు ముగ్గురిని పెళ్లిచేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఏడుగురిని మోసం చేసినట్లు పోలీసులకు సమాచారం ఉంది. ఇంకా బాధితులు ఎంతమంది ఉన్నారనే విషయం తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి: లారీ రూపంలో దూసుకొచ్చిన మృతువు.. దంపతులు మృతి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.