ETV Bharat / crime

తమ్ముడి గొడవతో వ్యక్తి మనస్తాపం.. ఆత్మహత్య

author img

By

Published : May 12, 2021, 8:32 PM IST

సంగారెడ్డి జిల్లాలో తమ్ముడు అతని భార్య ఆస్తి గురించి తనతో గొడవ పడడం జీర్ణించుకోలేని ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

man committed to suicidein sangareddy
తమ్ముడి గొడవతో వ్యక్తి మనస్తాపం.. ఆత్మహత్య

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం ముత్తంగి గ్రామానికి చెందిన మల్లేష్ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. మల్లేష్ తమ్ముడు శీను, అతడి భార్య రితన్య ఆస్తి విషయంలో మల్లేష్​తో గొడవ పెట్టుకున్నారు. ఆస్తి కోసం తమ్ముడు మరదలు తనతో గొడవపడడం జీర్ణించుకోలేని మల్లేష్ ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్​చెరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం ముత్తంగి గ్రామానికి చెందిన మల్లేష్ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. మల్లేష్ తమ్ముడు శీను, అతడి భార్య రితన్య ఆస్తి విషయంలో మల్లేష్​తో గొడవ పెట్టుకున్నారు. ఆస్తి కోసం తమ్ముడు మరదలు తనతో గొడవపడడం జీర్ణించుకోలేని మల్లేష్ ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్​చెరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

ఇవీ చదవండి: రాష్ట్రంలో కొనసాగుతున్న కొవిడ్‌ వ్యాక్సినేషన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.